జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుక్రవారం తనదైన శైలిలో అన్ని అంశాలపై కూలంకషంగానే స్పందించారు. అనారోగ్యం కారణంగా ఇటీవలే ఆపరేషన్ చేయించుకుని స్వల్ప వ్యవధి మాత్రమే రెస్ట్ తీసుకున్న పవన్… గురువారమే మంగళగిరి చేరుకున్నారు. శుక్రవారం మంగళగిరిలో ఏర్పాటు చేసిన జనసేన శ్రేణుల సమావేశంలో ప్రసంగించిన పవన్… ఈ వారం పది రోజులుగా తన గురించి జరిగిన అన్ని రకాల చర్చలకు సమాధానం ఇచ్చారు. తన సొంత సామాజిక వర్గం కాపులపైనా ఆయన తనదైన శైలి సెటైర్లు సంధించారు. అసలు మిమ్మల్ని నమ్మేదెలా అని కూడా ఆయన ప్రశ్నించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
దివంగత వంగవీటి రంగా గురించి చాలా మంది నేతలు ప్రస్తావిస్తున్న విషయంపై ప్రతిస్పందించిన పవన్…రంగా గారు బతికుండగా ఆయనను ఎందుకు రక్షించుకోలేకపోయారని ప్రశ్నించారు. బతికుండగానే తనకు ప్రాణహానీ ఉందని స్వయంగా రంగా గారే చెప్పినప్పటికీ ఏ ఒక్కరు కూడా ఆయనను రక్షించుకునే యత్నం చేయలేదని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. బతికుండగా మనిషిని కాపాడుకోలేకపోయిన వారు చనిపోయాక మాత్రం కబుర్లు చెబుతున్నారంటూ ఆయన తనదైన రీతిలో సెటైర్లు సంధించారు.
ఇక తానేదో ఒక సామాజిక వర్గానికి అండగా నిలుస్తున్నానని, తనకు ఆ సామాజిక వర్గం వెన్నుదన్నుగా నిలుస్తోందన్న వాదనలపైనా పవన్ సర్కాస్టిక్ గా స్పందించారు. కాపులంతా తనకు మద్దతుగా ఉన్నారని అనుకుంటే.. తాను రెండు చోట్ల ఎలా ఓడిపోతానని ప్రశ్నించారు.
కాపులంతా తన వెనకే ఉంటే తాను భీమవరంతో పాటు గాజువాకలో కూడా ఓడిపోకూడదు కదా అని ఆయన అన్నారు. ఇవన్ని ఒట్టి పుకార్లేనని, అయినా మిమ్మల్ని ఎలా నమ్మేది అంటూ ఆయన ఓ రేంజిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు రంగా భయం వెలిబుచ్చినప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్నవారంతా చిన్నపిల్లలేమీ కాదు కదా అని కూడా పవన్ వ్యాఖ్యానించి అందరినీ షాక్ కు గురి చేశారు.
This post was last modified on May 15, 2026 9:31 pm
అనిరుధ్ రవిచందర్ తర్వాత తమిళ దర్శకులు ఎక్కువగా జపిస్తున్న పేరు సాయి అభ్యంక్కర్. కుర్రాడు చాలా చిన్న వయసులోనే మ్యూజిక్…
యువ కథానాయకుడు రామ్ పోతినేని తన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు పెద్ద సర్ప్రైజే ఇచ్చాడు. తన కొత్త సినిమాను…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగానే కాకుండా… జగన్ కోసం ఏమైనా చేసేందుకు అనునిత్యం సిద్ధంగా…
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి…అనూహ్య రాజకీయ పరిణామాలను దాటుకుని మరీ తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలిగారు. తెలంగాణను సాధించిన…
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్.. సోషల్ మీడియా ఇన్ఫ్ల్యుయెన్సర్లు, సమాచార హక్కు చట్టం కింద ప్రభుత్వాన్ని, కోర్టులను ప్రశ్నించేవారిపై…
ఇండియన్ సినిమా చరిత్రలోనే ఆల్ టైం హైయెస్ట్ గ్రాసర్లలో ఒకటిగా నిలిచిన చిత్రం.. దురంధర్-2. గత ఏడాది చివర్లో వచ్చిన…