అనిరుధ్ రవిచందర్ తర్వాత తమిళ దర్శకులు ఎక్కువగా జపిస్తున్న పేరు సాయి అభ్యంక్కర్. కుర్రాడు చాలా చిన్న వయసులోనే మ్యూజిక్ సెన్సేషన్ అయిపోయాడు. యూత్ క్రమంగా ఇతని పాటల పట్ల బాగా ఆకర్షితులవుతున్నారు. ప్రదీప్ రంగనాధన్ డ్యూడ్ కి తను ఇచ్చిన సంగీతం మెయిన్ పాజిటివ్స్ లో ఒకటిగా నిలిచింది. అలాని ఎవర్ గ్రీన్ ఇచ్చాడని కాదు కానీ ఈ మధ్య కాలంలో అంత అవుట్ ఫుట్ అనిరుధ్ లాంటోళ్ళు సైతం అందించలేదనేది వాస్తవం.
ఇప్పుడీ కుర్రాడి ఖాతాలో అల్లు అర్జున్ రాకా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇక్కడో సమస్య ఉంది. సాయి అభ్యంక్కర్ తో బెస్ట్ రాబట్టుకోవడం అంత సులభం కాదు. తాజాగా విడుదలైన సూర్య కరుప్పు / వీరభద్రుడులో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వరకు కొంత పర్వాలేదు అనిపించుకున్నాడు కానీ పాటల దగ్గర దొరికిపోయాడు. హోరెత్తిపోయే సౌండ్స్ తో కొంచెం ఇబ్బంది పెట్టాడనే చెప్పాలి. లవ్ సాంగ్స్ లేకపోవడం తన పనితనానికి అడ్డం పడి ఉండొచ్చు.
దర్శకుడు అట్లీ ఇకపై రాకా కోసం ఓ రేంజ్ లో రాబట్టుకోవాలంటే సాయి అభ్యంక్కర్ ని పిండేయాలి. ఎందుకంటే పుష్పని మించిన ఆల్బమ్ ఇస్తేనే అల్లు అర్జున్ స్టేచర్ కి మ్యాచ్ అవుతుంది. అన్ని భాషల్లోనూ యునానిమస్ రెస్పాన్స్ తెచ్చుకోవాలి. ముఖ్యంగా హిందీ మీద బన్నీ ప్రత్యేక ఫోకస్ పెట్టాడు. ఇది దృష్టిలో పెట్టుకుని మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయట. రెండు పాటలు ఓకే అయ్యాయి కానీ మిగిలిన ట్యూన్స్ ఇంకా ఫైనల్ చేయలేదని తెలిసింది.
అనిరుధ్ స్థాయికి చేరుకోవడానికి సాయి వీలైనంత త్వరగా అదిరిపోయే ఆల్బమ్స్ ఇవ్వాలి. తన పేరు మరింతగా మారుమ్రోగిపోయేలా చేసుకోవాలి. రాకాని మించిన బెస్ట్ ఆఫర్ మరొకటి రాదు. ఎందుకంటే వందల కోట్లతో రూపొందుతున్న ఈ విజువల్ గ్రాండియర్ ని ఇంగ్లీష్ తో సహా విదేశీ భాషల్లోనూ డబ్బింగ్ చేసే అవకాశం ఉంది. తన వరకు బెస్ట్ ఇచ్చాడంటే మటుకు ప్యాన్ ఇండియా స్థాయిలో అవకాశాలు పట్టేయొచ్చు. రాకా రిలీజ్ డేట్ ఇంకా నిర్ధారణ కాలేదు.
ఎవరో జ్వాలలు రగిలించారు వేరెవరో దానికి బలి అయ్యారు అనే పాట ఊరికే పుట్టలేదు. గత నెల విడుదలై తమిళంలో…
తొలి రోజు పూర్తి చేసుకున్న పెద్ది మొత్తం ప్రీమియర్లతో కలిపి ప్రపంచవ్యాప్తంగా 135 కోట్ల గ్రాస్ దాటేసి బలమైన సెకండ్…
అతిలోకసుందరిగా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న శ్రీదేవి అంటే ఎప్పటికీ చెక్కుచెదరని పేరు. అలాంటి గొప్ప నటికి…
తెలంగాణకు రావొచ్చు.. పోవచ్చు.. ఇక్కడ నివసించొచ్చు కానీ, మా రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెడితే ఊరు కునేది లేదంటూ.. పెద్ద…
గ్రాండ్ ఓల్ద్ పార్టీ కాంగ్రెస్ వైఎస్ షర్మిలకు ఝలక్ ఇచ్చింది. షర్మిలను రాజ్యసభకు పంపనున్నట్లు బలమైన వార్తలు వచ్చాక కూడా…
ఏపీలో సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం ఉంది. గుజరాత్ సహా కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన తీర ప్రాంతం(బీచ్) ఏపీలో…