జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవలే శస్త్ర చికిత్స తీసుకుని… అనంతరం స్వల్ప వ్యవధి విశ్రాంతి మాత్రమే తీసుకుని తిరిగి పనిలో పడిపోయారు. ఈ సందర్భంగా తనను వేధిస్తున్న అనారోగ్య సమస్యలపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు పవన్ కు ఏమైంది అన్న విషయంపై పలువురు పలు రకాలుగా విశ్లేషించుకుంటున్న నేపథ్యంలో తన అనారోగ్యంపై జరుగుతున్న ప్రచారానికి పవనే స్వయంగా ఫుల్ స్టాప్ పెట్టేశారు.
తాను ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలను పవన్ వివరించారు. తాను చాలా రకాల అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నట్లు పవన్ చెప్పారు. పవన్ నోట నుంచి వినిపించిన ఈ మాటలను విన్నవారంతా ఇన్నాళ్లు ఆ నొప్పిని ఎలా భరించారండి అంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఆపరేషన్ తర్వాత కొద్ది రోజులు విశ్రాంతి తీసుకున్న పవన్ గురువారం హైదరాబాద్ నుంచి మంగళగిరి చేరిన సంగతి తెలిసిందే. గురువారం నాటి కేబినెట్ భేటీలో ఆయన పాలుపంచుకున్నారు. అనంతరం శుక్రవారం జనసేన శ్రేణులతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. జనసేన సభ్యత్వ నమోదులో మెరుగ్గా రాణించిన జనసేన సాధక్ లతో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక సమావేశంలో ఉత్సాహంగా కనిపించిన పవన్… తన అనారోగ్య సమస్యలపై స్పందించారు.
తనకు ఏమైందని చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారన్న పవన్… తాను చాలా సమస్యలతో సతమతం అవుతున్నానని చెప్పుకొచ్చారు. తన అభిమానుల కోలాహలంతోనూ తాను ఇబ్బందులు పడ్డానని కూడా ఆయన అన్నారు.
జనాల్లోకి వెళ్లినప్పుడు ఓ అభిమాని ఓ చేయిని పట్టుకుని ఇటువైపు గుంజితే..మరో అభిమాని మరో వైపునకు గుంజుతారని ఆయన అన్నారు. ఈ కారణంగా చేయి నొప్పితో బాధపడుతున్నానని తెలిపారు. రెండు భుజాల మధ్య గ్యాప్ కూడా వచ్చిందన్నారు. అభిమానుల వల్లే కలిగిన ఈ నొప్పిని అభిమానుల ఆప్యాయతలతోనే మరిచిపోతున్నానని ఆయన చెప్పుకొచ్చారు.
ఇక కరోనా సమయంలో తాను ఊపిరితిత్తుల సమస్యతో బాధపడ్డానన్న పవన్.. అది ఇప్పటికీ పూర్తిగా పోలేదన్నారు. ఇక రాజకీయాల్లోకి వచ్చాక జనంలోకి వెళ్తక తప్పని పరిస్థితిని ప్రస్తావించిన పవన్… ఈ సందర్భంగా దుమ్ము దూళి వల్ల సైనస్ సమస్య తలెత్తిందని తెలిపారు. ఈ సమస్య మరింతగా పెరగగా తప్పనిసరి పరిస్థితుల్లో ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. దీర్ఘ కాలిక వెన్ను సమస్య కూడా అలానే ఉందని చెప్పడంతో అభిమానులు తట్టుకోలేకపోయారు.
ఇన్ని సమస్యలు ఉన్నా… స్పోర్స్ట్ పర్సనాలిటీ కారణంగా ఆ నొప్పులను తాను పెద్దగా పట్టించుకోవడం లేదన్నారు. అయితే వైద్యుల వద్దకు వెళ్లినప్పుడు మాత్రం ఇంత నొప్పిని ఎలా తట్టుకుంటున్నారన్న ప్రశ్న ఎదురవుతోందన్నారు. తన అబిమానుల అభిమానంతోనే ఈ నొప్పులను అలా భరిస్తూ వచ్చానని పవన్ చెప్పుకొచ్చారు.
దశాబ్దానికి పైగా సమయం దాటిపోయినా అక్కినేని మూడో తరం వారసుడు అఖిల్ కు ఇంకా సాలిడ్ బ్లాక్ బస్టర్ పడలేదు.…
వైసీపీ ఏపీలో డీలా పడిన విషయం తెలిసిందే. గత 2024 ఎన్నికల వరకు 151 మంది ఎమ్మెల్యేలతో కళకళ లాడిన…
ఏది జరిగినా మంచికే అని పెద్దలు ఊరికే అనలేదు. సమంతకు ఇది ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తోంది. ఖుషి తర్వాత బాగా…
హీరోలు నిర్మాతలు కావడం కొత్తేమి కాదు. చిరంజీవి పీక్స్ లో ఉన్నప్పుడే అంజనా ప్రొడక్షన్స్ స్థాపించారు. కార్డు నాగబాబు పేరు…
వినుకొండ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడుపై భూకబ్జా ఆరోపణలు వచ్చిన వైనం ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం…
వైసీపీ అధినేత జగన్పై ఇప్పటికే ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్న సమయంలో…