Political News

పీఎం పొదుపు మంత్రం… మహానాడుపై ఎఫెక్ట్?

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు అంటే ఉద్వేగ భరితమైన వేదిక. పార్టీ విధానాలు, భవిష్యత్‌ దిశ, నాయకత్వ సందేశం కార్యకర్తలకు చేరే కీలక వేదికగా దీన్ని భావిస్తారు. ముఖ్యంగా లోకేష్‌ కొత్త బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి మహానాడు కావడంతో ఈసారి వేడుకలపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. అయితే పెట్రోల్‌, డీజిల్‌ వినియోగాన్ని తగ్గించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు నేపథ్యంలో మహానాడు నిర్వహణపై టీడీపీ అధిష్టానం కొత్త ఆలోచనలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

ఈ నెల 27, 28 తేదీల్లోనే ప్రతినిధుల సభ నిర్వహించి కీలక తీర్మానాలు, రాజకీయ చర్చలను ముగించాలని పలువురు నేతలు సూచించినట్లు సమాచారం. రాజకీయ తీర్మానాన్ని ఆమోదించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగంతో మహానాడును ముగిస్తే సరిపోతుందని కొందరు అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది.

ఎన్టీఆర్‌ జయంతి కార్యక్రమాలను కూడా అదే రోజు నిర్వహించి మహానాడును ముగించేలా సమాలోచనలు జరుగుతున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొదట ప్రతిపాదించినట్లుగా ఈ నెల 29న నిర్వహించాల్సిన భారీ బహిరంగ సభను రద్దు చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజా ధనం, ఇంధన వినియోగం తగ్గింపును దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం పరిశీలిస్తున్నట్లు సమాచారం.

అయితే “పొదుపు చర్యలు పాటించాలంటే మహానాడు ఘనంగా నిర్వహించకూడదా?” అన్న అభిప్రాయం కూడా పార్టీలో వ్యక్తమవుతోంది. మహానాడు అంటే కార్యకర్తల ఉత్సాహానికి ప్రతీక అని, దానిని పూర్తిగా కుదించడం సరైంది కాదని కొందరు నేతలు పేర్కొంటున్నట్లు తెలిసింది.

ఇంకొందరు మంత్రులు మాత్రం ప్రతినిధుల సభను రెండు రోజులకే పరిమితం చేసి, బహిరంగ సభను నిర్వహించకుండా ఉంటే బాగుంటుందని సూచించినట్లు సమాచారం. ఈ అంశంపై పార్టీ స్ట్రాటజీ కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుందామని మంత్రి లోకేష్‌ సూచించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు అనంతపురం పర్యటన అనంతరం మహానాడు నిర్వహణపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

This post was last modified on May 15, 2026 11:46 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఇక పెట్రోల్ బాదుడేనా?

అనుకున్నంతా అయ్యింది. పెట్రోల్, డిజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం శుక్రవారంతో నిజమయ్యాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం…

8 minutes ago

జూనియర్ రమేష్ బాబు సౌండ్ పెంచాలి

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…

2 hours ago

పవన్ కళ్యాణ్ సినిమాలకు దారి దొరికేనా

ఇటీవలే శ్వాసనాళానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రమంగా కోలుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్…

8 hours ago

ఈసారి మెజారిటీ తగ్గకూడదు తమ్ముళ్లు

టిడిపిలోనే కొందరు నాయకులకు మెజారిటీ సమస్య ఇప్పుడు కొంత గడబిడగా మారింది. గత ఎన్నికల సమయంలో భారీ స్థాయి మెజారిటీతో…

8 hours ago

రాజీకి వస్తారా… రచ్చ చేస్తారా

ఎవరు ఔనన్నా కాదన్నా టాలీవుడ్ రెండు వర్గాలుగా విడిపోయింది. ఎగ్జిబిటర్లు ప్లస్ వాళ్లలోనే ఉన్న నిర్మాతలు, ప్రొడ్యూసర్లు ప్లస్ వాళ్లలోనే…

12 hours ago

కేటీఆర్ కు మళ్ళీ ఉచ్చు బిగిసినట్టేనా…?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)కు నిజంగానే ఉచ్చు బిగుస్తోందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.…

15 hours ago