Political News

పీఎం పొదుపు మంత్రం… మహానాడుపై ఎఫెక్ట్?

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు అంటే ఉద్వేగ భరితమైన వేదిక. పార్టీ విధానాలు, భవిష్యత్‌ దిశ, నాయకత్వ సందేశం కార్యకర్తలకు చేరే కీలక వేదికగా దీన్ని భావిస్తారు. ముఖ్యంగా లోకేష్‌ కొత్త బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి మహానాడు కావడంతో ఈసారి వేడుకలపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. అయితే పెట్రోల్‌, డీజిల్‌ వినియోగాన్ని తగ్గించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు నేపథ్యంలో మహానాడు నిర్వహణపై టీడీపీ అధిష్టానం కొత్త ఆలోచనలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

ఈ నెల 27, 28 తేదీల్లోనే ప్రతినిధుల సభ నిర్వహించి కీలక తీర్మానాలు, రాజకీయ చర్చలను ముగించాలని పలువురు నేతలు సూచించినట్లు సమాచారం. రాజకీయ తీర్మానాన్ని ఆమోదించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగంతో మహానాడును ముగిస్తే సరిపోతుందని కొందరు అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది.

ఎన్టీఆర్‌ జయంతి కార్యక్రమాలను కూడా అదే రోజు నిర్వహించి మహానాడును ముగించేలా సమాలోచనలు జరుగుతున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొదట ప్రతిపాదించినట్లుగా ఈ నెల 29న నిర్వహించాల్సిన భారీ బహిరంగ సభను రద్దు చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజా ధనం, ఇంధన వినియోగం తగ్గింపును దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం పరిశీలిస్తున్నట్లు సమాచారం.

అయితే “పొదుపు చర్యలు పాటించాలంటే మహానాడు ఘనంగా నిర్వహించకూడదా?” అన్న అభిప్రాయం కూడా పార్టీలో వ్యక్తమవుతోంది. మహానాడు అంటే కార్యకర్తల ఉత్సాహానికి ప్రతీక అని, దానిని పూర్తిగా కుదించడం సరైంది కాదని కొందరు నేతలు పేర్కొంటున్నట్లు తెలిసింది.

ఇంకొందరు మంత్రులు మాత్రం ప్రతినిధుల సభను రెండు రోజులకే పరిమితం చేసి, బహిరంగ సభను నిర్వహించకుండా ఉంటే బాగుంటుందని సూచించినట్లు సమాచారం. ఈ అంశంపై పార్టీ స్ట్రాటజీ కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుందామని మంత్రి లోకేష్‌ సూచించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు అనంతపురం పర్యటన అనంతరం మహానాడు నిర్వహణపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

Kumar

Recent Posts

భూకంపంతో వణికిన వెనిజులా… మృతులు లక్షమంది!

వెనిజులాను వరుస భూకంపాలు వణికించాయి. దేశ రాజధాని కరాకస్‌తో పాటు ఉత్తర-మధ్య ప్రాంతాల్లో బుధవారం శక్తివంతమైన భూకంపాలు సంభవించాయి. తొలుత…

26 minutes ago

ఇండియాలో పౌరసత్వానికి అసలైన ఆధారమేది?

విదేశాలకు వెళ్లాలన్నా, మన జాతీయతను నిరూపించుకోవాలన్నా పాస్‌పోర్ట్ అత్యంత కీలకమైన పత్రం. అయితే ఇటీవల విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇచ్చిన…

33 minutes ago

ఒక్క షాట్ కోసం 90 టేకులు… దటీజ్ జక్కన్న

వారణాసి మళ్ళీ వార్తల్లోకి వచ్చేసింది. ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూలో పృథ్విరాజ్ సుకుమారన్ చెప్పిన కొన్ని విషయాలు…

2 hours ago

ర‌జినీ సినిమాలో రాశి… ఏం చేస్తుంద‌బ్బా?

కొన్నేళ్ల ముందు వ‌ర‌కు తెలుగులో రాశి ఖ‌న్నా కెరీర్ మంచి ఊపులో ఉండేది. జూనియ‌ర్ ఎన్టీఆర్ సహా ప‌లువురు స్టార్…

5 hours ago

సూటిగా చెప్పిన సమాధానాల్లో సునీత గారి పాఠాలు

గాయని సునీత అంటే తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. చిత్ర, జానకి లాంటి సీనియర్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న టైంలో…

6 hours ago

కేంద్ర మంత్రివ‌ర్గంలో ఏపీ నుంచి మ‌రో ఇద్ద‌రు?

కేంద్ర మంత్రివ‌ర్గం ప్ర‌క్షాళ‌న దాదాపు ఖ‌రారైన నేప‌థ్యంలో ఏపీ నుంచి మ‌రో ఇద్ద‌రు ఎంపీల‌కు మంత్రి యోగం ప‌ట్ట‌నుంద‌ని టీడీపీ…

6 hours ago