Political News

ఇక పెట్రోల్ బాదుడేనా?

అనుకున్నంతా అయ్యింది. పెట్రోల్, డిజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం శుక్రవారంతో నిజమయ్యాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన చమురు సంస్థలు.. వాటిని ఏమాత్రం ఆలస్యం చేయకుండానే అమల్లోకి పెట్టేశాయి.

పెట్రోల్, డీజిల్ పై లీటరు రూ.3 చొప్పున పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. ఇక సీఎన్జీ ధరలను కూడా కిలోకు రూ.2 చొప్పున పెంచుతూ గ్యాస్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఇదిలా ఉంటే… ఏపీలో డీజిల్ ధర ముచ్చటగా సెంచరీ మార్కు దాటేసింది.

ఇరాన్, అమెరికా యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ముడి చమురు లభ్యత భారీగా తగ్గిపోయింది. ఫలితంగా ఇంధనం, గ్యాస్ లభ్యతకు తీవ్ర కొరత తప్పదన్న వాదనలు వినిపించాయి. అయితే దేశంలో అవసరాలకు సరిపడ నిల్వలు ఉన్నాయని, సమీప భవిష్యత్తుల్లో ఇంధన ధరలను పెంచేది లేదని కేంద్రం పదే పదే ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే.

అయితే పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గని నేపథ్యంలో ఇప్పటికే వాణిజ్య గ్యాస్ సిలిండర్ రేట్లను భారీగా పెంచేసిన కేంద్రం… తాజాగా పెట్రోల్, డీజిల్ రేట్లనూ పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.

పెరిగిన ధరల ప్రకారం ఆయా రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లలో స్వల్ప వ్యత్యాసాలు ఉన్నా… అన్ని చోట్ల దాదాపుగా లీటర్ పై రూ.3 మేర ధర పెరిగింది. పెరిగిన ధరతో ఏపీలోని దాదాపుగా అన్ని ప్రాంతాల్లో లీటర్ డీజిల్ ధర రూ.100 దాటేసింది.

ఏపీలో లీటర్ పెట్రోల్ పై రూ.3.29, డీజిల్ పై రూ.3.14 పెంచగా… తెలంగాణలో ఈ రేట్లు రూ.3 మేర పెరిగాయి. ఏపీలో మొన్నటిదాకా ఏపీలో లీటర్ డీజిల్ ధర రూ.97గా ఉండగా.. ఇప్పుడు ఈ ధర తాజా పెంపుతో సెంచరీ కొట్టేసింది. ఇక పెట్రోల్ అయితే ఏపీలో రూ.111 దాటేసింది. అదే తెలంగాణలో అయితే లీటర్ డీజిల్ ధర రూ.98గా ఉంది.

Kumar

Recent Posts

దూత మీద నమ్మకం నిర్మాతను చేసింది

హీరోలు నిర్మాతలు కావడం కొత్తేమి కాదు. చిరంజీవి పీక్స్ లో ఉన్నప్పుడే అంజనా ప్రొడక్షన్స్ స్థాపించారు. కార్డు నాగబాబు పేరు…

8 minutes ago

1500 కోట్ల స్కాం… వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు

వినుకొండ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడుపై భూకబ్జా ఆరోపణలు వచ్చిన వైనం ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం…

1 hour ago

జ‌గ‌న్‌పై ఈడీ క‌న్ను… విచార‌ణేనా? అరెస్టా?!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఇప్ప‌టికే ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఉంది. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్న స‌మ‌యంలో…

2 hours ago

అన్నామలై బీజేపీని ఎందుకు వీడినట్టు?

అనుకున్నంతా అయ్యింది. గత కొంతకాలంగా బీజేపీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న ఆ పార్టీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు అన్నామలై తాజాగా ఆ…

3 hours ago

కొత్త నిప్పు రాజేసిన వీరభద్రుడు

ఎవరో జ్వాలలు రగిలించారు వేరెవరో దానికి బలి అయ్యారు అనే పాట ఊరికే పుట్టలేదు. గత నెల విడుదలై తమిళంలో…

3 hours ago

పార్ల‌మెంటు వారీగా జ‌న‌సేన వ్యూహం!

రాష్ట్రంలో ఎద‌గాల‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పుంజుకోవాల‌ని భావిస్తున్న జ‌న‌సేన ఏపీలో పెద్ద వ్యూహాన్నే అనుస‌రిస్తోంది. పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా…

3 hours ago