Political News

‘కరూర్’ మృతుడి తల్లి పాదాలు తాకిన విజయ్

తమిళనాడు నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రాజకీయ తెరంగేట్రం ఆదిలోనే కష్టనష్టాలను చవిచూసింది. ఎన్నికలకు కాస్తంత ముందుగా కరూర్ లో ఆయన నిర్వహించిన రోడ్ షో 41 మంది ప్రాణాలను బలిగొంది. ఈ ఘటనతో విజయ్ రాజకీయం ఇక ముగిసినట్టేనని అంతా అనుకున్నారు. అయితే ఏమాత్రం ధైర్యం వీడని విజయ్ అలా ముందుకు సాగారు. ఏకంగా తమిళనాడు సీఎంగా పదవి చేపట్టారు.

అయితే కరూర్ ఘటన విజయ్ ని ఎంతగా వేధించిందో తెలిపే ఘటన ఒకటి చోటుచేసుకుంది. కరూర్ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన ఓ చిన్నారి బాలుడి కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంగా మనోవేదనను ఆపుకోలేక విజయ్… ఆ బాలుడి తల్లి పాదాలపై పడి క్షమాపణ వేడుకున్నారట.

విజయ్ సీఎం అయిన నేపథ్యంలో పలు జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలు విజయ్ ప్రస్థానానికి సంబంధించిన ప్రత్యేక కథనాలను ప్రచురిస్తున్నాయి. అందులో భాగంగా బీబీసీ మీడియా కరూర్ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన ఓ బాలుడి కుటుంబాన్ని కలిసింది.

ఈ సందర్భంగా సదరు మీడియా ప్రతినిధి ముందు ఆ బాలుడి తండ్రి…విజయ్ గొప్పతనాన్ని, కరూర్ ఘటన విజయ్ ని ఎంతగా బాధించిందన్న విషయాన్ని కళ్లకు కడుతూ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తమను పరామర్శించిన సందర్భంగా కుర్చీలో కూర్చున్న తన భార్య కాళ్లను తాకిన విజయ్.. కరూర్ తొక్కిసలాటకు కారణమైన తనను మన్నించాలని వేడుకున్నారట.

అల్లారుముద్దుగా పెంచుకుంటున్న చిన్నారి కుమారుడు తొక్కిసలాటలో చనిపోగా… ఆ కుటుంబం తీరని మనోవేదనకు గురైంది. అయినా గానీ… ఎన్నికల్లో ఆ చిన్నారి తల్లిదండ్రులు విజయ్ పార్టీకి ఓటేశారట. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లుగా విజయ్ చేస్తే..మరోసారి ఆయనను గెలిపించేందుకు తాము సిద్ధంగానే ఉన్నట్లు ఆ బాలుడి తండ్రి విస్పష్ట వ్యాఖ్యలు చేశారు.

బిడ్డను కోల్పోయిన వేదన తమను ఇంకా వేదిస్తూనే ఉందని చెప్పిన ఆయన…తామంతా ఏం జరగాలని కోరుకున్నామో అలాగే జరిగి విజయ్ సీఎం అయ్యారని ఆయన పేర్కొన్నారు. సీఎంగా విజయ్ మంచి చేస్తారనే నమ్మకం తమకు ఉందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

బిడ్డను కోల్పోయిన తమ వేదన తీరేది కాదన్న ఆ తండ్రి… విజయ్ తమకు అందించిన ఆర్థిక సాయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఘటన జరిగాక తమను విజయ్ తమ ఇళ్లకు వచ్చి మరీ ఓదార్చాలని భావించారని, అయితే పోలీసుల అనుమతి లేని కారణంగా రాలేకపోతున్నానని విజయ్ చెప్పారన్నారు.

త్వరలోనే తాను కరూర్ వచ్చి…నాడు ప్రాణాలు కోల్పోయిన వారందరి కుటుంబాలను ప్రత్యేకంగా కలుస్తానని కూడా విజయ్ చెప్పారని ఆయన తెలిపారు. ఇక బిడ్డను కోల్పోయిన తన భార్యకు ఓ చెవి పనిచేయదని, ఆమకు ఓ ఆపరేషన్ చేయిస్తే బాగుంటుందని ఆ తండ్రి అభిప్రాయపడ్డారు.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే…బిడ్డను కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న తన భార్య కాళ్లను విజయ్ తాకారని, క్షమించాలని వేడుకున్నారని ఆ తండ్రి చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

This post was last modified on May 15, 2026 11:55 am

Share

Recent Posts

నానీనే స‌వాల్ చేస్తున్న చిన్న హీరో

సంక్రాంతి, ద‌స‌రా లాంటి పెద్ద పండుగ‌ల‌ను ప‌క్క‌న పెడితే.. ఒక పెద్ద సినిమా రిలీజ‌వుతున్న‌పుడు చిన్న సినిమాలు పోటీలో ఉండ‌డం…

12 minutes ago

ఆ భూములన్నీ తన కష్టార్జితమే అన్న కవిత!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా బుధవారం సాయంత్రం అసెంబ్లీలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబానికి చెందినవారు, ఆయన పార్టీకి…

32 minutes ago

ఇక్కడ అమ్మాయి సుప్రియకు అదిరిపోయే పదవి!

ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…

2 hours ago

సంబరాలు అంత సాహసం చేస్తుందా

సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…

2 hours ago

కేసీఆర్ ఫ్యామిలీ భూముల లెక్క చూస్తే షాకే!

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…

2 hours ago

ఇలాంటి కొడుకులు కూడా ఉంటారు..

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…

3 hours ago