తమిళనాడు రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. ఈ రోజు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని భావించిన టీవీకే అధినేత విజయ్ కు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అనూహ్యంగా షాకిచ్చిన సంగతి తెలిసిందే. టీవీకేకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సరిపడా సభ్యులు తీసుకువస్తేనే అనుమతినిస్తానని ఆయన తేల్చి చెప్పారు.
అయితే, తాజాగా నేడు మరోసారి గవర్నర్ రాజేంద్రను కలిసేందుకు విజయ్ లోక్ భవన్ కు వెళ్లిన విజయ్ కు మరోసారి షాక్ తగిలింది. నేడు కూడా విజయ్ కు గవర్నర్ రాజేంద్ర నో చెప్పారు. ఎమ్మెల్యేల లెక్క చూపాలని విజయ్ ను ఆయన కోరారు. విజయ్ రిక్వెస్ట్ కు ఆయన సానుకూలంగా స్పందించలేదు.
అయితే, విజయ్ కు ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలం, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన టీవీకేకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలపై గవర్నర్ రాజేంద్ర న్యాయనిపుణుల సలహా తీసుకుంటున్నారు. దీంతో, తమిళనాట రాజకీయాలు ఉత్కంఠగా మారాయి.
ఈ క్రమంలోనే గవర్నర్ వ్యవహార శైలిని కోలీవుడ్ లెజెండరీ యాక్టర్, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ తప్పుబట్టారు. 108 సీట్లు గెలిచిన టీవీకేకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వకపోవడం ప్రజా తీర్పును అవమానించడమేనని కమల్ విమర్శించారు.
సంఖ్యాబలం నిరూపించుకోవాల్సింది అసెంబ్లీలో అని, లోక్ భవన్ లో కాదని కమల్ అన్నారు. ప్రజా తీర్పును గౌరవించి ప్రతిపక్షంలోనే ఉంటానని స్టాలిన్ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తానని అన్నారు. అదే సమయంలో స్టాలిన్ రాజకీయ పరిణితిని ప్రశంసించారు.
దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్.. మరో రాష్ట్రంలో అధికార కూటమిలో భాగస్వామిగా…
కోలీవుడ్ లో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోనుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి సినిమాగా చెప్పబడుతున్న జన నాయగన్…
రెండేళ్ల ముందు ఐపీఎల్ వేలంలో ఏకంగా రూ.27 కోట్లతో లక్నో సూపర్ జెయింట్స్ టీం సొంతమైన ఆటగాడు రిషబ్ పంత్.…
ఏపీ సీఎం చంద్రబాబు.. గత వారం రోజులుగా మహానాడు నిర్వహణపై దృష్టి పెట్టారు. ఇదేసమయంలో పాలన పరంగా కూడా సమీక్షలు..…
మహేష్ బాబు ఫ్లాప్ సినిమాలు సైతం రీ రిలీజ్ లోనూ రికార్డులు సృష్టించడం చూశాం. ముఖ్యంగా ఖలేజాని చూసుకుంటే దానికొచ్చిన…
వైసీపీ అధినేత జగన్ ఆవేదన చెందుతున్నారా ? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాలు.. పార్టీని…