ఆలు లేదు చూలు లేదు.. అనే సామెతను గుర్తుకు తెస్తోంది తెలుగు సోషల్ మీడియా గొడవలు చూస్తే. సినిమాలు, రాజకీయాల విషయంలో చిన్న చిన్న విషయాలను పట్టుకుని సోషల్ మీడియాలో గొడవలు పెట్టుకోవడం మన వాళ్లకు అలవాటే. అసలు గొడవల కోసమే ఏదో ఒక టాపిక్ను చర్చనీయాంశంగా మారుస్తారా అనే సందేహాలు కూడా కలుగుతుంటాయి.
ఇప్పుడు తమిళ స్టార్ హీరో విజయ్ తన తొలి ఎన్నికల్లో సాధించబోయే ఫలితాల మీద మన వాళ్లు రెండు రోజులుగా తీవ్రంగా ఘర్షణలు పడుతున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ అద్భుత ఫలితాలు రాబట్టి ఏకంగా సీఎం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటూ ఎగ్జిట్ పోల్స్లో ఒక సంస్థ అంచనా వేసింది. మరి కొన్ని సంస్థలు అతను కింగ్ కాకపోయినా, కింగ్ మేకర్ అవుతాడంటూ అంచనా వేశాయి. మరి కొన్ని సంస్థలు అతను ఒక మోస్తరు ప్రభావమే చూపిస్తాడని, డీఎంకే అధికారంలోకి రావడానికి తోడ్పడతాడని పేర్కొన్నాయి.
ఐతే ఈ అంచనాల మీద మన వాళ్లు చర్చలతో సరిపెట్టకుండా పోలికలు పెడుతూ సోషల్ మీడియాలో గొడవలు పడుతున్నారు. ముఖ్యంగా వైసీపీ వాళ్లు జనసైనికులను రెచ్చగొట్టడానికి విజయ్ మీద వస్తున్న అంచనాలను ఉపయోగించుకుంటున్నారు. తమిళనాడు ఎన్నికల ముందు ఒక సందర్భంలో జగన్, విజయ్ కలిసి కనిపించడం.. అతను జగన్ లాగే క్రిస్టియన్ కావడం.. ఇలా కొన్ని కారణాల వల్ల ఈ తమిళ హీరోను వైసీపీ వాళ్లు ఓన్ చేసుకుంటున్నారు.
అతను తమిళనాట పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేయడాన్ని గుర్తు చేస్తూ.. జనసేనాని పవన్ కళ్యాణ్ను ముందు నుంచి ట్రోల్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను చూపించి, తొలి ఎన్నికలోనే పవన్ కంటే అద్భుత ఫలితాలు రాబట్టబోతున్నాడంటూ ఎద్దేవా చేస్తున్నారు. మరోవైపు చిరంజీవికి కూడా పోలిక తెచ్చి మెగాస్టార్ను తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
వైసీపీ వాళ్ల ట్రాప్లో పడి జనసైనికులు వారితో గొడవలు పెట్టేసుకుంటున్నారు. మధ్యలో టీడీపీ వాళ్లు కూడా ఈ రచ్చలో భాగం అవుతున్నారు. నిజానికి ఏపీలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన జరగడం చాలా పెద్ద విషయం. దీని మీద కూటమి మద్దతుదారులు బాగా ప్రమోట్ చేసుకుని హైలైట్ చేసుకోవాల్సిన అవసరముంది.
కానీ ఇలా ఏపీలో ఏ పెద్ద విషయం జరిగినా.. వైసీపీ వాళ్లు సోషల్ మీడియాలో డీవియేషన్ కోసం ఏదో ఒక టాపిక్ తీసుకొచ్చి టీడీపీ, జనసేన వాళ్లను ట్రాప్లో పడేస్తుంటారు. విజయ్ వ్యవహారం కూడా అలాగే ఉంది. అయినా ఫలితాలు వచ్చాక గొడవలు పడినా ఒక అర్థం ఉంది. కానీ ఎగ్జిట్ పోల్స్ మీద ఇంత రచ్చ చేయడం మరీ విడ్డూరం.
మొన్నటిదాకా రాయలసీమ అంటే కరువు సీమ కిందే లెక్క. ఏ రాజకీయ పార్టీ అదికారంలోకి వచ్చినా… రాయలసీమ ఓట్లను గంపగుత్తగా…
గోదావరి జిల్లాల రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్గానే ఉంటుంది. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తీర్పు ఇస్తే రాష్ట్రంలో…
ఒక సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ అంటే సాధారణంగా క్రేజ్ ఎక్కువగానే ఉంటుంది. అందుకే పుష్ప 2, కెజిఎఫ్ 2,…
తెలంగాణలో జనసేన అధినేత పవన్కల్యాణ్.. ఈ నెల 2న నిర్వహించ తలపెట్టిన తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభకు పోలీసులు అనుమతి…
దర్శకుడు సురేందర్ రెడ్డి పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. కారణం పవన్ కళ్యాణ్ అంగీకారం వస్తే సినిమా మొదలుపెట్టాలి. ఈ…
ఏపీలో ప్రతిపక్ష పార్టీ(ప్రధాన కాదు)గా ఉన్న వైసీపీ రెండేళ్ల కాలంలో ఏం చేసింది? ఏం సాధించింది? అనేది ఆసక్తికరం. శుక్రవారం(జూన్…