Political News

తెలంగాణ నూతన డీజీపీగా సీవీ?

ఐపీఎస్ అధికారిగా సుదీర్ఘ కాలం పాటు తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ లోనే విధులు నిర్వర్తించిన సీనియర్ పోలీసు అధికారి సీవీ ఆనంద్ తెలంగాణకు తదుపరి డీజీపీగా పదవీ బాధ్యతలు చేపట్టనునట్టు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా ఆనంద్ పనిచేస్తున్నారు. అంతకుముందు హైదరాబాద్ పోలీసు కమిషనర్ గా రెండు పర్యాయాలు అవకాశం దక్కించుకున్న ఆనంద్… పోలీసింగ్ లో తనదైన మార్కును చూపారు. 

ప్రస్తుతం డీజీపీగా కొనసాగుతున్న శివధర్ రెడ్డి ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో నూతన డీజీపీగా ఎవరిని నియమించాలన్న విషయంపై రేవంత్ రెడ్డి సర్కారు… పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులతో కూడిన జాబితాను యూపీఎస్సీకి పంపింది. ఈ జాబితాను పరిశీలించిన యూపీఎస్సీ…ముగ్గురు అధికారులతో కూడిన జాబితాను పంపింది. అందులో సీవీ ఆనంద్ పేరు ఉంది. దీంతో సీవీ ఆనంద్ నే డీజీపీగా నియమిస్తారన్న టాక్ వినిపిస్తోంది. 

ఈ వార్తలు నిజమేనన్నట్టుగా ప్రస్తుతం సీవీ ఆనంద్ కొనసాగుతున్న హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పోస్టును మరో సీనియర్ ఐపీఎస్ అధికారిణి అయిన శిఖా గోయల్ కు అప్పగించారు. శుక్రవారం పలువురు సీనియర్ ఐపీఎస్ అధికెారులను బదిలీ చేసిన తెలంగాణ సర్కారు… శిఖా గోయల్ ను హోం శాఖకు బదిలీ చేశారు.

శిఖా గోయల్ ను హోం శాఖకు బదిలీ చేయడం, ఆ వెంటనే యూపీఎస్సీ నుంచి సీవీ ఆనంద్ తో కూడిన జాబితా రాష్ట్ర ప్రభుత్వానికి అందడంతో సీవీ ఆనందే తదుపరి డీజీపీ అన్న వాదనలకు బలం చేకూరింది. మే తొలి వారంలో తెలంగాణ డీజీపీగా ఆనంద్ పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Kumar

Recent Posts

ఈసారి పాదయాత్ర ఈజీ కాదేమో జగన్

ఇప్ప‌టి వ‌ర‌కు ఒక లెక్క‌.. ఇక నుంచి మరో లెక్క‌.. అన్న‌ట్టుగా వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ ప‌రిస్థితి…

24 minutes ago

పట్టు వదలకుండా పరిగెత్తాలి పెద్ది

పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…

56 minutes ago

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

6 hours ago

కేంద్ర మంత్రుల ‘కార్ పూలింగ్’ షురూ!

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇందన పొదుపు దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశాక… మన…

6 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

7 hours ago

ఆమెకు జీతం రూ.1.4 లక్షలు… భరణం రూ.1.35

ఒక విడాకుల కేసుకు సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పుడు పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతోంది. సోషల్ మీడియాలో దీనిపై…

8 hours ago