తెలంగాణ లో ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తతల మధ్య నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని రేకెత్తించింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏప్రిల్ 23న డిపో ఎదుటే తనపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న శంకర్ గౌడ్, తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ హైదరాబాద్లో కన్నుమూశారు. 32 డిమాండ్ల సాధన కోసం జరుగుతున్న సమ్మె నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో చర్చలు జరుపుతామని పేర్కొన్నారు. ప్రభుత్వం త్వరలోనే ఆర్టీసీ జేఏసీతో చర్చలు ప్రారంభించి సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు కట్టుబడి ఉందని తెలిపారు.
ఇక ఈ ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ, కార్మికులు అధైర్యపడవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే నిరసనలు కొనసాగించాలని, ఆవేశపూరిత చర్యలకు పాల్పడవద్దని సూచించారు.
ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కార్మికులు పలు డిపోల వద్ద నిరసనలు చేపట్టి, శంకర్ గౌడ్ మృతికి ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ప్రభుత్వం చర్చల దిశగా అడుగులు వేస్తోంది.
ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబుకు కేంద్రంలోని పెద్దలు బిగ్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్డీయే కూటమిని మరింత బలోపేతం…
తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్.. ఇటీవల వరుసగా వివాదాల్లో చిక్కుకుంటోంది. వరలక్ష్మి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘సరస్వతి’ సినిమాకు…
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన వ్యూహాన్ని దాదాపు తేల్చేశారు. రాజకీయంగా తనకు ఉన్న లక్ష్యాన్ని కూడా వివరించారు. దేశాన్ని…
ఇప్పుడంతా అప్ డేటెడ్ వెర్షన్లే వినిపిస్తున్నాయి. వ్యవహారికంతో పాటుగా పాలిటిక్స్ లోనూ నయా తరం వచ్చేసింది. ఆ ఫలితమే జన్…
మెగా డీఎస్సీ పరీక్షలు జరిగి దాదాపు ఏడాది అవుతోంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరి ఆరు నెలలు దాటిపోయింది.…
కొన్ని నెలల క్రితం అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఒక ప్రకటన వెలువడింది. 2027 సంక్రాంతికి థియేటర్లను బ్లాస్ట్ చేయబోతున్నాం అనే…