పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తొలిదశలో ఓటర్లు .. కనీ వినీ ఎరుగని రీతిలో పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. వేసవి తాపాన్ని కూడా లెక్క చేయకుండా.. వేలాది మంది బూతుల వద్ద కనిపించారు. ఫలితంగా బెంగాల్ ఎన్నికల్లో.. కడపటి సమాచారం మేరకు.. 95 శాతం పోలింగ్ నమోదైంది. ఇది రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి అని సాక్షాత్తూ కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ట్వీట్ చేశారు. ఇదంతా ప్రజల్లో వచ్చిన చైతన్యమేనని పేర్కొన్నారు.
రంగంలోకి షా!
వాస్తవానికి 294 అసెంబ్లీ స్థానాలు ఉన్న బెంగాల్లో తాజాగా 152 స్థానాలకు పోలింగ్ జరిగింది. మొత్తం 16 జిల్లాల పరిధిలో జరిగిన ఈ ఎన్నికల్లో.. ఈ రేంజ్లో ఓటర్లు బయటకు వస్తారని.. ఎవరూ ఊహించలేదు. కాగా.. ఈ పర్యవసానం వెనుక కేంద్ర ఎన్నికల సంఘంతోపాటు.. బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింద న్న వాదన ఉంది. ఓటర్లను బూతుల వరకు రప్పించేందుకు.. ప్రత్యేక కార్యాచరణను ప్రారంభించింది. నేరుగా రంగంలోకి కేంద్ర హోం మంత్రి అమిత్ షానే..దిగిపోయారు.
అమిత్షా కోల్కతాలోనే తిష్ఠవేశారు. కార్యకర్తలను ముందుండి నడిపించారు. దీంతోనే ఓటింగ్ భారీగా పెరిగిందన్న చర్చ ఉంది. దీనికితోడు కేంద్రా పారామిలిటరీ బలగాలను దింపేయడంతోపెద్దగా ఎక్కడా గొడవలు లేకుండానే కార్యక్రమం సాఫీగా సాగిపోయింది. అయితే.. బీజేపీ రాష్ట్ర సీనియర్ నేత సువేందు సర్కార్పై తృణమూల్ కార్యకర్తలు దాడిచేశారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. పలు చోట్ల కొద్దిపాటి ఘర్షణలు చోటు చేసుకున్నాయి.
మోదీనా.. దీదీనా..?
ఇక, ఈ ఎన్నికలలో బీజేపీ ఒకే నినాదంతో ముందుకు సాగింది. ఎన్నికలకు ముందు ఎలాంటి ప్రచారం చేసుకున్నా.. పోలింగ్ రోజు స్థానిక మీడియాలో `మోదీనా.. దీదీనా..` అనే చర్చకు తెరదీసింది. ఫలితంగా ఓటర్లు ముందుకు వచ్చారన్నది బీజేపీ చెబుతున్న మాట. కాదు.. బీజేపీ కుయుక్తులను తిప్పికొట్టేందుకు ప్రజలు ఏకమయ్యారని.. ఇది తమకు కలిసి వచ్చే అంశమని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఉద్ఘాటించా రు. మరోవైపు.. మే 4 తర్వాత బీజేపీసర్కారుఏర్పడుతుందని.. ప్రధాని మోడీ ప్రకటించారు.
ఇలా.. బెంగాల్ ఎన్నికల తొలిదశ ఒకరకంగా.. ప్రశాంతంగానే సాగిపోయింది. గత 2021 ఎన్నికల్లో ఏడు దశల్లో ఎన్నికల పోలింగ్ నిర్వహించగా.. ఐదుగురు మృతి చెందారు. వీటిలో రెండు హత్యలు ఉన్నాయి. కానీ.. తాజా ఎన్నికల్లో చుక్క రక్తం కూడా కారకుండా ఎన్నికలు నిర్వహించినట్టు ఎన్నికల సంఘం పేర్కొంది. తదుపరి దశ.. ఈ నెల 29న జరగనుంది. ఈ దశలోనే సీఎం మమతాబెనర్జీ పోటీలో ఉన్న దుర్గాపూర్ సహా.. కీలక నాయకులు, మంత్రుల నియోజకవర్గాలు ఉన్నాయి. మరో మూడు రోజులు ప్రచారం చేసుకునేందుకు అవకాశం ఉంది.
ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబుకు కేంద్రంలోని పెద్దలు బిగ్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్డీయే కూటమిని మరింత బలోపేతం…
తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్.. ఇటీవల వరుసగా వివాదాల్లో చిక్కుకుంటోంది. వరలక్ష్మి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘సరస్వతి’ సినిమాకు…
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన వ్యూహాన్ని దాదాపు తేల్చేశారు. రాజకీయంగా తనకు ఉన్న లక్ష్యాన్ని కూడా వివరించారు. దేశాన్ని…
ఇప్పుడంతా అప్ డేటెడ్ వెర్షన్లే వినిపిస్తున్నాయి. వ్యవహారికంతో పాటుగా పాలిటిక్స్ లోనూ నయా తరం వచ్చేసింది. ఆ ఫలితమే జన్…
మెగా డీఎస్సీ పరీక్షలు జరిగి దాదాపు ఏడాది అవుతోంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరి ఆరు నెలలు దాటిపోయింది.…
కొన్ని నెలల క్రితం అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఒక ప్రకటన వెలువడింది. 2027 సంక్రాంతికి థియేటర్లను బ్లాస్ట్ చేయబోతున్నాం అనే…