తమిళనాడు ఎన్నికలు నిన్నటితో అయిపోయాయి. ఫలితాలు రావడానికి ఇంకా పది రోజులు టైం ఉండటంతో ఇండస్ట్రీ, పొలిటికల్ వర్గాలు రిలాక్స్ అవుతున్నాయి. రిజల్ట్స్ పట్ల టెన్షన్ అయితే సర్వత్రా నెలకొంది. ఇదిలా ఉండగా ఇప్పుడు అభిమానుల దృష్టి జన నాయకుడు మీదకు వెళ్తోంది. పోలింగ్ ఫినిషయ్యింది కాబట్టి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. కాకపోతే సెన్సార్ సర్టిఫికెట్ ఇంకా నిర్మాత చేతికి అందలేదు. ఇవాళో రేపో ఆ లాంఛనం అయిపోతుందని అనుకుంటున్నారు.
కెవిఎన్ టీమ్ ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయి. మొదటిది ఈ వారంలోనే జన నాయకుడు రిలీజ్ చేస్తే ఓపెనింగ్స్ బాగా వస్తాయి, వసూళ్ల పరంగా టెన్షన్ ఉండదు. కాకపోతే పైరసీ దెబ్బ గట్టిగానే తగిలింది కాబట్టి దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని బయ్యర్లు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే లక్షల సంఖ్యలో జనాలు చూసేశారు కనక వాళ్లంతా మళ్ళీ టికెట్లు కొంటారానే దాని మీద అనుమానాలు నెలకొన్నాయి. సో రిస్క్ చేసి బరిలో దిగడం ముందు చేయాల్సిన పని.
రెండోది ఫలితాలు వచ్చాక విడుదల చేయడం. ఒకవేళ విజయ్ కనక విజేతగా నిలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమో లేకా హంగ్ లో కీలక పాత్ర పోషించడమో చేయాల్సి వస్తే అప్పుడు జన నాయకుడుకి ఎక్కువ హెల్ప్ అవుతుంది. ఎలాంటి అడ్డంకులు లేకుండా కోరుకున్న స్థాయిలో, కావాల్సినన్ని థియేటర్లలో రిలీజ్ చేసుకోవచ్చు. లేదూ డిఎంకెనే గెలిస్తే విజయ్ ఓటమి ఎఫెక్ట్ జన నాయకుడు థియేటర్ రన్ మీద పడుతుంది. ఇది కొంచెం ఇబ్బందే.
ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ముందైతే సెన్సార్ ఫార్మాలిటీ అయిపోవాలి. హెచ్ వినోత్ దర్శకత్వం వహించిన జన నాయకుడు మన భగవంత్ కేసరి రీమేకన్న సంగతి తెలిసిందే. జనవరిలో పివిఆర్ ఐనాక్స్ సంస్థ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ కు ముందుకు వచ్చింది. మరి ఇప్పుడు అదే డీల్ కొనసాగిస్తారా లేక వేరే నిర్మాత రంగంలోకి దిగుతారా అనేది వేచి చూడాలి. దీని సంగతేమో కానీ విజయ్ పాత సినిమా శివకాశి ఇవాళ రీ రిలీజై తమిళనాట బాగానే సందడి చేస్తోంది.
This post was last modified on April 24, 2026 11:51 am
ఏముందిలే.. అని లైట్ తీసుకుంటే.. రాజకీయాల్లో కుదిరే పనికాదు. ఏ విషయాన్నయినా.. సీరియస్గానే తీసుకోవాలి.. సిన్సియర్గానే ఆలోచించాలి. లేకపోతే.. ఇబ్బందులు…
మా మంచి ఎమ్మెల్యే- ఈ మాట చాలా తక్కువ నియోజకవర్గాల్లో వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వంపై ప్రజల సంతృప్తి - అసంతృప్తి…
మాజీ మంత్రి, జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీలో తాను ఎలాంటి పదవులూ…
రన్బీర్ కపూర్ హీరోగా రూపొందుతున్న రామాయణ దీపావళి విడుదలకు రెడీ అవుతోంది. ఆ మధ్య వచ్చిన టీజర్ కు మిశ్రమ…
మనం ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తున్నాం. ఎవరికీ ఎలాంటిఇబ్బంది లేకుండా చేస్తున్నాం. అయినా.. జగన్ను కొందరు కలుస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది..?…
ఏపీ రాజధాని విషయంలో వైసీపీ అధినేత జగన్ పక్కా క్లారిటీతోనే ఉన్నారా? అంటే.. ఔననే ఆయన చెబుతున్నారు. ప్రజలు మెచ్చుతారా..…