రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ నియామకాల వల్ల సాధారణ నియామకాల అవకాశాలు తగ్గి, నిరుద్యోగ యువతకు నష్టం జరుగుతోందని స్పష్టం చేసింది.
2014 నుంచి ఇప్పటి వరకు మొత్తం 20,801 ఉద్యోగాలు కారుణ్య కోటాలో భర్తీ అయినట్లు కోర్టు గుర్తించింది. ఏటా సగటున రెండు వేల నియామకాలు జరుగుతున్నాయని, ఇది సాధారణ నియామకాల కంటే అధికమని వ్యాఖ్యానించింది. దీంతో ప్రతిభ ఆధారంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు అవకాశాలు కరువవుతున్నాయని అభిప్రాయపడింది.
కోర్టు అభిప్రాయం ప్రకారం కారుణ్య నియామకం అనేది అత్యవసర పరిస్థితుల్లో కుటుంబాన్ని ఆదుకునే మినహాయింపు మాత్రమే. కానీ ప్రస్తుతం ఒకే కుటుంబంలో మూడో తరానికి చెందిన వారికి కూడా ఈ కోటాలో ఉద్యోగాలు లభిస్తున్న ఉదాహరణలు ఉన్నాయని పేర్కొంది.
ఇది విధాన లక్ష్యాన్ని దూరం చేస్తోందని వ్యాఖ్యానించింది. ఉద్యోగి మరణంతో కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మాత్రమే కారుణ్య నియామకాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. నియంత్రణ లేకుండా ఈ విధానం కొనసాగితే ప్రతిభావంతులైన నిరుద్యోగుల అవకాశాలు మరింత తగ్గిపోతాయని హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో మూడు నెలల్లోగా స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది. కుటుంబ ఆర్థిక స్థితి అంచనా, ఉద్యోగానికి బదులుగా ఎక్స్గ్రేషియా చెల్లింపు, అవసరమైతే తాత్కాలిక లేదా అవుట్సోర్సింగ్ విధానంలో ఉపాధి కల్పన వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది.
అదేవిధంగా ఎక్స్గ్రేషియా చెల్లింపులపై కూడా కోర్టు మార్పులు సూచించింది. 2017లో జారీ చేసిన జీఓ ప్రస్తుత జీవన వ్యయాలకు సరిపడదని పేర్కొంది. మరణించిన ఉద్యోగి చివరి వేతనం, మిగిలిన సేవా కాలాన్ని పరిగణనలోకి తీసుకుని ఎక్స్గ్రేషియాను నిర్ణయించాలని సూచించింది. ఉద్యోగిపై ఆధారపడిన వారి నిర్వచనాన్ని కూడా కఠినంగా చేయాల్సిన అవసరం ఉందని గుర్తుచేసింది.
This post was last modified on April 21, 2026 9:05 am
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…
ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్ను పక్కన పెడితే.. అల్లు…
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…
పిల్లల విషయంలో తల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్యవహరించాలో చెప్పే ఉదంతమిది. విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టాలని, వారిలో భయం పెంచాలని…
హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…