రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ నియామకాల వల్ల సాధారణ నియామకాల అవకాశాలు తగ్గి, నిరుద్యోగ యువతకు నష్టం జరుగుతోందని స్పష్టం చేసింది.
2014 నుంచి ఇప్పటి వరకు మొత్తం 20,801 ఉద్యోగాలు కారుణ్య కోటాలో భర్తీ అయినట్లు కోర్టు గుర్తించింది. ఏటా సగటున రెండు వేల నియామకాలు జరుగుతున్నాయని, ఇది సాధారణ నియామకాల కంటే అధికమని వ్యాఖ్యానించింది. దీంతో ప్రతిభ ఆధారంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు అవకాశాలు కరువవుతున్నాయని అభిప్రాయపడింది.
కోర్టు అభిప్రాయం ప్రకారం కారుణ్య నియామకం అనేది అత్యవసర పరిస్థితుల్లో కుటుంబాన్ని ఆదుకునే మినహాయింపు మాత్రమే. కానీ ప్రస్తుతం ఒకే కుటుంబంలో మూడో తరానికి చెందిన వారికి కూడా ఈ కోటాలో ఉద్యోగాలు లభిస్తున్న ఉదాహరణలు ఉన్నాయని పేర్కొంది.
ఇది విధాన లక్ష్యాన్ని దూరం చేస్తోందని వ్యాఖ్యానించింది. ఉద్యోగి మరణంతో కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మాత్రమే కారుణ్య నియామకాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. నియంత్రణ లేకుండా ఈ విధానం కొనసాగితే ప్రతిభావంతులైన నిరుద్యోగుల అవకాశాలు మరింత తగ్గిపోతాయని హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో మూడు నెలల్లోగా స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది. కుటుంబ ఆర్థిక స్థితి అంచనా, ఉద్యోగానికి బదులుగా ఎక్స్గ్రేషియా చెల్లింపు, అవసరమైతే తాత్కాలిక లేదా అవుట్సోర్సింగ్ విధానంలో ఉపాధి కల్పన వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది.
అదేవిధంగా ఎక్స్గ్రేషియా చెల్లింపులపై కూడా కోర్టు మార్పులు సూచించింది. 2017లో జారీ చేసిన జీఓ ప్రస్తుత జీవన వ్యయాలకు సరిపడదని పేర్కొంది. మరణించిన ఉద్యోగి చివరి వేతనం, మిగిలిన సేవా కాలాన్ని పరిగణనలోకి తీసుకుని ఎక్స్గ్రేషియాను నిర్ణయించాలని సూచించింది. ఉద్యోగిపై ఆధారపడిన వారి నిర్వచనాన్ని కూడా కఠినంగా చేయాల్సిన అవసరం ఉందని గుర్తుచేసింది.
This post was last modified on April 21, 2026 9:05 am
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…
తెలుగు సినీ పరిశ్రమలో సుదీర్ఘ కాలంగా నిర్మాతగా ఉన్నారు చదలవాడ శ్రీనివాసరావు. 90వ దశకంలోనే దివంగత నటుడు శోభన్ బాబు…
ఒక స్టార్ హీరో సినిమా ప్రారంభోత్సవం జరుగుతుంటేనో లేదా ప్రి రిలీజ్ ఈవెంట్ ఏర్పాాటు చేస్తేనో.. ఇంకో స్టార్ హీరో…
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళ భాషలో మాట్లాడి అక్కడి ప్రజలను ఆకట్టుకున్నారు. కోయంబత్తూరులో…
పెద్ద బ్యాగ్రౌండ్ లేకపోయినా.. చాలా కష్టపడి స్టార్గా ఎదిగిన నటుడు ధనుష్. అతణ్ని చూడగానే సాధారణ మధ్యతరగతి మనిషిలానే అనిపిస్తుంది…
ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ కు ఒక అలవాటు ఉంది.. అదే 'స్లో స్టార్ట్ అండ్ డెడ్లీ ఫినిష్'. ఈ…