Political News

అన్నీ కారుణ్యాలే అయితే ప్రతిభావంతులు ఏం చెయ్యాలి?

రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ నియామకాల వల్ల సాధారణ నియామకాల అవకాశాలు తగ్గి, నిరుద్యోగ యువతకు నష్టం జరుగుతోందని స్పష్టం చేసింది.

2014 నుంచి ఇప్పటి వరకు మొత్తం 20,801 ఉద్యోగాలు కారుణ్య కోటాలో భర్తీ అయినట్లు కోర్టు గుర్తించింది. ఏటా సగటున రెండు వేల నియామకాలు జరుగుతున్నాయని, ఇది సాధారణ నియామకాల కంటే అధికమని వ్యాఖ్యానించింది. దీంతో ప్రతిభ ఆధారంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు అవకాశాలు కరువవుతున్నాయని అభిప్రాయపడింది.

కోర్టు అభిప్రాయం ప్రకారం కారుణ్య నియామకం అనేది అత్యవసర పరిస్థితుల్లో కుటుంబాన్ని ఆదుకునే మినహాయింపు మాత్రమే. కానీ ప్రస్తుతం ఒకే కుటుంబంలో మూడో తరానికి చెందిన వారికి కూడా ఈ కోటాలో ఉద్యోగాలు లభిస్తున్న ఉదాహరణలు ఉన్నాయని పేర్కొంది.

ఇది విధాన లక్ష్యాన్ని దూరం చేస్తోందని వ్యాఖ్యానించింది. ఉద్యోగి మరణంతో కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మాత్రమే కారుణ్య నియామకాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. నియంత్రణ లేకుండా ఈ విధానం కొనసాగితే ప్రతిభావంతులైన నిరుద్యోగుల అవకాశాలు మరింత తగ్గిపోతాయని హెచ్చరించింది.

ఈ నేపథ్యంలో మూడు నెలల్లోగా స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది. కుటుంబ ఆర్థిక స్థితి అంచనా, ఉద్యోగానికి బదులుగా ఎక్స్‌గ్రేషియా చెల్లింపు, అవసరమైతే తాత్కాలిక లేదా అవుట్‌సోర్సింగ్ విధానంలో ఉపాధి కల్పన వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది.

అదేవిధంగా ఎక్స్‌గ్రేషియా చెల్లింపులపై కూడా కోర్టు మార్పులు సూచించింది. 2017లో జారీ చేసిన జీఓ ప్రస్తుత జీవన వ్యయాలకు సరిపడదని పేర్కొంది. మరణించిన ఉద్యోగి చివరి వేతనం, మిగిలిన సేవా కాలాన్ని పరిగణనలోకి తీసుకుని ఎక్స్‌గ్రేషియాను నిర్ణయించాలని సూచించింది. ఉద్యోగిపై ఆధారపడిన వారి నిర్వచనాన్ని కూడా కఠినంగా చేయాల్సిన అవసరం ఉందని గుర్తుచేసింది.

This post was last modified on April 21, 2026 9:05 am

Share
Show comments
Published by
Kumar
Tags: High Court

Recent Posts

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

2 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

2 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

3 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

5 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

5 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

6 hours ago