వైసీపీ అధినేత జగన్.. తన సతీమణి భారతితో కలిసి.. యూరప్ పర్యటనకు వెళ్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి సీబీఐ కోర్టు పలు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది. వచ్చే నెల 15వ తేదీ వరకు కూడా.. జగన్ దంపతులు తమ కుమార్తెలతో యూరప్ దేశాల్లో రెస్టు తీసుకోనున్నారు. దీనిని ఎవరూ తప్పుబట్టరు. కానీ.. ఇదేసమయంలో పార్టీకి.. పార్టీ నాయకులకు కొన్ని లక్ష్యాలు నిర్దేశించారు.
తాను విదేశాలకు వెళ్తున్న నేపథ్యంలో పార్టీ నాయకులు యాక్టివ్గా ఉండాలని జగన్ తేల్చి చెప్పారు. పార్టీ తరఫున కార్యక్రమాలను నిర్వహించేందుకు పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా నాయకులు, కార్యకర్తలు వ్యవహరించాలని జగన్ తేల్చి చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న పనులను కనిపెట్టి ఉండాలని సీనియర్లకు ఆదేశాలు జారీ చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు.. ప్రస్తుతం రైతులకు విత్తనాలు, ఎరువులు దక్కని పరిస్థితి ఉందన్నారు.
ఈ నేపథ్యంలో రైతుల పక్షాన పోరాడేందుకు కార్యక్రమాలు నిర్వహించాలని జగన్ నాయకులకు సూచించారు. ఈ నెల ఆఖరు నుంచి రైతుల తరఫున కార్యక్రమాల్లో పాల్గొనాలని.. ప్రభుత్వాన్ని కదిలించాలని ఆయన చెప్పారు. ఇక, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంటుపై కూడా ఇప్పటి నుంచే ఉద్యమాలు చేపట్టాలని పిలుపునివ్వడం గమనార్హం. ఈ రెండు విషయాలపై ఈ నెల ఆఖరులోనే స్పందించాలన్నారు. అయితే.. జగన్ విదేశాలకు వెళ్తూ.. ఇలా నాయకులకు కర్తవ్యం నిర్దేశించడంపై పలువురు పెదవి విరుస్తున్నారు.
ఇదే కొత్తకాదు..
వాస్తవానికి జగన్ వ్యవహార శైలిని గమనిస్తే.. ఇప్పుడు మాత్రమే కాదు.. ఆయన గతంలో కూడా.. పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ.. ఉద్యమం చేపట్టారు. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా నాయకులకు సూచనలు చేశారు. కానీ, అదే రోజు ఉదయం ఆయన బెంగళూరు పర్యటనకు వెళ్లిపోయారు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే నాయకులు మౌనంగా ఉంటున్నారు. మరి ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on April 19, 2026 7:50 am
కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన ఫలితాలు అందుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ సంపాదిస్తాయి. టీవీల్లో, ఆన్ లైన్లో గొప్ప ఆదరణ…
దేశవ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాలను పునర్విభించి .. మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వం ఆశలు ప్రస్తుత సమావేశాల్లో నెరవేరేలా కనిపించడం…
తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి…
ఇంకా రాకా షూటింగ్ పూర్తి కాలేదు. మూడు నెలలకు పైనే వర్కింగ్ డేస్ అవసరమవుతాయని అంటున్నారు. అందుకే విడుదల తేదీ…
రాష్ట్రంలో వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పరీక్షలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి…
కన్నడ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన దర్శన్.. ఏ బాధలూ లేని జీవితాన్ని, బంగారం లాంటి జీవితాన్ని ఎలా…