Political News

జ‌గ‌న్‌కు రెస్ట్‌… నాయ‌కుల‌కు టార్గెట్‌!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. త‌న స‌తీమ‌ణి భార‌తితో క‌లిసి.. యూర‌ప్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్తున్న విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించి సీబీఐ కోర్టు ప‌లు ష‌ర‌తుల‌తో కూడిన అనుమ‌తులు ఇచ్చింది. వ‌చ్చే నెల 15వ తేదీ వ‌ర‌కు కూడా.. జ‌గ‌న్ దంప‌తులు త‌మ కుమార్తెల‌తో యూర‌ప్ దేశాల్లో రెస్టు తీసుకోనున్నారు. దీనిని ఎవ‌రూ త‌ప్పుబ‌ట్ట‌రు. కానీ.. ఇదేస‌మ‌యంలో పార్టీకి.. పార్టీ నాయ‌కుల‌కు కొన్ని ల‌క్ష్యాలు నిర్దేశించారు.

తాను విదేశాల‌కు వెళ్తున్న నేప‌థ్యంలో పార్టీ నాయ‌కులు యాక్టివ్‌గా ఉండాల‌ని జ‌గ‌న్ తేల్చి చెప్పారు. పార్టీ త‌ర‌ఫున కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించేందుకు పార్టీ రాష్ట్ర కోఆర్డినేట‌ర్ స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు వ్య‌వ‌హ‌రించాల‌ని జ‌గ‌న్ తేల్చి చెప్పారు. ప్ర‌భుత్వం చేస్తున్న ప‌నుల‌ను క‌నిపెట్టి ఉండాల‌ని సీనియ‌ర్ల‌కు ఆదేశాలు జారీ చేసిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు.. ప్ర‌స్తుతం రైతుల‌కు విత్త‌నాలు, ఎరువులు ద‌క్క‌ని ప‌రిస్థితి ఉంద‌న్నారు.

ఈ నేప‌థ్యంలో రైతుల ప‌క్షాన పోరాడేందుకు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌ని జ‌గ‌న్ నాయ‌కుల‌కు సూచించారు. ఈ నెల ఆఖ‌రు నుంచి రైతుల త‌ర‌ఫున కార్య‌క్ర‌మాల్లో పాల్గొనాల‌ని.. ప్ర‌భుత్వాన్ని క‌దిలించాల‌ని ఆయ‌న చెప్పారు. ఇక‌, విద్యార్థుల ఫీజు రీయింబ‌ర్స్‌మెంటుపై కూడా ఇప్ప‌టి నుంచే ఉద్య‌మాలు చేప‌ట్టాల‌ని పిలుపునివ్వ‌డం గ‌మ‌నార్హం. ఈ రెండు విష‌యాల‌పై ఈ నెల ఆఖ‌రులోనే స్పందించాల‌న్నారు. అయితే.. జ‌గ‌న్ విదేశాల‌కు వెళ్తూ.. ఇలా నాయ‌కుల‌కు క‌ర్త‌వ్యం నిర్దేశించ‌డంపై ప‌లువురు పెద‌వి విరుస్తున్నారు.

ఇదే కొత్త‌కాదు..

వాస్త‌వానికి జ‌గ‌న్ వ్య‌వ‌హార శైలిని గ‌మ‌నిస్తే.. ఇప్పుడు మాత్ర‌మే కాదు.. ఆయ‌న గ‌తంలో కూడా.. పీపీపీ విధానాన్ని వ్య‌తిరేకిస్తూ.. ఉద్య‌మం చేప‌ట్టారు. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా నాయ‌కుల‌కు సూచ‌న‌లు చేశారు. కానీ, అదే రోజు ఉద‌యం ఆయ‌న బెంగ‌ళూరు ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిపోయారు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలోనే నాయ‌కులు మౌనంగా ఉంటున్నారు. మ‌రి ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on April 19, 2026 7:50 am

Share
Show comments
Published by
Kumar
Tags: Jagan

Recent Posts

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

1 hour ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

2 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

2 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

4 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

4 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

6 hours ago