ప్రస్తుతం తెలంగాణ సహా తమిళనాడు రాష్ట్రాల్లో వినిపిస్తున్న ఏకైక పేరు తేజస్వి సూర్య. ఈయనను ఎంపీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని.. పార్టీ నుంచి బయటకు గెంటాలని.. ఈ రెండు రాష్ట్రాల్లోని అధికార, ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో రెండు రాష్ట్రాల్లోనూ తేజస్వికి వ్యతిరేకంగా ప్రకటనలే కాదు.. ఆయన దిష్టి బొమ్మ దహనాలు కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఎవరీ తేజస్వి? ఎందుకిలా రాజకీయ మంటలు చెలరేగాయి? అనేది ఆసక్తిగా మారింది.
తేజస్వి సూర్య. పూర్తి పేరు.. లక్య సూర్యనారాయణ తేజస్వి సూర్య. తెలుగు మూలాలు ఉన్న కన్నడిగుడు. కర్ణాటకలోని బెంగళూరు దక్షిణ పార్లమెంటు స్థానం నుంచి 2019, 2024లో బీజేపీ తరఫున ఆయన విజయం దక్కించుకున్నారు. వయసు 35 సంవత్సరాలు. 25వ ఏటనే ఆయన రాజకీయాలు ప్రారంభించారు. బీజేపీ అన్నా.. హిందూత్వం అన్నా.. అమితంగా ఇష్టపడతారు. కేంద్రంలో మంత్రిపదవిపై కన్నేశారనే టాక్ వినిపిస్తుంది. దీంతో తరచుగా ప్రధాని మోడీని, కేంద్ర మంత్రి అమిత్షాను ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు.
ఇప్పుడు ఏం చేశారు…
తాజాగా పార్లమెంటులో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులు వచ్చినప్పుడు తనవంతుగా మైకు అందుకున్న తేజస్వి.. దీనిలో డీలిమిటేషన్ను వ్యతిరేకిస్తున్న డీఎంకే(తమిళనాడు అధికార పార్టీ) సహా కాంగ్రెస్ పార్టీలను కార్నర్ చేసుకుని సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ-ఏపీ విభజనను పాకిస్థాన్-భారత్ విభజనతో పోల్చారు. నాడు గుడ్డిగా కాంగ్రెస్ చేసిన విభజన సరైందేనా? అని ప్రశ్నించారు. ఇది తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీలకు మంటపుట్టించింది.
ఫలితంగా హరీష్రావు, కవిత నుంచి కేటీఆర్ దాకా.. అటు అధికార పక్షం కాంగ్రెస్లోని పొన్న ప్రభాకర్ నుంచి పలువురు మంత్రుల వరకు తేజస్విపై విరుచుకుపడ్డారు. ఆయనను పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. బీజేపీ సైతం ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఇక, తమిళనాడు విషయానికి వస్తే.. నియోజకవర్గాల పునర్విభజనపై డీఎంకే మొసలి కన్నీరు కారుస్తోందని.. మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం ఆ పార్టీకి నచ్చడం లేదని తేజస్వి విమర్శించారు. గతంలో మహిళా బిల్లును వ్యతిరేకించిన పార్టీలతో జట్టుకట్టి.. ఉత్తరాది-దక్షిణాది అంటూ.. విభజన రాజకీయాలకు తెరదీసిందని మండిపడ్డారు. ఈ వ్యవహారం తమిళనాడులో మంటలు రేగేలా చేసింది. ఫలితంగా తేజస్వికి వ్యతిరేకంగా డీఎంకే, కాంగ్రెస్లు నిరసన చేపట్టాయి.
This post was last modified on April 17, 2026 6:30 pm
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు.. తమపై చేస్తున్న యుద్ధం నేపథ్యంలో కీలకమైన హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన విషయం తెలిసిందే. ఈ…
మతపరంగా రిజర్వేషన్లను కల్పించేది లేదని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పార్లమెంటులో తెగేసి చెప్పారు. మహిళా బిల్లు…
సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ కొత్త మూవీ సంబరాల ఏటిగట్టు ఇప్పటిదాకా విడుదల తేదీ ఖరారు చేసుకోలేదు. ఫిలిం…
మలయాళ హీరో టొవినో థామస్ ఈ మధ్య తెలుగు మీడియాలో బాగానే నానాడు. జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ అవకాశాన్ని వదులుకున్నానని,…
అడివి శేష్ డెకాయిట్ రెండో వారంలోకి అడుగు పెట్టింది. మిక్స్డ్ టాక్ తోనూ కలెక్షన్లు వచ్చేలా చేసుకోవడం ద్వారా శేష్…
బుమ్రా.. ఈ పేరు చెబితే ప్రత్యర్థి జట్లకు హడల్. తన జట్టుకు ఒక భరోసా. ఆడుతోంది ఎక్కడైనా కానీ.. పిచ్…