ఘట్టమనేని మూడో తరం నుంచి వస్తున్న మొదటి వారసుడు జయకృష్ణ డెబ్యూ మూవీ శ్రీనివాస మంగాపురం టీజర్ ఇటీవలే విడుదలయ్యింది. మహేష్ బాబు చేత ఆన్ లైన్ వేదికగా రిలీజ్ చేయించారు. విచిత్రంగా దీని గురించి సోషల్ మీడియాలో పెద్గగా చర్చ జరగడం లేదు. రమేష్ బాబు కాలం చేశాక నటుడిగా ఆయన చేరుకోలేని ఎత్తులని కొడుకు అందుకుంటాడనే నమ్మకంతో కుర్రాడికి బాగా శిక్షణ ఇచ్చి ఆరెక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి చేతిలో పెట్టారు.
నిన్నటి తరం హీరోయిన్ రవీనాటాండన్ కూతురు రషా తదానికి ఇదే తొలి తెలుగు సినిమా. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు. ఇన్ని అట్రాక్షన్లు ఉన్నప్పటికీ టీజర్ ఎందుకు హైలైట్ కావడం లేదనేది మూవీ లవర్స్ లో మెదులుతున్న ప్రశ్న. జయకృష్ణ లుక్స్ పరంగా పాసయ్యేలానే ఉన్నాడు. యాక్టింగ్ గురించి ఒక రెండు నిముషాలు చూసి కామెంట్ చేయలేం కానీ ట్రైలర్ వచ్చాక దాని మీద డిస్కస్ చేసుకోవచ్చు. ఇక అసలు విషయానికి వద్దాం.
జయకృష్ణని మహేష్ అభిమానులు ఇంకా పూర్తిగా ఓన్ చేసుకోలేదు. గుంటూరు కారం తర్వాత చాలా గ్యాప్ వచ్చేయడంతో వాళ్ళ దృష్టి వారణాసి మీదే ఉంది. పైగా తమ హీరో వారసుడిగా గౌతమ్ కి తొలి ప్రాధాన్యం ఇస్తారు తప్పించి జయకృష్ణకు ఆ అడ్వాంటేజ్ ఉండదు. సింపుల్ గా చెప్పాలంటే రామ్ చరణ్, వరుణ్ తేజ్ ఇద్దరూ ఫ్యాన్స్ దృష్టిలో ఎందుకు ఒకేలా ట్రీట్ చేయబడరో ఇదీ అంతే. అయితే జయకృష్ణ విషయంలో మహేష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న మాట వాస్తవం.
ఆల్రెడీ ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన సుధీర్ బాబు చాలా సినిమాలు చేశాడు కానీ ఇప్పటికీ సరైన బ్లాక్ బస్టర్ పడలేదు. గత రెండేళ్లలో వచ్చినవి మరీ అన్యాయంగా ఫ్లాప్ అయ్యాయి. మహేష్ బాబు కాకుండా ఇంకెవరూ మేజర్ కాంట్రిబ్యూషన్ చేయడం లేదు. గౌతమ్ రావడానికి ఇంకా చాలా టైం పడుతుంది కాబట్టి ఆలోగా జయకృష్ణ సెటిలైతే నిర్మాతలకు ఇంకో హీరో దొరికినట్టు అవుతాడు. అన్నట్టు శ్రీనివాస మంగాపురంకు ఈవెంట్, ప్రెస్ మీట్ లాంటివి ఎందుకు చేయలేదో.
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…
పెద్దిని ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేసే ఉద్దేశంతో భోపాల్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ముంబైలో ట్రైలర్…