ఘట్టమనేని మూడో తరం నుంచి వస్తున్న మొదటి వారసుడు జయకృష్ణ డెబ్యూ మూవీ శ్రీనివాస మంగాపురం టీజర్ ఇటీవలే విడుదలయ్యింది. మహేష్ బాబు చేత ఆన్ లైన్ వేదికగా రిలీజ్ చేయించారు. విచిత్రంగా దీని గురించి సోషల్ మీడియాలో పెద్గగా చర్చ జరగడం లేదు. రమేష్ బాబు కాలం చేశాక నటుడిగా ఆయన చేరుకోలేని ఎత్తులని కొడుకు అందుకుంటాడనే నమ్మకంతో కుర్రాడికి బాగా శిక్షణ ఇచ్చి ఆరెక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి చేతిలో పెట్టారు.
నిన్నటి తరం హీరోయిన్ రవీనాటాండన్ కూతురు రషా తదానికి ఇదే తొలి తెలుగు సినిమా. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు. ఇన్ని అట్రాక్షన్లు ఉన్నప్పటికీ టీజర్ ఎందుకు హైలైట్ కావడం లేదనేది మూవీ లవర్స్ లో మెదులుతున్న ప్రశ్న. జయకృష్ణ లుక్స్ పరంగా పాసయ్యేలానే ఉన్నాడు. యాక్టింగ్ గురించి ఒక రెండు నిముషాలు చూసి కామెంట్ చేయలేం కానీ ట్రైలర్ వచ్చాక దాని మీద డిస్కస్ చేసుకోవచ్చు. ఇక అసలు విషయానికి వద్దాం.
జయకృష్ణని మహేష్ అభిమానులు ఇంకా పూర్తిగా ఓన్ చేసుకోలేదు. గుంటూరు కారం తర్వాత చాలా గ్యాప్ వచ్చేయడంతో వాళ్ళ దృష్టి వారణాసి మీదే ఉంది. పైగా తమ హీరో వారసుడిగా గౌతమ్ కి తొలి ప్రాధాన్యం ఇస్తారు తప్పించి జయకృష్ణకు ఆ అడ్వాంటేజ్ ఉండదు. సింపుల్ గా చెప్పాలంటే రామ్ చరణ్, వరుణ్ తేజ్ ఇద్దరూ ఫ్యాన్స్ దృష్టిలో ఎందుకు ఒకేలా ట్రీట్ చేయబడరో ఇదీ అంతే. అయితే జయకృష్ణ విషయంలో మహేష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న మాట వాస్తవం.
ఆల్రెడీ ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన సుధీర్ బాబు చాలా సినిమాలు చేశాడు కానీ ఇప్పటికీ సరైన బ్లాక్ బస్టర్ పడలేదు. గత రెండేళ్లలో వచ్చినవి మరీ అన్యాయంగా ఫ్లాప్ అయ్యాయి. మహేష్ బాబు కాకుండా ఇంకెవరూ మేజర్ కాంట్రిబ్యూషన్ చేయడం లేదు. గౌతమ్ రావడానికి ఇంకా చాలా టైం పడుతుంది కాబట్టి ఆలోగా జయకృష్ణ సెటిలైతే నిర్మాతలకు ఇంకో హీరో దొరికినట్టు అవుతాడు. అన్నట్టు శ్రీనివాస మంగాపురంకు ఈవెంట్, ప్రెస్ మీట్ లాంటివి ఎందుకు చేయలేదో.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…