ఘట్టమనేని మూడో తరం నుంచి వస్తున్న మొదటి వారసుడు జయకృష్ణ డెబ్యూ మూవీ శ్రీనివాస మంగాపురం టీజర్ ఇటీవలే విడుదలయ్యింది. మహేష్ బాబు చేత ఆన్ లైన్ వేదికగా రిలీజ్ చేయించారు. విచిత్రంగా దీని గురించి సోషల్ మీడియాలో పెద్గగా చర్చ జరగడం లేదు. రమేష్ బాబు కాలం చేశాక నటుడిగా ఆయన చేరుకోలేని ఎత్తులని కొడుకు అందుకుంటాడనే నమ్మకంతో కుర్రాడికి బాగా శిక్షణ ఇచ్చి ఆరెక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి చేతిలో పెట్టారు.
నిన్నటి తరం హీరోయిన్ రవీనాటాండన్ కూతురు రషా తదానికి ఇదే తొలి తెలుగు సినిమా. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు. ఇన్ని అట్రాక్షన్లు ఉన్నప్పటికీ టీజర్ ఎందుకు హైలైట్ కావడం లేదనేది మూవీ లవర్స్ లో మెదులుతున్న ప్రశ్న. జయకృష్ణ లుక్స్ పరంగా పాసయ్యేలానే ఉన్నాడు. యాక్టింగ్ గురించి ఒక రెండు నిముషాలు చూసి కామెంట్ చేయలేం కానీ ట్రైలర్ వచ్చాక దాని మీద డిస్కస్ చేసుకోవచ్చు. ఇక అసలు విషయానికి వద్దాం.
జయకృష్ణని మహేష్ అభిమానులు ఇంకా పూర్తిగా ఓన్ చేసుకోలేదు. గుంటూరు కారం తర్వాత చాలా గ్యాప్ వచ్చేయడంతో వాళ్ళ దృష్టి వారణాసి మీదే ఉంది. పైగా తమ హీరో వారసుడిగా గౌతమ్ కి తొలి ప్రాధాన్యం ఇస్తారు తప్పించి జయకృష్ణకు ఆ అడ్వాంటేజ్ ఉండదు. సింపుల్ గా చెప్పాలంటే రామ్ చరణ్, వరుణ్ తేజ్ ఇద్దరూ ఫ్యాన్స్ దృష్టిలో ఎందుకు ఒకేలా ట్రీట్ చేయబడరో ఇదీ అంతే. అయితే జయకృష్ణ విషయంలో మహేష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న మాట వాస్తవం.
ఆల్రెడీ ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన సుధీర్ బాబు చాలా సినిమాలు చేశాడు కానీ ఇప్పటికీ సరైన బ్లాక్ బస్టర్ పడలేదు. గత రెండేళ్లలో వచ్చినవి మరీ అన్యాయంగా ఫ్లాప్ అయ్యాయి. మహేష్ బాబు కాకుండా ఇంకెవరూ మేజర్ కాంట్రిబ్యూషన్ చేయడం లేదు. గౌతమ్ రావడానికి ఇంకా చాలా టైం పడుతుంది కాబట్టి ఆలోగా జయకృష్ణ సెటిలైతే నిర్మాతలకు ఇంకో హీరో దొరికినట్టు అవుతాడు. అన్నట్టు శ్రీనివాస మంగాపురంకు ఈవెంట్, ప్రెస్ మీట్ లాంటివి ఎందుకు చేయలేదో.
This post was last modified on April 17, 2026 10:33 am
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…
‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…
వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్.. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ…
చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ ఒక ఫుల్ లెన్త్ కామెడీ సినిమాతో వస్తున్నాడు. అదే రంభ ఊర్వశి మేనక.…