రేపు విడుదల కాబోతున్న పాపం ప్రతాప్ కు టైటిల్ కు తగ్గట్టే చివరి నిమిషం వరకు అయ్యో పాపం అనిపించే పరిణామాలే జరుగుతున్నాయి. చివరి నిమిషంలో సెన్సార్ చిక్కు ఒకటి వచ్చి పడటంతో నిర్మాతలు ఆఘమేఘాల మీద పరుగులు పెడుతున్నారు. సినిమాలో ఎలాంటి జంతువులను వాడలేదని అనిమల్ వెల్ఫేర్ బోర్డు నుంచి ఒక సర్టిఫికెట్ తెచ్చుకోవాలి. కానీ ఎక్కడో పొరపాటు జరగడంతో దాన్ని మర్చిపోయారు.
అది సబ్మిట్ చేస్తే తప్ప సెన్సార్ క్లియరెన్స్ రాదు. కథకు సంబంధించిన ఒక ముఖ్యమైన ట్విస్టు జంతువు మీదే ఉంటుందట. నిన్న సోషల్ మీడియాలో ఈ లీకు తెగ చక్కర్లు కొట్టింది. పగలు మనిషిగా రాత్రి మృగంగా మారిపోయే జంతువు పాయింట్ అంటూ తెగ ఊదరగొట్టారు. ఇది పాపం ప్రతాప్ అనే క్లారిటీ వచ్చేసినట్టే. ఈ లెక్కన హైదరాబాద్ లో ప్లాన్ చేసిన నైట్ ప్రీమియర్లు దాదాపుగా లేనట్టే. ఒకవేళ ఆ టైంకి సమస్య పరిష్కారం కాకపోతే రేపు ఉదయం షోలు లేట్ కావొచ్చు.
దీనికొకటే కాదు గతంలో దండోరా కూడా ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేసింది. అప్పుడు ప్రొడ్యూసర్లు పడిన టెన్షన్ అంతా ఇంతా కాదు. ఎట్టకేలకు సెన్సార్ తెచ్చుకుని సమయానికి షోలు వేయగలిగారు. కానీ అప్పుడు వచ్చిన ఇష్యూ జంతువులది కాదు. కొన్ని సన్నివేశాల పట్ల అభ్యంతరం వచ్చింది. అది అంతర్గతంగా సెట్ చేసుకునేది కాబట్టి టైంకి సాల్వ్ అయ్యింది. కానీ పాపం ప్రతాప్ ఇప్పుడు బయటి నుంచి నో యానిమల్ పత్రం తీసుకురావాలి.
ఏది ఏమైనా ఇకపై నిర్మాతలు ఇలాంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. కనీసం వారం ముందే ఇలాంటి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యేలా చూసుకోవాలి. లేకపోతే డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఎగ్జిబిటర్ల దాకా అందరూ ఇబ్బంది పడతారు. తిమ్మరాజుపల్లి టీవీ, బ్యాడ్ బాయ్ కార్తీక్, పల్లిచట్టంబితో పోటీ పడుతున్న పాపం ప్రతాప్ కు అన్నీ సానుభూతులే దక్కుతున్నాయి. ఇదంతా ఎలా ఉన్నా కనీసం థియేటర్లలో సూపర్ అయితే తిరువీర్ కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది.
This post was last modified on April 16, 2026 2:06 pm
అధికారాన్ని కోల్పోయిన తర్వాత బెంగళూరు–తాడేపల్లి మధ్యనే ఎక్కువగా సమయం గడుపుతున్న వైసీపీ అధినేత వైయస్ జగన్ ఇప్పుడు కొత్త నిర్ణయంపై…
వైసిపి అధినేత వైయస్ జగన్ తీరుపై మంత్రి నారా లోకేష్ మరోసారి నిప్పులు చెరిగారు. ఏం రాక్షస మనస్తత్వం అంటూ…
దేశంలో పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలను పునర్విభజించే డీలిమిటేషన్, అదేసమయంలో మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించే 2023నాటి నారీ…
గత కొన్నేళ్లలో మలయాళ దర్శకులు బాగా డెవలప్ అయ్యారు. క్రైమ్, హారర్, సస్పెన్స్ ఈ మూడు అంశాలను తీసుకుని వాటికి…
రేపు విడుదల కాబోతున్న కొత్త సినిమాల ప్రమోషన్ల ఘట్టం ముగిసిపోయింది. ఎవరికి వారు శాయశక్తులా తమ పబ్లిసిటీకి ఏమేం కావాలో…
అంశం ఏదైనా సరే.. కేంద్ర ప్రభుత్వం ఒకసారి డిసైడ్ అయితే.. తన అజెండాకు తగ్గట్లుగా పరిస్థితుల్ని మార్చేయటం కొత్తేం కాదు.…