రేపు విడుదల కాబోతున్న పాపం ప్రతాప్ కు టైటిల్ కు తగ్గట్టే చివరి నిమిషం వరకు అయ్యో పాపం అనిపించే పరిణామాలే జరుగుతున్నాయి. చివరి నిమిషంలో సెన్సార్ చిక్కు ఒకటి వచ్చి పడటంతో నిర్మాతలు ఆఘమేఘాల మీద పరుగులు పెడుతున్నారు. సినిమాలో ఎలాంటి జంతువులను వాడలేదని అనిమల్ వెల్ఫేర్ బోర్డు నుంచి ఒక సర్టిఫికెట్ తెచ్చుకోవాలి. కానీ ఎక్కడో పొరపాటు జరగడంతో దాన్ని మర్చిపోయారు.
అది సబ్మిట్ చేస్తే తప్ప సెన్సార్ క్లియరెన్స్ రాదు. కథకు సంబంధించిన ఒక ముఖ్యమైన ట్విస్టు జంతువు మీదే ఉంటుందట. నిన్న సోషల్ మీడియాలో ఈ లీకు తెగ చక్కర్లు కొట్టింది. పగలు మనిషిగా రాత్రి మృగంగా మారిపోయే జంతువు పాయింట్ అంటూ తెగ ఊదరగొట్టారు. ఇది పాపం ప్రతాప్ అనే క్లారిటీ వచ్చేసినట్టే. ఈ లెక్కన హైదరాబాద్ లో ప్లాన్ చేసిన నైట్ ప్రీమియర్లు దాదాపుగా లేనట్టే. ఒకవేళ ఆ టైంకి సమస్య పరిష్కారం కాకపోతే రేపు ఉదయం షోలు లేట్ కావొచ్చు.
దీనికొకటే కాదు గతంలో దండోరా కూడా ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేసింది. అప్పుడు ప్రొడ్యూసర్లు పడిన టెన్షన్ అంతా ఇంతా కాదు. ఎట్టకేలకు సెన్సార్ తెచ్చుకుని సమయానికి షోలు వేయగలిగారు. కానీ అప్పుడు వచ్చిన ఇష్యూ జంతువులది కాదు. కొన్ని సన్నివేశాల పట్ల అభ్యంతరం వచ్చింది. అది అంతర్గతంగా సెట్ చేసుకునేది కాబట్టి టైంకి సాల్వ్ అయ్యింది. కానీ పాపం ప్రతాప్ ఇప్పుడు బయటి నుంచి నో యానిమల్ పత్రం తీసుకురావాలి.
ఏది ఏమైనా ఇకపై నిర్మాతలు ఇలాంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. కనీసం వారం ముందే ఇలాంటి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యేలా చూసుకోవాలి. లేకపోతే డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఎగ్జిబిటర్ల దాకా అందరూ ఇబ్బంది పడతారు. తిమ్మరాజుపల్లి టీవీ, బ్యాడ్ బాయ్ కార్తీక్, పల్లిచట్టంబితో పోటీ పడుతున్న పాపం ప్రతాప్ కు అన్నీ సానుభూతులే దక్కుతున్నాయి. ఇదంతా ఎలా ఉన్నా కనీసం థియేటర్లలో సూపర్ అయితే తిరువీర్ కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది.
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…
దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ఎంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారో తెలిసిందే. ప్రతిసారీ అవార్డులు ప్రకటించినపుడు గ్రహీతల అర్ఙతల…
సౌత్ ఇండియాలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ ఒకడు. తెలుగు వరకు చూస్తే కొన్నేళ్ల నుంచి అతనే నంబర్ వన్.…
స్టార్ హీరోలు లేని బాక్సాఫీస్ క్లాష్ మాములుగా అయితే అంత ఆసక్తికరంగా ఉండదు. కానీ జూలై మొదటి మూడో తేదీ…
దురంధర్ ది రివెంజ్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న బాలీవుడ్ బాక్సాఫీస్ కు…
అరవింద సమేత వీరరాఘవ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయిక కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.…