Political News

లాయర్ అవతారమెత్తిన రాజు గారు

కనుమూరి రఘురామకృష్ణరాజు… ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. లోక్ సభ సభ్యుడిగా, ఆ తర్వాత శాసనసభ్యుడిగా ఎన్నికైన రాజు.. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో ఉప సభాపతి (డిప్యూటీ స్పీకర్) వంటి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు.

తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతదూరం అయినా వెళ్లడానికి ఏమాత్రం వెనుకాడని రాజు…ఆయా సందర్భాల్లో తనకు ప్రమాదం పొంచి ఉన్నా కూడా వెనుకాడకుండా సాగుతారు. ప్రజా ప్రతినిధిగా తన సత్తా ఏమిటో నిరూపించుకున్న రాజు… తాజాగా న్యాయవాదిగానూ తనకు తిరుగు లేదని నిరూపించారు. హైకోర్టునే తన వాదనతో మెప్పించిన రాజు… తన వాదనకు అనుకూలంగా తీర్పువచ్చేలా చేసుకున్నారు.

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న రాజు.. నియోజకవర్గ పరిధిలోని ఆకివీడు మండలం పెదపేటలో శ్రీరామనవమి సందర్భంగా గ్రామానికి వెళ్లిన రాజుపై అక్కడి దళితులు దాడికి యత్నించారన్న వార్తలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. గ్రామంలో రామాలయాన్ని నిర్మించే దిశగా రాజు సాగగా… ఆలయ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు గ్రామ దళితులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా… రాజుపై దాడికి యత్నించిన వారిపై కేసులు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్టు చేశారు.

జైలు నుంచి విడుదలైన నిందితులు తాజాగా గ్రామంలో రామాలయ నిర్మాణం జరగకుండా ఉత్తర్వులు ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయం కాస్తంత ఆలస్యంగా తెలుసుకున్న రాజు… రామాలయం నిర్మాణానికి ఎలా అనుమతులు రావో చూస్తానంటూ రంగంలోకి దిగారు.

తన తరపు వాదనలు వినిపించేందుకు లాయర్ ను పురమాయించే శక్తి తనకున్నా… రాజు తానే స్వయంగా వాదనలు వినిపించేందుకు సిద్ధపడ్డారు. ఈ దరిమిలా బుధవారం ఈవ్యవహారంలోపై బుధవారం హైకోర్టు విచారణ చేపట్టగా… తన తరఫు వాదనలను రాజు స్వయంగా కోర్టుక వినిపించారు.

ఈ విచారణ ముగిసిన తర్వాత విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజు మాట్లాడుతూ కోర్టులో ఏం జరిగిందన్న వివరాలను అందజేశారు. పిటిషనర్లు కోరుతున్నట్లుగా రామాలయం నిర్మాణంపై ఎలాంటి నిలుపుదల ఉత్తర్వులు ఇవ్వరాదని తాను కోర్టును కోరానని ఆయన తెలిపారు.

ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కూడా అదే వాదనలను వినిపించడంతో తన, ప్రభుత్వ న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన కోర్టు… రామాలయం నిర్మాణంపై ఎలాంటి నిలుపుదల ఉత్తర్వులు ఇవ్వలేదని ఆయన తెలిపారు. అన్ని మతాలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలన్నదే తన వాదన అని, అదే విషయాన్ని తన రాజకీయ ప్రత్యర్థులు మరోరకంగా చెబతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

This post was last modified on April 15, 2026 10:23 pm

Share

Recent Posts

కాంగ్రెస్ లో కొండా కార్చిచ్చు

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…

1 hour ago

పైరసీ రూపంలో కొత్త తలనెప్పి

ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…

3 hours ago

పోలీస్ దుస్తుల్లో సూర్య షాకింగ్ ట్విస్టు

కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…

4 hours ago

రవితేజ విజయాలకు ‘గట్టిముడి’ పడాలి

ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…

4 hours ago

పోటీకి సిద్ధంకండి… పొత్తు సంగతి నేను చూసుకుంటాను

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…

6 hours ago

తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…

7 hours ago