కనుమూరి రఘురామకృష్ణరాజు… ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. లోక్ సభ సభ్యుడిగా, ఆ తర్వాత శాసనసభ్యుడిగా ఎన్నికైన రాజు.. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో ఉప సభాపతి (డిప్యూటీ స్పీకర్) వంటి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు.
తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతదూరం అయినా వెళ్లడానికి ఏమాత్రం వెనుకాడని రాజు…ఆయా సందర్భాల్లో తనకు ప్రమాదం పొంచి ఉన్నా కూడా వెనుకాడకుండా సాగుతారు. ప్రజా ప్రతినిధిగా తన సత్తా ఏమిటో నిరూపించుకున్న రాజు… తాజాగా న్యాయవాదిగానూ తనకు తిరుగు లేదని నిరూపించారు. హైకోర్టునే తన వాదనతో మెప్పించిన రాజు… తన వాదనకు అనుకూలంగా తీర్పువచ్చేలా చేసుకున్నారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న రాజు.. నియోజకవర్గ పరిధిలోని ఆకివీడు మండలం పెదపేటలో శ్రీరామనవమి సందర్భంగా గ్రామానికి వెళ్లిన రాజుపై అక్కడి దళితులు దాడికి యత్నించారన్న వార్తలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. గ్రామంలో రామాలయాన్ని నిర్మించే దిశగా రాజు సాగగా… ఆలయ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు గ్రామ దళితులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా… రాజుపై దాడికి యత్నించిన వారిపై కేసులు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్టు చేశారు.
జైలు నుంచి విడుదలైన నిందితులు తాజాగా గ్రామంలో రామాలయ నిర్మాణం జరగకుండా ఉత్తర్వులు ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయం కాస్తంత ఆలస్యంగా తెలుసుకున్న రాజు… రామాలయం నిర్మాణానికి ఎలా అనుమతులు రావో చూస్తానంటూ రంగంలోకి దిగారు.
తన తరపు వాదనలు వినిపించేందుకు లాయర్ ను పురమాయించే శక్తి తనకున్నా… రాజు తానే స్వయంగా వాదనలు వినిపించేందుకు సిద్ధపడ్డారు. ఈ దరిమిలా బుధవారం ఈవ్యవహారంలోపై బుధవారం హైకోర్టు విచారణ చేపట్టగా… తన తరఫు వాదనలను రాజు స్వయంగా కోర్టుక వినిపించారు.
ఈ విచారణ ముగిసిన తర్వాత విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజు మాట్లాడుతూ కోర్టులో ఏం జరిగిందన్న వివరాలను అందజేశారు. పిటిషనర్లు కోరుతున్నట్లుగా రామాలయం నిర్మాణంపై ఎలాంటి నిలుపుదల ఉత్తర్వులు ఇవ్వరాదని తాను కోర్టును కోరానని ఆయన తెలిపారు.
ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కూడా అదే వాదనలను వినిపించడంతో తన, ప్రభుత్వ న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన కోర్టు… రామాలయం నిర్మాణంపై ఎలాంటి నిలుపుదల ఉత్తర్వులు ఇవ్వలేదని ఆయన తెలిపారు. అన్ని మతాలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలన్నదే తన వాదన అని, అదే విషయాన్ని తన రాజకీయ ప్రత్యర్థులు మరోరకంగా చెబతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
This post was last modified on April 15, 2026 10:23 pm
వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకున్న జగన్.. పేదలకు పట్టెడన్నం కూడా పెట్టలేక పోయారని సీఎం చంద్రబాబు విమర్శించారు.…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ నాయకులు అదే అక్కసు ప్రదర్శిస్తున్నారు. రాజధానిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. జగన్ ప్రతిపాదించిన…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎట్టకేలకు ఫలితం…
వైసీపీ అధినేత జగన్ ఎప్పుడు బయటకు వచ్చినా భారీ ఎత్తున జన సమీకరణ ఉంటుంది. ఆయన వెనక యువత ఎక్కువగా…
తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటివరకు లేని వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని సృష్టించారు. దీనికి ప్రస్తుత మంత్రి నారా…
అనుకున్నదే అయింది. ‘పెద్ది’ సినిమా వాయిదా పడింది. ఈ విషయాన్ని ఈ రోజు అధికారికంగా ప్రకటించేశారు. ఐతే మార్చి నెలాఖరు…