జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎట్టకేలకు ఫలితం దక్కిందనే చెప్పాలి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన వర్మ… నియోజకవర్గంపై తనదైన శైలి పట్టు సాధించారు. పిఠాపురంలో టీడీపీ తరఫున వర్మ పోటీ చేస్తున్నారంటే ప్రత్యర్థులు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితి.
అయితే మొన్నటి ఎన్నికల్లో టీడీపీతో జట్టు కట్టిన జనసేన పిఠాపురం నుంచి తన అధినేత పవన్ పోటీ చేస్తారని ప్రకటించింది. దీంతో పవన్ కోసం వర్మ పిఠాపురం సీటును త్యాగం చేశారు. ఈ త్యాగానికి ప్రతిఫలం అన్నట్లుగా వర్మను టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు.
ఎన్నికల సమయంలో పిఠాపురం నుంచి తాను పోటీ చేయాలనుకుంటున్నానని పవన్ అనగానే… చంద్రబాబు ఒకే చెప్పేశారు. ఆ సమయంలో అప్పటికే పోటీకి సర్వసన్నద్ధమైన వర్మను పిలిచి మాట్లాడిన చంద్రబాబు.. పవన్ కోసం సీటు త్యాగం చేసే మీకు సముచిత స్థానం కల్పిస్తామని ఆ సందర్భంగా హామీ ఇచ్చారు.
అందులో భాగంగానే పార్టీ అధికారంలోకి వస్తే… ఎమ్మెల్సీ సీటు ఇస్తామని కూడా చంద్రబాబు చెప్పారు. అయితే మూడు పార్టీలతో కూడిన కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్సీ సీట్లనూ పంచుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో వర్మకు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వలేకపోయారు.
తాజాగా బుధవారం పార్టీకి నూతన కార్యవర్గాన్ని ప్రకటిస్తూ చంద్రబాబు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. అందులో భాగంగా మంత్రి నారా లోకేశ్ కు పార్టీలో ప్రమోషన్ ఇచ్చి… పార్టీ జాతీయ కార్యనిర్వహక కార్యదర్శి పదవిని ఇచ్చారు.
అదే సమయంలో వర్మ త్యాగాన్ని కూడా గుర్తు చేసుకున్న చంద్రబాబు… వర్మను పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఈ మేరకు 16 మంది పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుల జాబితాలో వర్మ పేరు కూడా చేరిపోయింది. ఈ జాబితాను చూసిన వారంతా… పవన్ కోసం సీటును త్యాగం చేసిన వర్మకు చంద్రబాబు న్యాయం చేశారన్న విశ్లేషణలు చేస్తున్నారు.
This post was last modified on April 15, 2026 10:08 pm
చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…
తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…
విజయనగరం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వసతులతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కార్యకలాపాలు ఆదివారం అర్ధరాత్రి…
బండ్ల గణేష్ అనే నటుడు ఎప్పుడూ తెలుగులో పెద్ద పాత్రలు చేసింది లేదు. నటుడిగా అతడిది గొప్ప కెరీర్ కాదు.…