Political News

ఎట్టకేలకు వర్మ త్యాగానికి ఫలితం

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎట్టకేలకు ఫలితం దక్కిందనే చెప్పాలి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన వర్మ… నియోజకవర్గంపై తనదైన శైలి పట్టు సాధించారు. పిఠాపురంలో టీడీపీ తరఫున వర్మ పోటీ చేస్తున్నారంటే ప్రత్యర్థులు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితి.

అయితే మొన్నటి ఎన్నికల్లో టీడీపీతో జట్టు కట్టిన జనసేన పిఠాపురం నుంచి తన అధినేత పవన్ పోటీ చేస్తారని ప్రకటించింది. దీంతో పవన్ కోసం వర్మ పిఠాపురం సీటును త్యాగం చేశారు. ఈ త్యాగానికి ప్రతిఫలం అన్నట్లుగా వర్మను టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు.

ఎన్నికల సమయంలో పిఠాపురం నుంచి తాను పోటీ చేయాలనుకుంటున్నానని పవన్ అనగానే… చంద్రబాబు ఒకే చెప్పేశారు. ఆ సమయంలో అప్పటికే పోటీకి సర్వసన్నద్ధమైన వర్మను పిలిచి మాట్లాడిన చంద్రబాబు.. పవన్ కోసం సీటు త్యాగం చేసే మీకు సముచిత స్థానం కల్పిస్తామని ఆ సందర్భంగా హామీ ఇచ్చారు.

అందులో భాగంగానే పార్టీ అధికారంలోకి వస్తే… ఎమ్మెల్సీ సీటు ఇస్తామని కూడా చంద్రబాబు చెప్పారు. అయితే మూడు పార్టీలతో కూడిన కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్సీ సీట్లనూ పంచుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో వర్మకు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వలేకపోయారు.

తాజాగా బుధవారం పార్టీకి నూతన కార్యవర్గాన్ని ప్రకటిస్తూ చంద్రబాబు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. అందులో భాగంగా మంత్రి నారా లోకేశ్ కు పార్టీలో ప్రమోషన్ ఇచ్చి… పార్టీ జాతీయ కార్యనిర్వహక కార్యదర్శి పదవిని ఇచ్చారు.

అదే సమయంలో వర్మ త్యాగాన్ని కూడా గుర్తు చేసుకున్న చంద్రబాబు… వర్మను పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఈ మేరకు 16 మంది పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుల జాబితాలో వర్మ పేరు కూడా చేరిపోయింది. ఈ జాబితాను చూసిన వారంతా… పవన్ కోసం సీటును త్యాగం చేసిన వర్మకు చంద్రబాబు న్యాయం చేశారన్న విశ్లేషణలు చేస్తున్నారు.

Kumar

Recent Posts

‘బ‌లిదానాల‌తో ఏర్ప‌డిన తెలంగాణ‌లో నాయ‌కులు గ‌ద్దెనెక్కారు’

తెలంగాణ‌పై మ‌రోసారి ఏపీ డిప్యూటీ సీఎం జ‌న‌సేన పార్టీ అధినేత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో సోమ‌వారం చేప‌ట్టిన జాతీయ…

24 minutes ago

ఆప‌రేష‌న్ టైగ‌ర్‌… బీజేపీ దూకుడు!

దేశ‌వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో బీజేపీని మ‌రింత బ‌లోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేత‌లు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…

41 minutes ago

అమరావతిపై ఆరా తీసిన సింగపూర్ ప్రధాని

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పురోగతిపై సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌ ఆసక్తి కనబరిచారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి…

2 hours ago

రవితేజ సేఫ్ గేమ్ ఆడతారా

మాస్ మహారాజా రవితేజ లైనప్ అభిమానుల అంచనాలకు తగ్గట్టు చక్కగా కనిపిస్తోంది. వరస డిజాస్టర్ల సంగతి పక్కనపెడితే ఇరుముడి మీద…

3 hours ago

కాక్‌రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడిపై దాడి..!

కాక్‌రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో నిర్వహించిన…

6 hours ago

దేవర 2 ఆశలు వదులుకోక తప్పదా

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్ దేవర 2. మొదటి భాగం వచ్చి రెండేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ సీక్వెల్…

8 hours ago