జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎట్టకేలకు ఫలితం దక్కిందనే చెప్పాలి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన వర్మ… నియోజకవర్గంపై తనదైన శైలి పట్టు సాధించారు. పిఠాపురంలో టీడీపీ తరఫున వర్మ పోటీ చేస్తున్నారంటే ప్రత్యర్థులు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితి.
అయితే మొన్నటి ఎన్నికల్లో టీడీపీతో జట్టు కట్టిన జనసేన పిఠాపురం నుంచి తన అధినేత పవన్ పోటీ చేస్తారని ప్రకటించింది. దీంతో పవన్ కోసం వర్మ పిఠాపురం సీటును త్యాగం చేశారు. ఈ త్యాగానికి ప్రతిఫలం అన్నట్లుగా వర్మను టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు.
ఎన్నికల సమయంలో పిఠాపురం నుంచి తాను పోటీ చేయాలనుకుంటున్నానని పవన్ అనగానే… చంద్రబాబు ఒకే చెప్పేశారు. ఆ సమయంలో అప్పటికే పోటీకి సర్వసన్నద్ధమైన వర్మను పిలిచి మాట్లాడిన చంద్రబాబు.. పవన్ కోసం సీటు త్యాగం చేసే మీకు సముచిత స్థానం కల్పిస్తామని ఆ సందర్భంగా హామీ ఇచ్చారు.
అందులో భాగంగానే పార్టీ అధికారంలోకి వస్తే… ఎమ్మెల్సీ సీటు ఇస్తామని కూడా చంద్రబాబు చెప్పారు. అయితే మూడు పార్టీలతో కూడిన కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్సీ సీట్లనూ పంచుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో వర్మకు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వలేకపోయారు.
తాజాగా బుధవారం పార్టీకి నూతన కార్యవర్గాన్ని ప్రకటిస్తూ చంద్రబాబు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. అందులో భాగంగా మంత్రి నారా లోకేశ్ కు పార్టీలో ప్రమోషన్ ఇచ్చి… పార్టీ జాతీయ కార్యనిర్వహక కార్యదర్శి పదవిని ఇచ్చారు.
అదే సమయంలో వర్మ త్యాగాన్ని కూడా గుర్తు చేసుకున్న చంద్రబాబు… వర్మను పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఈ మేరకు 16 మంది పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుల జాబితాలో వర్మ పేరు కూడా చేరిపోయింది. ఈ జాబితాను చూసిన వారంతా… పవన్ కోసం సీటును త్యాగం చేసిన వర్మకు చంద్రబాబు న్యాయం చేశారన్న విశ్లేషణలు చేస్తున్నారు.
This post was last modified on April 15, 2026 10:08 pm
వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకున్న జగన్.. పేదలకు పట్టెడన్నం కూడా పెట్టలేక పోయారని సీఎం చంద్రబాబు విమర్శించారు.…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ నాయకులు అదే అక్కసు ప్రదర్శిస్తున్నారు. రాజధానిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. జగన్ ప్రతిపాదించిన…
కనుమూరి రఘురామకృష్ణరాజు... ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. లోక్ సభ సభ్యుడిగా, ఆ తర్వాత శాసనసభ్యుడిగా ఎన్నికైన రాజు..…
వైసీపీ అధినేత జగన్ ఎప్పుడు బయటకు వచ్చినా భారీ ఎత్తున జన సమీకరణ ఉంటుంది. ఆయన వెనక యువత ఎక్కువగా…
తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటివరకు లేని వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని సృష్టించారు. దీనికి ప్రస్తుత మంత్రి నారా…
అనుకున్నదే అయింది. ‘పెద్ది’ సినిమా వాయిదా పడింది. ఈ విషయాన్ని ఈ రోజు అధికారికంగా ప్రకటించేశారు. ఐతే మార్చి నెలాఖరు…