వైఎస్ రాజశేఖరెడ్డి వారసులమంటూ రాజకీయాల్లోకి వచ్చిన ఆయన పిల్లలు చేస్తున్న కీచులాట.. ఆ కుటుంబాన్ని అభిమానించే వేలాది మందిని బాధిస్తున్నాయి. ఈ వ్యవహారం ముడిపడకపోవడం.. ఎవరికి వారు ఒకరిపై ఒకరు కత్తులు నూరుకోవడం వంటివి సరికాదని అంటున్నారు. ఈ క్రమంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్కు అత్యం తసన్నిహితుడు… ఒకప్పుడు ఆయన ఆత్మగా ప్రచారంలో ఉన్న కేవీపీ రామచంద్రరావు జోక్యం చేసుకుంటున్నట్టు తెలిసింది.
వైసీపీ వర్గాల కథనం మేరకు.. కేవీపీ.. జగన్ను కలుసుకునేందుకు రెండు రోజుల్లో వస్తున్నట్టు సమాచారం. అయితే.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అటు షర్మిల.. ఇటు జగన్ల మధ్య ఆస్తుల నుంచి రాజకీయాల వరకు.. రగడలు కొనసాగుతున్నాయి. ఇవి ప్రత్యర్థి పక్షాలకు రాజకీయ అస్త్రాలుగా మారుతున్నాయి. దీనిలోనూ ఒక కీలక విషయం ఉంది. ఈ కుటుంబ వ్యవహారం.. అటు జగన్కు, ఇటు షర్మిలకు ఏదో ఒక పక్షానికి లాభిస్తే.. ఎలాంటి ఇబ్బంది లేదు.
కానీ.. అటు తిరిగి .. ఇటు తిరిగి.. ఈ వ్యవహారం.. ఇతర పార్టీలకు ప్లస్ అవుతోందన్న చర్చ ఉంది. దీనినే కొందరు కాంగ్రెస్ వాదులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో మధ్యే మార్గంగా ఇరు పక్షాల మధ్య రాజీనా.. లేక సర్దుబాటు చేయడమా.. లేక సరిదిద్దడమా ? అనే కోణంలో కేవీపీ రంగంలో దిగుతున్నారన్నది వైసీపీకి చెందిన ఓ కీలక రెడ్డి నాయకుడు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా వైసీపీ నాయకులను కుక్కలతో పోల్చడం.. ఇతర విమర్శలు వంటివిషయంలో షర్మిల దూకుడును కూడా వారు తప్పుబడుతున్నారు.
అదేసమయంలో కాంగ్రెస్ ప్రగతిని కోరుకునే వారు కూడా.. ఇది సరికాదని చెబుతున్నారు. ఈ క్రమంలోనే కేవీపీ ద్వారా ఇరు పక్షాల మధ్య రాజీ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఆస్తుల విషయం అయితే.. ఇప్పటికే కోర్టుల్లో ఉంది. ఇక, రాజకీయంగా ఎవరి దారి వారిది.
కానీ.. ఈ మధ్యంలో ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చేలా జరుగుతున్న పరిణామాలపైనే వారు చర్చలు చేస్తారని తెలుస్తోంది. అయితే.. ఈ విషయంలో ఏమేరకు కేవీపీ సక్సెస్ అవుతారన్నది చూడాలి. గతంలోనూ ఆయన రెండు సందర్భాల్లో చర్చలు జరిపేందుకు రెడీ అయ్యారు. కానీ, విరమించుకున్నారు. మరి ఈ దఫా ఏమేరకు ఆయన చర్చలు ఫలిస్తాయో చూడాలి.
మానవ జీవన యానంలో ఎప్పటికప్పుడు కొత్త పోకడలు, కొంగొత్త మోసాలు, సభ్య సమాజాన్ని నివ్వెరపరిచే నయా వేధింపులు… ఇలా ఒక్కటేమిటి…
ఒక పాత్రకు ఒక ఆర్టిస్టు ఎంపికై.. ఆ తర్వాత ఇంకొకరి చేతికి మారడం ఫిలిం ఇండస్ట్రీలో మామూలే. చాలాసార్లు చిత్రీకరణకు…
రావు బహదూర్ ప్రెస్ మీట్ లో మీడియా ప్రతినిధి, నిర్మాత మధ్య జరిగిన సంభాషణలో ఒక సినిమా 450 కోట్లు…
లీకైన విడుదల తేదీ అఫీషియల్ అయిపోయింది. జైలర్ 2 రిలీజ్ డేట్ అక్టోబర్ 15 ఖరారు చేస్తూ చిన్న వీడియో…
జూలై 10 విడుదల కాబోతున్న లెనిన్ ప్రమోషన్లు ఊపందుకున్నాయి. ఈసారి గ్యారెంటీ హిట్టు కొడతాడనే నమ్మకం అఖిల్ లో పుష్కలంగా…
కోలీవుడ్ లోనే కాదు మన టాలీవుడ్ మ్యూజిక్ లవర్స్ లోనూ ఢిల్లీ కోర్టు ఉత్తర్వులు హాట్ టాపిక్ గా మారాయి.…