‘‘రావాలి జగన్..కావాలి జగన్..మన జగన్… రావాలి జగన్..కావాలి జగన్..మన జగన్….’’ 2019 ఎన్నికలకు ముందు వైసీపీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ పాట మార్మోగింది. జగన్ గెలుపునకు ఈ పాట దోహదం చేసిందని వైసీపీ నేతలు అంటుంటారు.
ఒక రాజకీయ పార్టీ ప్రచారం కోసం రూపొందించిన పాట యూట్యూబ్ లో రికార్డు స్థాయి వ్యూస్ కూడా సొంతం చేసుకోవడం మరో విశేషం. అందుకే కాబోలు…తమకు అచ్చొచ్చిన ఈ పాట పల్లవిని వైసీపీ శ్రేణులు మరోసారి వాడేందుకు రెడీ అయినట్లు కనిపిస్తోంది. అందుకే, ’‘రావాలి జ‘గన్’..కావాలి మావి‘గన్’..’’ అంటూ తాడేపల్లిలోని జగన్ ఇంటి ముందు భారీ సైజులో ఫ్లెక్సీలు వెలిశాయి.
జగన్ చెప్పిన మావిగన్ థియరీపై ఇటు ఓ వర్గం మీడియాలో, సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతోంది. అయితే, జగన్ చెప్పిన మావిగన్ థియరీని వైసీపీ నేతలు, కార్యకర్తలు సమర్థిస్తూ కౌంటర్లు కూడా ఇస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న మావిగన్ గురించి జగన్ మరోసారి మాట్లాడడంతో వైసీపీ శ్రేణులు మావిగన్ పై ప్రచారాన్ని నెక్స్ట్ లెవల్ కు తీసుకువెళ్లారు. రావాలి జగన్..కావాలి జగన్ పాట స్ఫూర్తితో రావాలి జగన్.. కావాలి మావిగన్ అంటూ క్యాచీ లైన్లతో ప్రజల్లోకి మావిగన్ ను తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి.
మావిగన్ రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్ అని, మావిగన్ తోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని జనాలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నేతలు. అంతేకాదు, ఏపీ బాగుండాలన్నా, త్వరగా డెవలప్ కావాలన్నా మావిగన్ కారిడార్ రావాల్సిందేనని, జగన్ సీఎం కావాల్సిందేనని ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే, ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి ఏపీకి రాజధాని లేకుండా మూడు ముక్కలాట ఆడిన జగన్.. మరో ఛాన్స్ ఇస్తే పబ్జీలో గన్ తో ఆడుకున్నట్లు మావి‘గన్’ తో రాష్ట్రంతో ఆడుకుంటారని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.
This post was last modified on April 9, 2026 2:48 pm
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…
ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్ను పక్కన పెడితే.. అల్లు…
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…
పిల్లల విషయంలో తల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్యవహరించాలో చెప్పే ఉదంతమిది. విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టాలని, వారిలో భయం పెంచాలని…
హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…