తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారీ స్ట్రాటజీకి తెరదీశారు. త్వరలోనే జిల్లాల విభజన చేయనున్నట్టు ఆయన స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం జన గణన ప్రారంభమైన నేపథ్యంలో దీనికి సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయని.. తద్వారా.. విభజన సాధ్యం కాదని పేర్కొన్నారు. వచ్చే ఏడాది మధ్యలో లేదా.. చివరలో జిల్లాల సరిహద్దులను మార్చడం ఖాయమని వ్యాఖ్యానించారు. దీనిపై ఇప్పటికే తనకు ఎంతో రిప్రజెంటేషన్లు ఇచ్చారన్న రేవంత్ రెడ్డి.. పరిశీలన కూడా పూర్తయిందని, అయితే.. కేంద్రం ఇప్పుడు జనగణన చేస్తున్న క్రమంలో సరిహద్దులు మార్చేందుకు వీల్లేదని పేర్కొన్నారు.
అశాస్త్రీయంగా..
ప్రస్తుతం తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి. వాస్తవానికి రాష్ట్ర విభజన సమయానికి మొత్తం 10 ఉమ్మడి జిల్లాలు మాత్రమే ఉన్నాయి. దీంతో పాలనా సౌలభ్యం పేరుతో నాటి కేసీఆర్ ప్రభుత్వం 2016-17 మధ్య కాలంలో జిల్లాలను విభజించింది. ఏకంగా తొలుత 28 జిల్లాలను ప్రతిపాదించింది. ఆ తర్వాత.. పలు జిల్లాల నుంచివచ్చిన డిమాండ్లను ప్రతిపాదిస్తూ.. మరో 5 జిల్లాలను ఏర్పాటు చేసింది. మొత్తంగా ప్రస్తుతం 33 జిల్లాలు ఉన్నాయి. అయితే.. అప్పట్లో కేసీఆర్ చేసిన విభజనను కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా తప్పుబట్టారు. అశాస్త్రీయంగా విభజించారని.. తమకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలను జిల్లాలుగా ఏర్పాటు చేసుకున్నారని విమర్శించారు.
ఇప్పుడు ఏం చేస్తారు..
గత 2023 ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ పార్టీ జిల్లాల విభజనపై హామీ ఇచ్చింది. ప్రజల ఆకాంక్షలు.. వారి కోరికలను దృష్టిలో పెట్టుకుని తాము అధికారంలోకి వచ్చాక.. జిల్లాలను పునర్విభజిస్తామని.. అశాస్త్రీయంగా జరిగిన అనేక జిల్లాల విభజనను మారుస్తామని చెప్పింది. దీనిలో భాగంగానే ఆయా జిల్లాల నుంచి ఇప్పటికీ డిమాండ్లు వినిపిస్తున్నాయి. గత ఏడాది ఐఏఎస్ అధికారుల నుంచి కూడా రిపోర్టులు తెప్పించుకున్నారు. అయితే.. ఇంతలోనే కేంద్ర గణాంక శాఖ జనగణనకు తెరదీసింది. ఈ క్రమంలో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. 2028 చివరి నాటికి.. గణన పూర్తవుతుంది. కాబట్టి.. ఆ సమయానికి జిల్లాలను విభజించే అవకాశం కాంగ్రెస్కు దక్కుతుంది.
వ్యూహాత్మకంగానే..
ఇప్పుడు కూడా జిల్లాల విభజన వెనుక వ్యూహాత్మక ధోరణే ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. తమకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలు.. లేని ప్రాంతాలు అనేవాటిని విభజించడం.. లేదా.. నిజమైన అభివృద్ధి కోసమే అయితే.. ఖచ్చితంగా ఇప్పుడు వెనుకబాటులో ఉన్నవాటిని కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయడం వంటివి చేస్తారని చెబుతున్నారు. ఏదేమైనా.. ఎవరు అధికారంలో ఉన్నా.. రాజకీయ ప్రభావం అయితే.. జిల్లాల విభజనపై ఖచ్చితంగా ఉంటుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. రెండోసారి అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్.. ఇప్పటికే…
మొన్న విడుదలైన బాలీవుడ్ మూవీ అల్ఫా మీద విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. కంటెంట్ బాలేకపోవడం, డిజాస్టర్లు హిందీలో కొత్త…
సంయుక్త మీనన్ ఈ ఏడాది వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ…
టాలీవుడ్ నిర్మాతల్లో సూర్యదేవర నాగవంశీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగే వేరు. కొంతమంది అతణ్ని అభిమానిస్తే.. కొంతమంది తనను అదే…
టీడీపీ సీనియర్ నేత, ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు సంబందించి తెలుగు నేల ప్రజళకు ఎలాంటి…
మామూలుగా చూస్తే దినేశ్ కార్తీక్కు మురళీ విజయ్ థ్యాంక్స్ చెబితే.. అందులో వార్తేముంది అనిపించొచ్చు. కానీ వీళ్లిద్దరి మధ్య ఏం…