Political News

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు… ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి పనులు సాగుతున్న తీరుతో పిఠాపురం జనం ఆనందోత్సహాలు వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పవన్ చేస్తున్న ప్రతి ప్రతిపాదన కార్యరూపం దాలుస్తున్న తీరు కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఓ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ అడిగిన పనులకు రాష్ట్ర ప్రభుత్వం వెనువెంటనే ఓకే అంటున్నా.,.. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు కూడా పవన్ అడిగినంతనే పిఠాపురం అభివృద్దికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది. దీనికి కేంద్రంలో పవన్ కు మంచి పట్టే కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి.

పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం పవన్ కల్యాణ్ ఇటీవలే కేంద్రం వద్ద ఓ ప్రతిపాదన పెట్టిన సంగతి తెలిసిందే. జనవరిలో ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సందర్భంగా రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో పవన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధిని ఈ సందర్భంగా ప్రస్తావించిన పవన్… అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద పిఠాపురం రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేయాలని రైల్వే మంత్రిని కోరారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్…బీజేపీకి ఎంత బాసటగా నిలుస్తున్నారో తెలిసిన కేంద్రం… ఆయన ప్రతిపాదనకు తక్షణమే ఆమోద ముద్ర వేసింది.

పిఠాపురం రైల్వే స్టేషన్ ను అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఎంపిక చేసినట్టు తాజాగా రైల్వే శాఖ ప్రకటించింది. ఈ పథకం కింద పిఠాపురం రైల్వే స్టేషన్ కు కొత్త రూపురేఖలు రానున్నాయి. ఇందుకోసం రైల్వే శాఖ ఏకంగా రూ.37.25 కోట్లను వెచ్చిందనుంది. త్వరలోనే స్టేషన్ అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయి. పనులన్నీ పూర్తి అయితే పిఠాపురం రైల్వే స్టేషన్ సికింద్రాబాద్, విజయవాడ రైల్వే స్టేషన్ల మాదిరిగా సరికొత్త రూపులో దర్శనమివ్వనుంది. అక్కడి ప్రయాణికులకు మరింత మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.

This post was last modified on April 6, 2026 8:02 pm

Share

Recent Posts

బ్రేకింగ్: అర్ధరాత్రి మోదీ సెల్ఫీ వీడియో

Rare & Unexpected:Probably for the first time, PM #Modi Addresses Nation Through a Selfie Video,…

1 hour ago

మ‌హేష్ అంత డేరింగ్ స్టెప్ వేశాడా?

అగ్ర‌శ్రేణి క‌థానాయ‌కులు.. చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు చేసే ద‌ర్శ‌కుల‌తో.. కొత్త‌వాళ్లు, పెద్ద‌గా అనుభ‌వం లేని డైరెక్ట‌ర్ల‌తో ప‌ని చేయ‌డం…

4 hours ago

ఓటు లేక‌పోతే… ప‌థ‌కాలు క‌ట్: రేవంత్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!!

రాష్ట్రంలో ఓటు లేని వారికి ప్ర‌భుత్వం నుంచి సంక్షేమ ప‌థ‌కాల‌ను ఎలా అందిస్తామ‌ని సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. ఎవ‌రి…

5 hours ago

చెన్నై లవ్ స్టోరీకి లైన్ క్లియర్

సంక్రాంతి సినిమాల తర్వాత నాలుగైదు నెలల పాటు బాక్సాఫీస్ దగ్గర పెద్ద స్లంప్ చూసింది టాలీవుడ్. కానీ గత నెలలో…

5 hours ago

బాలయ్యని మ్యాచ్ చేయడం ఈజీ కాదు

ఏదైనా రీమేక్ సినిమాకు వచ్చే అతి పెద్ద సమస్య పోలిక. ఒరిజినల్ కంటే మెరుగ్గా తీశారా, నటీనటుల్లో ఎవరు బాగా…

5 hours ago

బండ్ల గణేష్‌కు అక్కడా షాకే

ప్రముఖ తెలుగు నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌‌కు సంబంధించిన ఆస్తి వివాదం ఇటీవల వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. గణేష్‌కు చెందిన…

5 hours ago