జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు… ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి పనులు సాగుతున్న తీరుతో పిఠాపురం జనం ఆనందోత్సహాలు వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పవన్ చేస్తున్న ప్రతి ప్రతిపాదన కార్యరూపం దాలుస్తున్న తీరు కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఓ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ అడిగిన పనులకు రాష్ట్ర ప్రభుత్వం వెనువెంటనే ఓకే అంటున్నా.,.. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు కూడా పవన్ అడిగినంతనే పిఠాపురం అభివృద్దికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది. దీనికి కేంద్రంలో పవన్ కు మంచి పట్టే కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి.
పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం పవన్ కల్యాణ్ ఇటీవలే కేంద్రం వద్ద ఓ ప్రతిపాదన పెట్టిన సంగతి తెలిసిందే. జనవరిలో ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సందర్భంగా రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో పవన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధిని ఈ సందర్భంగా ప్రస్తావించిన పవన్… అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద పిఠాపురం రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేయాలని రైల్వే మంత్రిని కోరారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్…బీజేపీకి ఎంత బాసటగా నిలుస్తున్నారో తెలిసిన కేంద్రం… ఆయన ప్రతిపాదనకు తక్షణమే ఆమోద ముద్ర వేసింది.
పిఠాపురం రైల్వే స్టేషన్ ను అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఎంపిక చేసినట్టు తాజాగా రైల్వే శాఖ ప్రకటించింది. ఈ పథకం కింద పిఠాపురం రైల్వే స్టేషన్ కు కొత్త రూపురేఖలు రానున్నాయి. ఇందుకోసం రైల్వే శాఖ ఏకంగా రూ.37.25 కోట్లను వెచ్చిందనుంది. త్వరలోనే స్టేషన్ అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయి. పనులన్నీ పూర్తి అయితే పిఠాపురం రైల్వే స్టేషన్ సికింద్రాబాద్, విజయవాడ రైల్వే స్టేషన్ల మాదిరిగా సరికొత్త రూపులో దర్శనమివ్వనుంది. అక్కడి ప్రయాణికులకు మరింత మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.
This post was last modified on April 6, 2026 8:02 pm
ఏపీలో కీలక ఘట్టానికి కూటమి ప్రభుత్వం తెరదీయనుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బరికాయ కొట్టేందుకు సిద్ధమైంది. గత ఏడాది ఈ…
రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…
టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…
తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…
నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి ఎర్త్ పెడుతున్నారా?... ఆయన ప్రాభవాన్ని.. వైభవాన్ని…