Political News

అజ్ఞాతంలో వైసీపీ మాజీ ఎంపీ?

వైసీపీ నేత, మాజీ పార్లమెంటు సభ్యుడు నందిగం సురేశ్ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారట. ఆది నుంచి నేరాలు, కేసులతో సహవాపం చేస్తూ సాగుతున్న సురేశ్.. ఎంపీ హోదాలో ఓ సంస్థకు చెందిన వ్యక్తెుల నుంచి రూ.25 లక్షలు తీసుకున్నారట. అయితే ఆ పనిని పూర్తి చేయకపోగా… డబ్బును కూడా వాపస్ ఇవ్వలేదట. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా… తుళ్లూరు పోలీసులు సురేశ్ పై కేసు నమోదు చేశారట. ఈ విషయం తెలుసుకున్న సురేశ్… తనను పోలీసులు ఎక్కడ అరెస్టు చేస్తారోనన్న భయంతో సురేశ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు తెలుస్తుంది.

సురేశ్ ప్రస్థానం అంతా నేరాలు, కేసులు, అరెస్టులతోనూ సాగిందని చెప్పాలి. 2014 తర్వాత నాడు టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేయగా… రాజధానికి భూములు ఇవ్వకుండా రైతులను భయభ్రాంతులకు గురి చేసే నిమిత్తం ఓ చెరకు తోటకు సురేశ్ నిప్పు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సురేశ్ ను అరెస్టు చేసిన పోలీసులు పలు విధాలుగా ఆయనను విచారించారు. ఈ అరెస్టుతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దగ్గరైన సురేశ్… ఆ తర్వాత బాపట్ల ఎంపీ టికెట్ ను దక్కించుకుని, ఎంపీగా కూడా విజయం సాధించారు.

ఇక తాజా కేసు వివకాల్లోకి వెళితే… కాకినాడకు చెందిన ఓ ట్రస్టు కారణమేమిటో తెలియదు గానీ కొంతకాలం క్రితం మూతపడింది. అయితే మూత పడ్డ ఆ ట్రస్టును తాను పునరుద్ధరిస్తానని, అందుకోసం తనకు రూ.25 లక్షలు ఇవ్వాలని సురేశ్ చెప్పారట. ఓ ఎంపీ హోదాలో ఉన్న సురేశ్ మాటలు నమ్మిన సదరు వ్యక్తులు ఆయనకు రూ.25 లక్షలు ఇచ్చినట్టు సమాచారం. అయితే డబ్బు తీసుకునేదాకా బాగానే ఉన్నా… డబ్బు చేతిలో పడ్డాక… సురేశ్ ఆ పనిని పక్కనపెట్టేశారట. డబ్బులు తిరిగి ఇమ్మన్నా కూడా ఇవ్వలేదనేది వారి వాదన.

అటు ట్రస్టు పునరుద్ధరణ కాక, ఇటు ఇచ్చిన డబ్బులు తిరిగి రాకపోవడంలో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో శనివారం బాధితులను స్టేషన్ కు పిలిచిన తుళ్లూరు పోలీసులు… ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సురేశ్ అరెస్టు నుంచి తప్పించుకునేందుకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారట.

కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక… ఓ వ్యక్తిని కొట్టిన కేసులో అరెస్టు అయిన సురేశ్ చాలా కాలం పాటు జైల్లో ఉన్నారు. ఈ క్రమంలో ఆయనకు గుండె సంబంధిత సమస్య కూడా వచ్చింది. ఈ పరిణామాలను గుర్తు చేసుకున్న సురేశ్… అరెస్టు కాకుండా ఉండేలా పలాయనం బాట పట్టినట్టు వార్త చక్కర్లు కొడుతుంది. అయితే పోలీసులు ఆయన జాడ కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు సమాచారం.

Kumar

Recent Posts

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

3 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

4 hours ago

జ‌న‌’సేన’ జాగ్ర‌త్త ప‌డాలా?

ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…

6 hours ago

మీనాక్షి ఇష్యూ కాంగ్రెస్ ను ‘హర్ట్’ చేసింది!

ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…

8 hours ago

మోదీ రికార్డును బద్దలుకొట్టడం కష్టమే!

భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…

8 hours ago

పవన్ నోట మరోమారు ‘తెలంగాణ’ మాట

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో…

9 hours ago