తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం.. బీఆర్ఎస్కు ఊహించని సంకటం ఎదురైంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె.. కవిత.. పాత `టీఆర్ ఎస్` పేరును వినియోగించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. `పార్టీ పార్టీ కొత్త జెండా` నినాదంతో ఆమె చేసిన ప్రకటన తెలిసిందే. అంటే.. ఆమె పార్టీ పేరును టీఆర్ ఎస్గా ప్రకటించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కూడా ఆమెచూచాయగా చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం టీఆర్ఎస్ పేరు ఖాళీగా ఉందని.. ఎవరైనా దీనిని వాడుకోవచ్చన్నారు. ఆ ఎవరో అనేది చూస్తే.. ఆమేనని స్పష్టంగా తెలుస్తోంది. అంటే.. ఆది నుంచి వినిపించినట్టుగా.. `తెలంగాణ జాగృతి` కాకుండా.. తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ ఎస్) పేరునే వాడుకోవాలని ఆమె దాదాపు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇది ప్రజల్లో బాగా పాతుకుపోయిన పేరు కావడం.. గ్రామీణ స్థాయిలో ఇంకా టీఆర్ ఎస్ పార్టీగానే ఇప్పటికీ కొన్ని చోట్ల ప్రచారంలో ఉంది.
ఈ నేపథ్యంలో ఈ పేరును వాడుకుంటే.. కవిత ప్రచారం కానీ.. కొత్త పార్టీకానీ.. పుంజుకునేందుకు మరింత స్పేస్ ఉంటుందని ఆమె ఆలోచనగా ఉంది. ఈ నేపథ్యంలోనే `పాత పార్టీ కొత్త జెండా` అనే నినాదం చేశారు. ఈ వ్యవహారం తెలియగానే.. బీఆర్ ఎస్ అలెర్ట్ అయినట్టు తెలిసింది. దీనిపై ఎలాంటి చర్చ లేకుండా.. వెంటనే అడ్డుకునేందుకు.. ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
ఢిల్లీలోని పార్టీ ఎంపీల ద్వారా.. కేంద్ర ఎన్నికల కమిషన్లో బీఆర్ ఎస్ తరఫున పిటిషన్ వేయనున్నట్టు తెలిసింది. `టీఆర్ ఎస్` పూర్తిగా తమకు మాత్రమే చెందిన పేరు అని.. దీనిని వేరే వారికి కేటాయించరాదని బీఆర్ ఎస్సదరు పిటిషన్లో అభ్యర్థించనుంది.
సహజంగా ఒక పార్టీ పేరును మార్చిన తర్వాత.. ఆరు మాసాల వరకు పాత పార్టీ పేరును ఎవరికీ కేటాయించరాదన్న నిబంధన ఉంది. కానీ.. టీఆర్ ఎస్ .. పార్టీ బీఆర్ ఎస్గా మారి దాదాపు మూడేళ్లకుపైగానే అయింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి. ఎన్నికల సంఘం విచక్షణపైనే ఈ నిర్ణయం ఆధారపడి ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు.
This post was last modified on April 4, 2026 9:05 pm
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్యాంపు కార్యాలయంపై శనివారం దాడి…