తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం.. బీఆర్ఎస్కు ఊహించని సంకటం ఎదురైంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె.. కవిత.. పాత `టీఆర్ ఎస్` పేరును వినియోగించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. `పార్టీ పార్టీ కొత్త జెండా` నినాదంతో ఆమె చేసిన ప్రకటన తెలిసిందే. అంటే.. ఆమె పార్టీ పేరును టీఆర్ ఎస్గా ప్రకటించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కూడా ఆమెచూచాయగా చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం టీఆర్ఎస్ పేరు ఖాళీగా ఉందని.. ఎవరైనా దీనిని వాడుకోవచ్చన్నారు. ఆ ఎవరో అనేది చూస్తే.. ఆమేనని స్పష్టంగా తెలుస్తోంది. అంటే.. ఆది నుంచి వినిపించినట్టుగా.. `తెలంగాణ జాగృతి` కాకుండా.. తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ ఎస్) పేరునే వాడుకోవాలని ఆమె దాదాపు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇది ప్రజల్లో బాగా పాతుకుపోయిన పేరు కావడం.. గ్రామీణ స్థాయిలో ఇంకా టీఆర్ ఎస్ పార్టీగానే ఇప్పటికీ కొన్ని చోట్ల ప్రచారంలో ఉంది.
ఈ నేపథ్యంలో ఈ పేరును వాడుకుంటే.. కవిత ప్రచారం కానీ.. కొత్త పార్టీకానీ.. పుంజుకునేందుకు మరింత స్పేస్ ఉంటుందని ఆమె ఆలోచనగా ఉంది. ఈ నేపథ్యంలోనే `పాత పార్టీ కొత్త జెండా` అనే నినాదం చేశారు. ఈ వ్యవహారం తెలియగానే.. బీఆర్ ఎస్ అలెర్ట్ అయినట్టు తెలిసింది. దీనిపై ఎలాంటి చర్చ లేకుండా.. వెంటనే అడ్డుకునేందుకు.. ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
ఢిల్లీలోని పార్టీ ఎంపీల ద్వారా.. కేంద్ర ఎన్నికల కమిషన్లో బీఆర్ ఎస్ తరఫున పిటిషన్ వేయనున్నట్టు తెలిసింది. `టీఆర్ ఎస్` పూర్తిగా తమకు మాత్రమే చెందిన పేరు అని.. దీనిని వేరే వారికి కేటాయించరాదని బీఆర్ ఎస్సదరు పిటిషన్లో అభ్యర్థించనుంది.
సహజంగా ఒక పార్టీ పేరును మార్చిన తర్వాత.. ఆరు మాసాల వరకు పాత పార్టీ పేరును ఎవరికీ కేటాయించరాదన్న నిబంధన ఉంది. కానీ.. టీఆర్ ఎస్ .. పార్టీ బీఆర్ ఎస్గా మారి దాదాపు మూడేళ్లకుపైగానే అయింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి. ఎన్నికల సంఘం విచక్షణపైనే ఈ నిర్ణయం ఆధారపడి ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు.
This post was last modified on April 4, 2026 9:05 pm
ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే…
అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…
కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…
బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే జూలై…
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కొత్త లాజిక్ మాట్లాడుతున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ…