ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు.. సత్తా చాటుకున్నారు. సాధారణ అభివృద్ధి పనులతో పాటు.. ఎవరూ ఊహించని విధంగా నియోజకవర్గాన్ని ఆయన తీర్చి దిద్దుతున్నారు. దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీ-డాక్) కేంద్రాన్ని గన్నవరం నియోజకవర్గానికి ఆయన తీసుకువచ్చారు. సహజంగా నియోజకవర్గం అభివృధ్ధి అంటే.. వంతెనలు, కాల్వలు, రోడ్ల నిర్మాణం అనే మాటను ఆయన చెరిపివేశారు.
గన్నవరం నియోజకవర్గాన్ని ఐటీకి కేంద్రంగా తీర్చిదిద్దే క్రమంలో సీ-డాక్ను తీసుకువచ్చేందుకు ఎమ్మెల్యే యార్లగడ్డ గత మూడు మాసాలుగా ఎంతో కృషి చేస్తున్నారు. దేశంలోని 12 రాష్ట్రాల్లో సేవలందిస్తున్న సి-డాక్.. తన 13వ కేంద్రాన్ని గన్నవరంలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. తద్వారా.. నియోజకవర్గం పేరు రాష్ట్రస్థాయి నుంచి ఇప్పుడు దేశస్థాయికి చేరుకున్నట్టు అయింది. ఈ సంస్థ ఏర్పాటుకు యార్లగడ్డ విశేషంగా కృషి చేశారు.
ఇక, ఈ సంస్థ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం కేంద్ర ప్రభుత్వం నుంచే తీసుకుంటారు. గన్నవరంలో ఏర్పాటు చేస్తున్న సంస్థకు సుమారు రూ.200 కోట్ల మేరకు ఖర్చు అవుతుందని అంచనా వేసుకున్నారు. ఈ నిధులను కేంద్రమే నేరుగా కేటాయించనుంది. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్న కేంద్రం.. దీనిలో భాగంగానే సీడాక్ను గన్నవరానికి కేటాయించింది. రాష్ట్రంలో `సీడాక్` సంస్థ ఉన్న ఏకైక నియోజకవర్గంగా కూడా గన్నవరం నిలుస్తుంది.
ఎన్నెన్నో ప్రయోజనాలు..
ఉన్నత-స్థాయి కంప్యూటింగ్, సాఫ్ట్వేర్ అభివృద్ధి, సాంకేతికతలో సీడాక్ ఎంతో కీలకంగా మారింది. దేశంలో మొదటి సూపర్ కంప్యూటర్ `పరం` సిరీస్ అభివృద్ధి చేస్తుంది. అలాగే, క్వాంటం కంప్యూటింగ్, క్రయోజనిక్స్, ఫోటోనిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలలో పరిశోధనలు చేస్తుంది. ‘C-DAC ACTS’ ద్వారా సాఫ్ట్వేర్ అభివృద్ధి, AI, VLSI, సైబర్ సెక్యూరిటీ వంటి విభాగాలలో PG డిప్లొమా కోర్సులను ఈ సంస్థ అందిస్తుంది. ఇవి పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఉపాధి, ఉద్యోగాలను కల్పించనున్నాయి.
This post was last modified on April 4, 2026 10:05 am
నిన్న విడుదలైన బైకర్ కు పబ్లిక్ టాక్, రివ్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. సినిమా చూస్తే నిరాశపడరనే అభిప్రాయం అధిక…
నిన్న విడుదలైన రాకాస, బైకర్ రెండు సినిమాలకు నెగటివ్ రెస్పాన్స్ రాలేదు. అత్యద్భుతంగా ఉన్నాయని కాదు కానీ ఒకసారి చూడొచ్చనే…
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఉన్న రాయపాటి శైలజ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? అంటే…
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సునీల్కు రఘురామకు…
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…