Political News

మండలి చైర్మన్ నే కొట్టిన వైసీపీ మంత్రి ఎవరు?

ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ… అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అమరావతిని శాసన రాజధానికి పరిమితం చేసే దిశగా యత్నించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా అసెంబ్లీలో పాసై శాసనమండలికి వచ్చిన మూడు రాజధానుల బిల్లును నాడు మండలి చైర్మన్ గా కొనసాగిన మహ్మద్ షరీఫ్ అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంతటి దుర్మార్గానికి పాల్పడిందన్న విషయాన్ని తాజాగా గురువారం షరీఫ్ బయట పెట్టారు. నాడు మంత్రిగా కొనసాగిన ఓ వైసీపీ కీలక నేత తనపై చేయి చేసుకున్నారని షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అమరావతిని ఏపీకి శాశ్వత రాజధానిగా చేయాలని ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని బుధ, గురువారాల్లో పార్లమెంటు ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అమరావతి పరిధిలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో పాలుపంచుకున్న సందర్భంగా షరీఫ్ నాడు తనపై వైసీపీ నేతలు ఏ రీతిన వ్యవహరించారన్న విషయాన్ని కళ్లకు కట్టినట్టు వివరించారు. మూడు రాజధానుల బిల్లుకు ఆమోద ముద్ర లభించేలా వ్యవహరించాలని తనను వైసీపీ నేతలు ప్రలోభాలకు గురి చేశారని ఆయన తెలిపారు. ప్రలోభాలకు లొంగని తనను తమ దారికి తెచ్చుకునేలా వైసీపీ నేతలు తనపై బెదిరింపులకూ దిగారని ఆయన చెప్పారు.

సభలో బిల్లును ప్రవేశపెట్టడానికి ముందే వైసీపీ నేతలు తనను తమ దారికి తెచ్చుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ప్రయోగించారని షరీఫ్ తెలిపారు. అయితే తాను నిబంధనల మేరకే నడుచుకుంటానని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారన్నారు.

టీడీపీ నేతలు డబ్బున్న వారని, వారిపై కేసులు పడినా మంచి లాయర్లను పెట్టుకుని వారంతా బయటపడతారని, మీరే అన్యాయమైపోతారని తనను బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లు సభ ముందుకు వచ్చినప్పుడు కుర్చీలు, టేబుళ్లపైకి ఎక్కిన వైసీపీ నేతలు… చివరకు తన పోడియం వద్దకు చేరుకుని తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన తెలిపారు. 

ఈ సందర్భంగా కొందరు వైసీపీ నేతలు తనపై పరుష పదజాలంతో కూడిన వ్యాఖ్యలు చేశారని షరీఫ్ చెప్పుకొచ్చారు. అయినా కూడా భయపడని తాను నిబంధనల మేరకే బిల్లును అడ్డుకున్నానని తెలిపారు.అనంతరం సభ నుంచి తనను బయటకు వెళ్లకుండా అడ్డుకోవాలని వైసీపీ నేతలు యత్నించగా…

టీడీపీ సభ్యులు తనకు తోడుగా నిలిచారని తెలిపారు. ఈ సందర్భంగా నాడు జగన్ కేబినెట్ లో ఉన్న ఓ మంత్రి తనను కులం పేరుతో పాటు పుట్టుకనూ ప్రస్తావిస్తూ తిట్టిపోశారన్నారు. అంతేకాకుండా ఆ మంత్రి తన గుండెపై కొట్టారని షరీఫ్ వెల్లడించారు. ఇలా తనను ప్రలోభాలకు గురి చేసిన వారిలో నాటి సీఎం తప్పించి అందరూ ప్రత్యక్షంగా పాలుపంచుకున్నారని షరీఫ్ తెలిపారు.

This post was last modified on April 2, 2026 10:50 pm

Share

Recent Posts

తెలుగు సినిమా చరిత్రలోనే అతి పెద్ద టైటిల్

తెలుగులో అసలే పేరే లేకుండా రిలీజైన సినిమా ఒకటుంది. జేడీ చక్రవర్తి నటించిన ఆ చిత్రానికి రిలీజ్ తర్వాత ‘పాపే…

1 hour ago

కలుషిత నదిలోకి దిగి… ఒంటరిగా ప్రక్షాళన

ఈత రాదు.. చేతులకు గ్లౌజులు లేవు.. కాళ్లకు బూట్లు కూడా లేవు. అయినా నదిలోకి దిగాడు. ప్లాస్టిక్‌, చెత్తతో కలుషితమైన…

4 hours ago

ఇదేం ట్విస్ట్… చెప్పిన డేటుకే ఆద‌ర్శ కుటుంబం

ఈ రోజుల్లో ఏదైనా పెద్ద సినిమా మొద‌ట ప్ర‌క‌టించిన డేటుకు రిలీజైతే ఆశ్చ‌ర్య‌పోయే ప‌రిస్థితి ఉంటోంది. ఎంత ప్రణాళికాబ‌ద్ధంగా షూటింగ్…

4 hours ago

గూఢచారి-2కి వేరే దర్శకుని ఎలివేషన్

బహుముఖ ప్రజ్ఞాశాలి అడివి శేష్ నుంచి ఒక సినిమా వస్తోందంటే.. ప్రేక్షకుల్లో దానిపై మంచి అంచనాలుంటాయి. ఈ వేసవిలో ‘డెకాయిట్’…

5 hours ago

ఏపీలో పాదయాత్ర… తెలంగాణాలో బస్సు యాత్ర

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తెలంగాణా అధికార కాంగ్రెస్లో పరిస్థితి నూటెనిమిది డిగ్రీల సెల్సియస్ దాటింది. కొండా సురేఖ…

5 hours ago

పెద్ద స్టేట్మెంట్లకు శ్రీ విష్ణు కౌంటర్?

మంచి సినిమా తీశాం అన్న ధీమా కావ‌చ్చు. లేదంటే సినిమాను ఎలాగోలా జనాల్లోకి తీసుకెళ్లాలి అనే డెస్పరేషన్ కావ‌చ్చు. ఈ…

5 hours ago