Political News

మండలి చైర్మన్ నే కొట్టిన వైసీపీ మంత్రి ఎవరు?

ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ… అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అమరావతిని శాసన రాజధానికి పరిమితం చేసే దిశగా యత్నించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా అసెంబ్లీలో పాసై శాసనమండలికి వచ్చిన మూడు రాజధానుల బిల్లును నాడు మండలి చైర్మన్ గా కొనసాగిన మహ్మద్ షరీఫ్ అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంతటి దుర్మార్గానికి పాల్పడిందన్న విషయాన్ని తాజాగా గురువారం షరీఫ్ బయట పెట్టారు. నాడు మంత్రిగా కొనసాగిన ఓ వైసీపీ కీలక నేత తనపై చేయి చేసుకున్నారని షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అమరావతిని ఏపీకి శాశ్వత రాజధానిగా చేయాలని ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని బుధ, గురువారాల్లో పార్లమెంటు ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అమరావతి పరిధిలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో పాలుపంచుకున్న సందర్భంగా షరీఫ్ నాడు తనపై వైసీపీ నేతలు ఏ రీతిన వ్యవహరించారన్న విషయాన్ని కళ్లకు కట్టినట్టు వివరించారు. మూడు రాజధానుల బిల్లుకు ఆమోద ముద్ర లభించేలా వ్యవహరించాలని తనను వైసీపీ నేతలు ప్రలోభాలకు గురి చేశారని ఆయన తెలిపారు. ప్రలోభాలకు లొంగని తనను తమ దారికి తెచ్చుకునేలా వైసీపీ నేతలు తనపై బెదిరింపులకూ దిగారని ఆయన చెప్పారు.

సభలో బిల్లును ప్రవేశపెట్టడానికి ముందే వైసీపీ నేతలు తనను తమ దారికి తెచ్చుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ప్రయోగించారని షరీఫ్ తెలిపారు. అయితే తాను నిబంధనల మేరకే నడుచుకుంటానని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారన్నారు.

టీడీపీ నేతలు డబ్బున్న వారని, వారిపై కేసులు పడినా మంచి లాయర్లను పెట్టుకుని వారంతా బయటపడతారని, మీరే అన్యాయమైపోతారని తనను బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లు సభ ముందుకు వచ్చినప్పుడు కుర్చీలు, టేబుళ్లపైకి ఎక్కిన వైసీపీ నేతలు… చివరకు తన పోడియం వద్దకు చేరుకుని తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన తెలిపారు. 

ఈ సందర్భంగా కొందరు వైసీపీ నేతలు తనపై పరుష పదజాలంతో కూడిన వ్యాఖ్యలు చేశారని షరీఫ్ చెప్పుకొచ్చారు. అయినా కూడా భయపడని తాను నిబంధనల మేరకే బిల్లును అడ్డుకున్నానని తెలిపారు.అనంతరం సభ నుంచి తనను బయటకు వెళ్లకుండా అడ్డుకోవాలని వైసీపీ నేతలు యత్నించగా…

టీడీపీ సభ్యులు తనకు తోడుగా నిలిచారని తెలిపారు. ఈ సందర్భంగా నాడు జగన్ కేబినెట్ లో ఉన్న ఓ మంత్రి తనను కులం పేరుతో పాటు పుట్టుకనూ ప్రస్తావిస్తూ తిట్టిపోశారన్నారు. అంతేకాకుండా ఆ మంత్రి తన గుండెపై కొట్టారని షరీఫ్ వెల్లడించారు. ఇలా తనను ప్రలోభాలకు గురి చేసిన వారిలో నాటి సీఎం తప్పించి అందరూ ప్రత్యక్షంగా పాలుపంచుకున్నారని షరీఫ్ తెలిపారు.

This post was last modified on April 2, 2026 10:50 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Sharif

Recent Posts

దేవి 2… రాజుగారికి పెద్ద ఛాలెంజ్

ఇరవై ఏడు సంవత్సరాల క్రితం వచ్చిన దేవి సినిమాకు టాలీవుడ్ లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. అమ్మోరు లాంటి…

3 minutes ago

“అస‌లు సిస‌లు ప్ర‌జా ద్రోహి కేజ్రీవాలే“

ఆమ్ ఆద్మీ పార్టీ క‌న్వీన‌ర్‌, ఢిల్లీ మాజీముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్‌పై అదే పార్టీ నుంచి ఎంపీగా విజ‌యం ద‌క్కించుకుని.. ప్ర‌స్తుతం…

1 hour ago

దిల్ రాజు భలే తప్పించుకున్నారే…

తాము నిర్మించే సినిమాలు ఎంత నష్టం తెచ్చిపెట్టినా… తమను ఎంతగా కుదేలు చేసినా.. వాటి గురించి ఓపెన్ అవ్వడానికి నిర్మాతలు…

1 hour ago

వైసీపీ టాక్‌: ఇక‌ స‌ర్వం స‌జ్జ‌లే!

వైసీపీలో మ‌రోసారి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి శ‌కం ప్రారంభం అవుతుంద‌ని పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. పార్టీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌..…

3 hours ago

ట్రంప్ ల‌క్ష్యంగా కాల్పులు… తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం!

అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌, ఆ దేశ ఉపాధ్య‌క్షుడు జేడీ వాన్స్‌లే ల‌క్ష్యంగా ఓ దుండ‌గుడు కాల్పులు జ‌రిపాడు. భార‌త…

4 hours ago

పవన్ అంటే డార్లింగ్ దర్శకుడికి ఎందుకంత ప్రేమ?

తెలుగు సినిమా చరిత్రలోనే ది బెస్ట్ లవ్ స్టోరీల లిస్ట్ తీస్తే.. అందులో ‘తొలిప్రేమ’ కచ్చితంగా ఉంటుంది. తమిళుడైన కరుణాకరన్ ఈ…

7 hours ago