మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై శాతానికి పైగా డ్రాప్ ఉండటంతో టెన్షన్ పడిన మాట వాస్తవమే. అయితే ఇది తాత్కాలికమే. గుడ్ ఫ్రైడే నుంచి దురంధర్ మళ్ళీ ఊపందుకుంది. బుక్ మై షోలో సగటున గంటకు 22 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోతూ మళ్ళీ టాప్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఇది క్రమంగా పెరగడమే కానీ తరగడం ఉండదు.
ప్రస్తుతం పదిహేను వందల కోట్లు దాటేందుకు పరుగులు పెడుతున్న దురంధర్ 2 అందరూ కోరుకున్నట్టు రెండు వేల కోట్లను చేరుకుంటుందా లేదానే దాని మీద బయ్యర్ వర్గాలు ఒక అంచనాకు రాలేకపోతున్నాయి. ఎందుకంటే మొదటి భాగంలాగా అన్ని రోజులు ఒకేలా పార్ట్ 2 హోల్డ్ చేయలేకపోతోంది. నెంబర్లలో అది స్పష్టంగా కనిపిస్తోంది. పైగా రిపీట్ ఆడియన్స్ దాని స్థాయిలో లేరు. నాలుగు గంటల నిడివి ఒక కారణంగా చెప్పొచ్చు.
ఇలాంటి ప్రతికూలతలు కొన్ని ఉన్నప్పటికీ దురంధర్ రివెంజ్ దూకుడు మార్చి నెల బాక్సాఫీస్ కు ఆక్సిజన్ లా పని చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి స్టార్ హీరో సినిమాను డామినేట్ చేయడం అంటే మాటలు కాదు. పవన్ కళ్యాణ్ మూవీకి హిట్ టాక్ వచ్చి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేది కానీ రణ్వీర్ సింగ్ కు ఆ అంశం కలిసి వచ్చింది. ఏ సెంటర్స్ లో దురంధర్ హోల్డ్ చాలా బాగుంది. మెయిన్ స్క్రీన్లు సగానికి పైగా నిండుతున్నాయి.
ఏప్రిల్ 10 విడుదల కావాల్సిన అక్షయ్ కుమార్ భూత్ బంగ్లా వారం రోజులు ఆలస్యంగా వాయిదా వేసుకుంది. కారణం దురంధరని మళ్ళీ చెప్పనక్కరలేదు. అడివి శేష్ డెకాయిట్ మాత్రం ఆలోచించడం లేదు. అదే డేట్ కి ప్యాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కు రెడీ అయిపోతోంది. ఎలాగూ అప్పటికంతా దురంధర్ నెమ్మదించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి డెకాయిట్ కనక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ఏపీ తెలంగాణ వరకు ఈజీగా దూసుకుపోవచ్చు. రేపు వస్తున్న బైకర్, రాకాస హిట్టయినా ఇబ్బంది ఉండదు.
ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క.. అన్నట్టుగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పరిస్థితి…
పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇందన పొదుపు దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశాక… మన…
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రముఖ ప్రవచ కర్త చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాలను పాఠ్యాంశాలుగా ప్రవేశ పెడుతున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి…
ఒక విడాకుల కేసుకు సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పుడు పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతోంది. సోషల్ మీడియాలో దీనిపై…