Political News

అమ‌రావ‌తిపై చ‌ర్చ‌.. రాజ్య‌స‌భ‌లో దుమ్మురేపిన నాయుడు

అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించే బిల్లును బుధ‌వారం లోక్‌స‌భ ఆమోదించిన ద‌రిమిలా.. రాజ్య‌స‌భ‌లో గురువారం ప్ర‌వేశ పెట్టారు. కేంద్ర హోం శాఖ స‌హాయ‌ మంత్రి నిత్యానంద‌రాయ్‌.. దీనిని స‌భ‌కు స‌మ‌ర్పించారు. అనంత‌రం.. చైర్మ‌న్ సీపీ రాధాకృష్ణ‌న్‌.. చ‌ర్చ‌కు అనుమ‌తించారు. తొలుత టీడీపీ ఎంపీ, కేంద్ర మంత్రి కింజ‌రాపు రామ్మోహ‌న్‌నాయుడు ఈ చ‌ర్చ‌ను ప్రారంభించారు. త‌న‌దైన శైలిలో ఆయ‌న స‌భ‌లో దుమ్మురేపారు.

రాజ‌ధానికి సంబంధించి పూర్వాప‌రాల‌తో పాటు.. చంద్ర‌బాబు-జ‌గ‌న్ ప్ర‌భుత్వాల హ‌యాంలో రాజ‌ధాని ప‌రిస్థితి.. ఇప్పుడు ఏం జ‌రుగుతోంది?  భవిష్య‌త్తులో ఏం జ‌రుగుతుంది.. ఇలా.. అన్ని అంశాల‌ను కూలంకషంగా వివ‌రించారు. రాష్ట్ర విభ‌జ‌న‌ను స‌మ‌ర్ధిస్తూనే.. కానీ.. విభ‌జ‌న జ‌రిగిన తీరును తీవ్రంగా విభేదించారు. రాజ‌ధాని లేకుండా రాష్ట్రాన్ని విడ‌గొట్టార‌ని.. పైగా 16 వేల కోట్ల‌రూపాయ‌ల లోటు బ‌డ్జెట్‌తో రాష్ట్రాన్ని విడ‌దీశార‌ని తెలిపారు.

దీంతో ప్ర‌జ‌లు అపార అనుభ‌వం ఉన్న సీఎం చంద్ర‌బాబుపై న‌మ్మ‌కం పెట్టుకుని 2014 ఎన్నిక‌ల్లో ఆయ‌నను ముఖ్య‌మంత్రిని చేశార‌ని తెలిపారు. ఏ రాష్ట్రానికైనా ఒక రాజ‌దాని ఉంటుంద‌ని.. అది కూడా న‌దుల స‌మీపంలోనే ఉంటుంద‌ని పేర్కొన్న రామ్మోహ‌న్ నాయుడు.. ఈ క్ర‌మంలోనే అన్నీ ఆలోచించి కృష్ణాన‌ది ప‌క్క‌న ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి అంకురార్ప‌ణ చేశారని తెలిపారు. రైతుల‌ను మెప్పించి.. 33 వేల ఎక‌రాల‌కు పైగా భూములు స‌మీక‌ర‌ణ విధానంలో తీసుకున్నార‌ని పేర్కొన్నారు.

అభివృద్ధి జ‌రుగుతున్న క్ర‌మంలో వైసీపీ ప్ర‌భుత్వం స‌ర్వంనాశ‌నం చేసింద‌ని రామ్మోహ‌న్ గుర్తు చేశారు. దీనికి సంబంధించి రైతులు ఉద్య‌మం చేసి.. రాజ‌ధానిని నిల‌బెట్టుకునే ప్ర‌య‌త్నం చేయ‌గా.. దానిపైనా వైసీపీ ప్ర‌భుత్వం ఉక్కుపాదం మోపింద‌ని తెలిపారు. మ‌రోసారి ప్ర‌జ‌లు చంద్ర‌బాబుపై ఉన్న విశ్వాసం తోనే గెలిపించార‌ని.. ఈ క్ర‌మంలో ఇప్పుడు రాజ‌ధానిని నిలబెట్టేందుకు.. `దుష్ట‌శ‌క్తుల‌` నుంచి రాజ‌ధానిని ర‌క్షించేందుకు అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించేందుకే.. చంద్ర‌బాబు పూనుకొన్నార‌ని తెలిపారు. ఇది చ‌రిత్ర‌లో ఓ మైలురాయిలా నిలిచిపోతుంద‌న్నారు.

This post was last modified on April 2, 2026 5:59 pm

Share

Recent Posts

పవన్ కళ్యాణ్ – ఒక జన సేవకుడి ప్రస్థానం

సినిమా నటులు ఎందరో రాజకీయ నాయకులయ్యారు. అయితే ప్రజల మనసులో బలమైన ముద్ర వేసిన వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు.…

3 minutes ago

తమిళనాడులో అప్పుడే పెడాకులా…

మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సీ ఓటర్ చేసిన సర్వే తమిళనాడు టీవీకే, కాంగ్రెస్ కాపురం…

8 minutes ago

స్థానిక ఎన్నికలకు SIR చిక్కుముడి?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( SIR ) చిక్కుముడిగా మారింది.…

28 minutes ago

జనసేన ఎమ్మెల్యేపై చంద్రబాబు అసంతృప్తి

కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…

2 hours ago

ఏపీలో పెరిగిపోతున్న బీపీ… ఆ జిల్లాలో మరీ ఎక్కువ!

ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…

3 hours ago

సినిమా షూటింగ్… ఐదుసార్లు చావుకు దగ్గరగా

సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…

8 hours ago