Political News

అమ‌రావ‌తిపై చ‌ర్చ‌.. రాజ్య‌స‌భ‌లో దుమ్మురేపిన నాయుడు

అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించే బిల్లును బుధ‌వారం లోక్‌స‌భ ఆమోదించిన ద‌రిమిలా.. రాజ్య‌స‌భ‌లో గురువారం ప్ర‌వేశ పెట్టారు. కేంద్ర హోం శాఖ స‌హాయ‌ మంత్రి నిత్యానంద‌రాయ్‌.. దీనిని స‌భ‌కు స‌మ‌ర్పించారు. అనంత‌రం.. చైర్మ‌న్ సీపీ రాధాకృష్ణ‌న్‌.. చ‌ర్చ‌కు అనుమ‌తించారు. తొలుత టీడీపీ ఎంపీ, కేంద్ర మంత్రి కింజ‌రాపు రామ్మోహ‌న్‌నాయుడు ఈ చ‌ర్చ‌ను ప్రారంభించారు. త‌న‌దైన శైలిలో ఆయ‌న స‌భ‌లో దుమ్మురేపారు.

రాజ‌ధానికి సంబంధించి పూర్వాప‌రాల‌తో పాటు.. చంద్ర‌బాబు-జ‌గ‌న్ ప్ర‌భుత్వాల హ‌యాంలో రాజ‌ధాని ప‌రిస్థితి.. ఇప్పుడు ఏం జ‌రుగుతోంది?  భవిష్య‌త్తులో ఏం జ‌రుగుతుంది.. ఇలా.. అన్ని అంశాల‌ను కూలంకషంగా వివ‌రించారు. రాష్ట్ర విభ‌జ‌న‌ను స‌మ‌ర్ధిస్తూనే.. కానీ.. విభ‌జ‌న జ‌రిగిన తీరును తీవ్రంగా విభేదించారు. రాజ‌ధాని లేకుండా రాష్ట్రాన్ని విడ‌గొట్టార‌ని.. పైగా 16 వేల కోట్ల‌రూపాయ‌ల లోటు బ‌డ్జెట్‌తో రాష్ట్రాన్ని విడ‌దీశార‌ని తెలిపారు.

దీంతో ప్ర‌జ‌లు అపార అనుభ‌వం ఉన్న సీఎం చంద్ర‌బాబుపై న‌మ్మ‌కం పెట్టుకుని 2014 ఎన్నిక‌ల్లో ఆయ‌నను ముఖ్య‌మంత్రిని చేశార‌ని తెలిపారు. ఏ రాష్ట్రానికైనా ఒక రాజ‌దాని ఉంటుంద‌ని.. అది కూడా న‌దుల స‌మీపంలోనే ఉంటుంద‌ని పేర్కొన్న రామ్మోహ‌న్ నాయుడు.. ఈ క్ర‌మంలోనే అన్నీ ఆలోచించి కృష్ణాన‌ది ప‌క్క‌న ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి అంకురార్ప‌ణ చేశారని తెలిపారు. రైతుల‌ను మెప్పించి.. 33 వేల ఎక‌రాల‌కు పైగా భూములు స‌మీక‌ర‌ణ విధానంలో తీసుకున్నార‌ని పేర్కొన్నారు.

అభివృద్ధి జ‌రుగుతున్న క్ర‌మంలో వైసీపీ ప్ర‌భుత్వం స‌ర్వంనాశ‌నం చేసింద‌ని రామ్మోహ‌న్ గుర్తు చేశారు. దీనికి సంబంధించి రైతులు ఉద్య‌మం చేసి.. రాజ‌ధానిని నిల‌బెట్టుకునే ప్ర‌య‌త్నం చేయ‌గా.. దానిపైనా వైసీపీ ప్ర‌భుత్వం ఉక్కుపాదం మోపింద‌ని తెలిపారు. మ‌రోసారి ప్ర‌జ‌లు చంద్ర‌బాబుపై ఉన్న విశ్వాసం తోనే గెలిపించార‌ని.. ఈ క్ర‌మంలో ఇప్పుడు రాజ‌ధానిని నిలబెట్టేందుకు.. `దుష్ట‌శ‌క్తుల‌` నుంచి రాజ‌ధానిని ర‌క్షించేందుకు అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించేందుకే.. చంద్ర‌బాబు పూనుకొన్నార‌ని తెలిపారు. ఇది చ‌రిత్ర‌లో ఓ మైలురాయిలా నిలిచిపోతుంద‌న్నారు.

This post was last modified on April 2, 2026 5:59 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రౌడీ ఇన్‌స్పెక్టర్ స్థాయిలో రంజింపజేయాలి

బాలకృష్ణ ఖాకీ డ్రెస్సు వేస్తే బ్లాక్ బస్టర్ ఖాయమనేది అభిమానుల నమ్మకం. దానికి పునాది వేసింది రౌడీ ఇన్‌స్పెక్టర్. 1992లో…

2 hours ago

సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజుల ఊపిరి

తెలుగు రాష్ట్రాల్లో చాలా సింగల్ స్క్రీన్ల మనుగడ కష్టమైపోయింది. ఆల్రెడీ అధిక శాతం మూతబడిపోయి ఫంక్షన్ హాళ్లు, షాపింగ్ మాల్స్…

3 hours ago

వారణాసి ఇప్పుడెందుకు గుర్తుకు వస్తోంది

రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చాక సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ముంబైలో దీని స్పెషల్ ప్రీమియర్ చూసిన…

3 hours ago

ఎల‌క్ష‌న్ ఎఫెక్ట్‌: `ఐప్యాక్`పై ఈడీ న‌జ‌ర్‌!

పొలిటిక‌ల్ క‌న్స‌ల్టెన్సీ సంస్థ‌.. ఐప్యాక్‌పై ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఏక‌కాలంలో గురువారం.. దేశ‌వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లో ఐప్యాక్ సంస్థ‌ల‌కు…

3 hours ago

శుభసూచకం… ప్రిమియర్లు ఫుల్

వేసవి సీజన్లో కొంచెం ముందుగానే రేసులోకి దిగింది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. కానీ ఈ చిత్రం టాలీవుడ్‌కు శుభారంభాన్ని అందించలేకపోయింది.…

4 hours ago

జగన్ మావిగన్… ఇప్పుడు సినిమా అయిపోయింది

మావిగన్.. నిన్న మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తున్న పదం. ఇప్పటిదాకా ఎన్నడూ వినని ఈ పదం…

4 hours ago