Political News

‘వైసీపీ లంకలో ఉన్నవారంతా రాక్షసులు కారు’

ఏపీలో విపక్ష వైసీపీలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాటే ఫైనల్ అని, పార్టీలోని ఏ ఒక్క నేత కూడా ఆయన మాటకు అడ్డు చెప్పే పరిస్థితే లేదని ఓ రేంజిలో ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఆ మాట ఎంతమాత్రం నిజం కాదని తాజాగా తేలిపోయింది. ఆయా అంశాలపై జగన్ తీసుకున్న నిర్ణయాలను ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించిన నేతలు అడ్డుకునే యత్నం చేశారట.

అంతేకాదండోయ్.. ఆయా అంశాలపై తన నిర్ణయాలను జగన్ వెనక్కు తీసుకునే దిశగా ఆయా నేతలు చాలానే యత్నించారట. అయితే జగన్ వైఖరి తెలిసి…ఎంతదాకా వ్యతిరేకించాలో.. అంతదాకానే వ్యతిరేకించి ఆపై మౌనంగా ఉండిపోయారట. ఈ విషయాలు ఇప్పుడు ఏపీ అసెంబ్లీ సమావేశాల సాక్షిగా తెలిసి వచ్చింది.

ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానానికి ఆమోదం తెలిపేందుకు శనివారం ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో తీర్మానాన్ని సభా నాయకుడి హోదాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రతిపాదించగా… ఆ తీర్మానాన్ని బలపరుస్తూ మంత్రులు, పలువురు కూటమి పార్టీలకు చెందిన నేతలు మాట్లాడారు.

అందులో భాగంగా గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగి… ఆ తర్వాత వైసీపీని వీడి టీడీపీలో చేరి తిరిగి ఎమ్మెల్యేగా గెలుపొందిన వసంత కృష్ణ ప్రసాద్ కీలక ప్రసంగం చేశారు. నాడు వైసీపీలో ఉన్నవారినంతా ఇతర పార్టీలు రాక్షసులుగా అబివర్ణించిన తీరును ఆయన ప్రస్తావించారు.

లంకలో ఉన్న వాళ్లంతా రాక్షసులన్నట్లుగా వైసీపీలో ఉన్నవాళ్లంతా రాక్షసులేనని విమర్శలు విని తాను ఎంతగానో బాధపడ్డానని ఈ సందర్భంగా కృష్ణ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. నాడు జగన్ మూడు రాజధానుల అంశాన్ని ఎత్తుకోగా… ఆ నిర్ణయాన్ని తాను వ్యతిరేకించానని చెప్పారు.

తనతో పాటు నాడు ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ పీనియర్ నేత మల్లాది విష్ణు కూడా జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించారని ఆయన చెప్పారు. ఈ నిర్ణయం పార్టీకి నష్టం చేస్తుందని తాము ఎంతగా చెప్పినా.. జగన్ వినిపించుకోలేదన్నారు. అయితే తన నిర్ణయానికి వ్యతిరేకంగా సాగే నేతలను జగన్ ఏం చేస్తారో అందరికీ తెలిసిందేనని చెప్పిన కృష్ణ ప్రసాద్… ఎంతదాకా వ్యతిరేకించాలో అంతదాకా మాత్రమే తాము ముందుకు వెళ్లామని, ఆపై ఏం జరుగుతుందో తెలిసి మిన్నకుండిపోవాల్సి వచ్చిందని చెప్పారు.

This post was last modified on March 28, 2026 5:35 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Jagan

Recent Posts

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

1 hour ago

మలుపు తిప్పేది అప్పాల సూరినే

ప్రమోషన్ల సంగతి ఎలా ఉన్నా పెద్ది ఇంకో ఇరవై రెండు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నెల 18…

2 hours ago

చిన్న నటుడే కానీ పెద్ద నిజం చెప్పాడు

పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…

3 hours ago

కేంద్రంతో క‌లుస్తాం.. మోడీతో కాదు: రేవంత్ అంత‌రంగం

హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేసిన వ్యాఖ్య‌లు.. రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారి తీసిన విష‌యం తెలిసిందే. నువ్వు నాతో…

3 hours ago

సీఎం విజయ్ కి బంపర్ ఆఫర్

తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్ కి నిజంగానే బంపర్ ఆఫర్ వచ్చిందని చెప్పాలి. అదికార డీఎంకేతో…

3 hours ago

తారక్ ఫ్యాన్స్‌కు ఆ రోజు నిద్ర ఉండదు

మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా స్పెషల్. ఈ నెలలోనే లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక…

4 hours ago