Political News

‘వైసీపీ లంకలో ఉన్నవారంతా రాక్షసులు కారు’

ఏపీలో విపక్ష వైసీపీలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాటే ఫైనల్ అని, పార్టీలోని ఏ ఒక్క నేత కూడా ఆయన మాటకు అడ్డు చెప్పే పరిస్థితే లేదని ఓ రేంజిలో ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఆ మాట ఎంతమాత్రం నిజం కాదని తాజాగా తేలిపోయింది. ఆయా అంశాలపై జగన్ తీసుకున్న నిర్ణయాలను ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించిన నేతలు అడ్డుకునే యత్నం చేశారట.

అంతేకాదండోయ్.. ఆయా అంశాలపై తన నిర్ణయాలను జగన్ వెనక్కు తీసుకునే దిశగా ఆయా నేతలు చాలానే యత్నించారట. అయితే జగన్ వైఖరి తెలిసి…ఎంతదాకా వ్యతిరేకించాలో.. అంతదాకానే వ్యతిరేకించి ఆపై మౌనంగా ఉండిపోయారట. ఈ విషయాలు ఇప్పుడు ఏపీ అసెంబ్లీ సమావేశాల సాక్షిగా తెలిసి వచ్చింది.

ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానానికి ఆమోదం తెలిపేందుకు శనివారం ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో తీర్మానాన్ని సభా నాయకుడి హోదాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రతిపాదించగా… ఆ తీర్మానాన్ని బలపరుస్తూ మంత్రులు, పలువురు కూటమి పార్టీలకు చెందిన నేతలు మాట్లాడారు.

అందులో భాగంగా గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగి… ఆ తర్వాత వైసీపీని వీడి టీడీపీలో చేరి తిరిగి ఎమ్మెల్యేగా గెలుపొందిన వసంత కృష్ణ ప్రసాద్ కీలక ప్రసంగం చేశారు. నాడు వైసీపీలో ఉన్నవారినంతా ఇతర పార్టీలు రాక్షసులుగా అబివర్ణించిన తీరును ఆయన ప్రస్తావించారు.

లంకలో ఉన్న వాళ్లంతా రాక్షసులన్నట్లుగా వైసీపీలో ఉన్నవాళ్లంతా రాక్షసులేనని విమర్శలు విని తాను ఎంతగానో బాధపడ్డానని ఈ సందర్భంగా కృష్ణ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. నాడు జగన్ మూడు రాజధానుల అంశాన్ని ఎత్తుకోగా… ఆ నిర్ణయాన్ని తాను వ్యతిరేకించానని చెప్పారు.

తనతో పాటు నాడు ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ పీనియర్ నేత మల్లాది విష్ణు కూడా జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించారని ఆయన చెప్పారు. ఈ నిర్ణయం పార్టీకి నష్టం చేస్తుందని తాము ఎంతగా చెప్పినా.. జగన్ వినిపించుకోలేదన్నారు. అయితే తన నిర్ణయానికి వ్యతిరేకంగా సాగే నేతలను జగన్ ఏం చేస్తారో అందరికీ తెలిసిందేనని చెప్పిన కృష్ణ ప్రసాద్… ఎంతదాకా వ్యతిరేకించాలో అంతదాకా మాత్రమే తాము ముందుకు వెళ్లామని, ఆపై ఏం జరుగుతుందో తెలిసి మిన్నకుండిపోవాల్సి వచ్చిందని చెప్పారు.

This post was last modified on March 28, 2026 5:35 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Jagan

Recent Posts

మీ వాళ్లకు చెప్పండి… ఏపీ సీఎంకి తెలంగాణ మంత్రి లేఖ

తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…

22 minutes ago

మోదీ స్కిన్ టోన్… అక్కడ తెలుపు.. ఇక్కడ నలుపా?

ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్‌పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…

25 minutes ago

టీవీ సౌండ్ హఠాత్తుగా ఆగిపోయిందే

మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…

55 minutes ago

ఎన్టీఆర్ నీల్… ఇంకో ఏడాది ఆలస్యంగా

అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…

1 hour ago

కొత్త ‘మహావతారం’పై విమర్శలేల?

గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…

3 hours ago

అన్నీ కారుణ్యాలే అయితే ప్రతిభావంతులు ఏం చెయ్యాలి?

రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…

4 hours ago