ఏపీలో విపక్ష వైసీపీలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాటే ఫైనల్ అని, పార్టీలోని ఏ ఒక్క నేత కూడా ఆయన మాటకు అడ్డు చెప్పే పరిస్థితే లేదని ఓ రేంజిలో ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఆ మాట ఎంతమాత్రం నిజం కాదని తాజాగా తేలిపోయింది. ఆయా అంశాలపై జగన్ తీసుకున్న నిర్ణయాలను ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించిన నేతలు అడ్డుకునే యత్నం చేశారట.
అంతేకాదండోయ్.. ఆయా అంశాలపై తన నిర్ణయాలను జగన్ వెనక్కు తీసుకునే దిశగా ఆయా నేతలు చాలానే యత్నించారట. అయితే జగన్ వైఖరి తెలిసి…ఎంతదాకా వ్యతిరేకించాలో.. అంతదాకానే వ్యతిరేకించి ఆపై మౌనంగా ఉండిపోయారట. ఈ విషయాలు ఇప్పుడు ఏపీ అసెంబ్లీ సమావేశాల సాక్షిగా తెలిసి వచ్చింది.
ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానానికి ఆమోదం తెలిపేందుకు శనివారం ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో తీర్మానాన్ని సభా నాయకుడి హోదాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రతిపాదించగా… ఆ తీర్మానాన్ని బలపరుస్తూ మంత్రులు, పలువురు కూటమి పార్టీలకు చెందిన నేతలు మాట్లాడారు.
అందులో భాగంగా గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగి… ఆ తర్వాత వైసీపీని వీడి టీడీపీలో చేరి తిరిగి ఎమ్మెల్యేగా గెలుపొందిన వసంత కృష్ణ ప్రసాద్ కీలక ప్రసంగం చేశారు. నాడు వైసీపీలో ఉన్నవారినంతా ఇతర పార్టీలు రాక్షసులుగా అబివర్ణించిన తీరును ఆయన ప్రస్తావించారు.
లంకలో ఉన్న వాళ్లంతా రాక్షసులన్నట్లుగా వైసీపీలో ఉన్నవాళ్లంతా రాక్షసులేనని విమర్శలు విని తాను ఎంతగానో బాధపడ్డానని ఈ సందర్భంగా కృష్ణ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. నాడు జగన్ మూడు రాజధానుల అంశాన్ని ఎత్తుకోగా… ఆ నిర్ణయాన్ని తాను వ్యతిరేకించానని చెప్పారు.
తనతో పాటు నాడు ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ పీనియర్ నేత మల్లాది విష్ణు కూడా జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించారని ఆయన చెప్పారు. ఈ నిర్ణయం పార్టీకి నష్టం చేస్తుందని తాము ఎంతగా చెప్పినా.. జగన్ వినిపించుకోలేదన్నారు. అయితే తన నిర్ణయానికి వ్యతిరేకంగా సాగే నేతలను జగన్ ఏం చేస్తారో అందరికీ తెలిసిందేనని చెప్పిన కృష్ణ ప్రసాద్… ఎంతదాకా వ్యతిరేకించాలో అంతదాకా మాత్రమే తాము ముందుకు వెళ్లామని, ఆపై ఏం జరుగుతుందో తెలిసి మిన్నకుండిపోవాల్సి వచ్చిందని చెప్పారు.
బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…
అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు వెళ్లేవారు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ దేశంలో చదువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేషన్…
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…
మళ్ళీ ఓజి 2 హాట్ టాపిక్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుంచి పవన్, దర్శకుడు సుజిత్…
హీరోల స్టార్ పవర్ పెద్దగా పని చేయట్లేదు ఈ రోజుల్లో. కంటెంట్ను బట్టే సినిమాలు చూస్తున్నారు. స్టార్లను చూసి ఎగబడి…