Political News

‘వైసీపీ లంకలో ఉన్నవారంతా రాక్షసులు కారు’

ఏపీలో విపక్ష వైసీపీలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాటే ఫైనల్ అని, పార్టీలోని ఏ ఒక్క నేత కూడా ఆయన మాటకు అడ్డు చెప్పే పరిస్థితే లేదని ఓ రేంజిలో ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఆ మాట ఎంతమాత్రం నిజం కాదని తాజాగా తేలిపోయింది. ఆయా అంశాలపై జగన్ తీసుకున్న నిర్ణయాలను ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించిన నేతలు అడ్డుకునే యత్నం చేశారట.

అంతేకాదండోయ్.. ఆయా అంశాలపై తన నిర్ణయాలను జగన్ వెనక్కు తీసుకునే దిశగా ఆయా నేతలు చాలానే యత్నించారట. అయితే జగన్ వైఖరి తెలిసి…ఎంతదాకా వ్యతిరేకించాలో.. అంతదాకానే వ్యతిరేకించి ఆపై మౌనంగా ఉండిపోయారట. ఈ విషయాలు ఇప్పుడు ఏపీ అసెంబ్లీ సమావేశాల సాక్షిగా తెలిసి వచ్చింది.

ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానానికి ఆమోదం తెలిపేందుకు శనివారం ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో తీర్మానాన్ని సభా నాయకుడి హోదాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రతిపాదించగా… ఆ తీర్మానాన్ని బలపరుస్తూ మంత్రులు, పలువురు కూటమి పార్టీలకు చెందిన నేతలు మాట్లాడారు.

అందులో భాగంగా గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగి… ఆ తర్వాత వైసీపీని వీడి టీడీపీలో చేరి తిరిగి ఎమ్మెల్యేగా గెలుపొందిన వసంత కృష్ణ ప్రసాద్ కీలక ప్రసంగం చేశారు. నాడు వైసీపీలో ఉన్నవారినంతా ఇతర పార్టీలు రాక్షసులుగా అబివర్ణించిన తీరును ఆయన ప్రస్తావించారు.

లంకలో ఉన్న వాళ్లంతా రాక్షసులన్నట్లుగా వైసీపీలో ఉన్నవాళ్లంతా రాక్షసులేనని విమర్శలు విని తాను ఎంతగానో బాధపడ్డానని ఈ సందర్భంగా కృష్ణ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. నాడు జగన్ మూడు రాజధానుల అంశాన్ని ఎత్తుకోగా… ఆ నిర్ణయాన్ని తాను వ్యతిరేకించానని చెప్పారు.

తనతో పాటు నాడు ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ పీనియర్ నేత మల్లాది విష్ణు కూడా జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించారని ఆయన చెప్పారు. ఈ నిర్ణయం పార్టీకి నష్టం చేస్తుందని తాము ఎంతగా చెప్పినా.. జగన్ వినిపించుకోలేదన్నారు. అయితే తన నిర్ణయానికి వ్యతిరేకంగా సాగే నేతలను జగన్ ఏం చేస్తారో అందరికీ తెలిసిందేనని చెప్పిన కృష్ణ ప్రసాద్… ఎంతదాకా వ్యతిరేకించాలో అంతదాకా మాత్రమే తాము ముందుకు వెళ్లామని, ఆపై ఏం జరుగుతుందో తెలిసి మిన్నకుండిపోవాల్సి వచ్చిందని చెప్పారు.

This post was last modified on March 28, 2026 5:35 pm

Share

Recent Posts

మాధ‌వ‌న్ గుండెలు గుబేల్‌

విజ‌య్ ముఖ్య‌మంత్రి అయ్యాక‌ త‌మిళ‌నాడు రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జ‌రిగినా ప‌రిస్థితి…

1 hour ago

సినీ పరిశ్రమ ఒక మంచి నటుడిని కోల్పోయింది

తెలుగు ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకున్న బాలీవుడ్ న‌టుడు ప్ర‌దీప్ రావ‌త్ హ‌ఠాత్తుగా క‌న్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండ‌రీ…

3 hours ago

రిస్కుకు రెడీ అవుతున్న కనకరాజు

ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…

5 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న బిక్షు యాదవ్

రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…

5 hours ago

ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చిన చంద్ర‌బాబు

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వ రెండేళ్ల పాల‌న‌పై సీఎం చంద్ర‌బాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక ప‌రిస్థితిని ఆయ‌న వివ‌రించారు.…

6 hours ago

దేవిలో ఇది గొప్ప లక్షణం

టీనేజీలోనే తన ప్రతిభను చాటుకుని చాలా వేగంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగాడు దేవిశ్రీ ప్రసాద్. ఎంత ఎదిగినా ఒదిగి…

8 hours ago