తొమ్మిదేళ్ల కిందట ‘బాహుబలి: ది కంక్లూజన్’ బాక్సాఫీస్ దగ్గర మామూలు ప్రభంజనం సృష్టించలేదు. అప్పటిదాకా ఉన్న అన్ని ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులనూ ఆ సినిమా బద్దలు కొట్టేసింది. ఐతే ‘దంగల్’ సినిమాను చైనాలో రిలీజ్ చేయడం ద్వారా.. ఆ సినిమా ఓవరాల్ వసూళ్ల రికార్డును బద్దలు కొట్టేయగలిగారు. ఆపై బాహుబలి-2 పేరిట ఉన్న వేరే రికార్డులు ఒక్కొక్కటిగా బద్దలవుతూ వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ‘బాహుబలి-2’ రికార్డులన్నీ చెరిగిపోయాయి.
కానీ యుఎస్లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా రాజమౌళి సినిమా నెలకొల్పిన రికార్డును మాత్రం మరే చిత్రం అధిగమించలేకపోయింది. ఇండియాలో అంటే టికెట్ల ధరలు పెరగడం, మార్కెట్ పరిధి విస్తరించడం వల్ల ‘బాహుబలి-2’ రికార్డులను వేరే సినిమాలు అధిగమించగలిగాయి కానీ.. యుఎస్లో కలెక్షన్లను డాలర్లలో కొలుస్తారు కాబట్టి ఆ సినిమా వసూళ్లను దాటడం మిగతా చిత్రాలకు చాలా కష్టమైంది.
‘బాహుబలి-2’ యుఎస్లో 22 మిలియన్ డాలర్లు కొల్లగొట్టడం విశేషం. రెండేళ్ల ముందు ప్రభాస్ ‘కల్కి’ చిత్రం ‘బాహుబలి-2’ రికార్డుకు చేరువగా వచ్చి ఆగిపోయింది. ఆ చిత్రం 18.5 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఐతే గత ఏడాది ‘దురంధర్’ చిత్రం ‘బాహుబలి-2’ను బీట్ చేసేలా కనిపించింది కానీ.. అది కూడా ఫుల్ రన్లో 20.65 మిలియన్ డాలర్ల దగ్గర ఆగింది. కానీ ‘దురంధర్-2’ మాత్రం పక్కాగా ‘బాహుబలి-2’ను బీట్ చేసేలా కనిపిస్తోంది.
ఈ సినిమా తొమ్మిది రోజుల్లోనే నార్త్ అమెరికాలో 19 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఈ చిత్రానికి లాంగ్ రన్ ఉండబోతోందన్నది స్పష్టం. కాబట్టి ఇంకొన్ని రోజుల్లో బాహుబలి-2ను అధిగమించడం లాంఛనమే. సెకండ్ వీకెండ్ అయ్యేసరికే ‘బాహుబలి-2’ రికార్డు బద్దలైనా ఆశ్చర్యం లేదు. మొత్తానికి యుఎస్లో హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ మూవీగా తొమ్మిదేళ్ల పాటు ‘బాహుబలి: ది కంక్లూజన్’ పేరిట ఉన్న రికార్డును ‘దురంధర్: ది రివెంజ్’ బద్దలు కొట్టబోతోందన్నమాట.
This post was last modified on March 28, 2026 5:35 pm
ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో కథానాయికగా నటిస్తూనే.. ఇంకోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ మెరుస్తోంది కీర్తి సురేష్. మహానటి తర్వాత…
విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జరిగినా పరిస్థితి…
తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు ప్రదీప్ రావత్ హఠాత్తుగా కన్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండరీ…
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…
రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…
ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు.…