Political News

వైసీపీ మళ్ళీ ఎప్పుడు వస్తుందో చెప్పిన పవన్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి ఉనికిని ప్రశ్నార్థకం చేసిన వైసీపీ తిరిగి అధికారంలోకి రాదన్న ఆయన… ఒకవేళ ఆ పార్టీ అధికారం చేపట్టినా… తన ఇష్టారాజ్యంగా ముందుకు సాగే అవకాశం ఉండదని, ఆ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏమీ చేలేదని పవన్ చెప్పారు.

చట్టసభల్లో కూర్చుని దాడులు చేస్తామంటే తాము చూస్తూ ఊరికే కూర్చునే పరిస్థితి లేదని కూడా పవన్ తేల్చి చెప్పారు. మళ్ల వైసీపీ వస్తే ఏమిటని ఆర్సెలర్ మిట్టల్ ప్రతినిధులతో పాటు అందరూ అడుగుతున్నారని… అందరికీ తాను ఇదే సమాధానం ఇస్తున్నానని పవన్ చెప్పుకొచ్చారు.

ఏపీకి శాశ్వత రాజదానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలనే తీర్మానాన్ని ఆమోదించేందుకు ఏపీ అసెంబ్లీ శనివారం ఒక్కరోజు ప్రత్యేకంగా సమావేశం అయ్యింది. ఈ సందర్బంగా తీర్మానాన్ని సభా నాయకుడి హోదాలో సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రతిపాదించగా…దానిపై పలువురు మంత్రులు, కూటమి పార్టీల సభ్యులు మాట్లాడిన తర్వాత పవన్ కూడా మాట్లాడారు.

ఈ సందర్భంగా రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ కొనసాగుతున్న తీరు తనకు తీరని బాధ కలిగిస్తోందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు దాటినా దేశంలో రాజధాని లేని ఏకైక రాష్ట్రంగా ఏపీ ఉండటం తనను తీవ్ర ఆవేదనకు గురి చేస్తోందన్నారు. 

తెలంగాణ, ఏపీ అన్న భేద భావన ఇప్పటికీ చాలా మందిలో ఉందన్న పవన్… తనలో మాత్రం ఆ భావన లేదన్నారు. తెలంగాణ, ఏపీ వేర్వేరు కాదని, ఈ రెండు రాష్ట్రాలు తెలుగు నేలగా తాను భావిస్తానని ఆయన తెలిపారు. పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణత్యాగం వల్ల భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడితే… నాడు ఏపీతో పాటు చాలా రాష్ట్రాలు భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పాటయ్యాయని ఆయన చెప్పారు.

రాజధాని కూడా లేకుండా నూతన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. అమరావతి కోసం బాబును నమ్మి రైతులు 33 వేల ఎకరాలను ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. రాజధాని కోసం త్యాగం చేసిన రైతుల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని పవన్ అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా వైసీపీ అధికారంలో ఉండగా… ఆ పార్టీ ప్రభుత్వం చేసిన చర్యలను పవన్ తూర్పారబట్టారు. అప్పటిదకా ఏపీ రాజధానిగా అమరావతికి తాము ఓకేనని చెప్పిన వైపీనీ… తాను అధికారంలోకి రాగానే అమరావతిని నిర్వీర్యం చేసే దిశగా చర్యలు చేపట్టిందని ఆయన విమర్శించారు.

నాడు వైసీపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలను చూశాకే రాష్ట్రానికి వస్తున్న ప్రతి పారిశ్రామికవేత్త తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నాని ఆయన అన్నారు. ఈ ప్రశ్న చివరకు ఆర్సెలర్ మిట్టల్ కంపెనీ నుంచి కూడా వినిపించిందని పవన్ తెలిపారు. అయితే తిరిగి వైసీపీ అధికారంలోకి రాదని తాము వారికి చెప్పినట్లుగా ఆయన తెలిపారు.

వైసీపీ అధికారంలోకి రావడమనేది కూటమి నాయకుల చేతుల్లోనే ఉందని.. మనలోని ఐక్యత కోల్పోతే అప్పుడు వైసీపీ వాళ్లకు బలం చేకూరుతుందని.. రాష్టం కోసం మనమందరం కలిసే ఉండాలని పవన్ ఈ సందర్భంగా మరోసారి పిలుపునిచ్చారు.

This post was last modified on March 28, 2026 5:16 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

టీవీ సౌండ్ హఠాత్తుగా ఆగిపోయిందే

మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…

23 minutes ago

ఎన్టీఆర్ నీల్… ఇంకో ఏడాది ఆలస్యంగా

అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…

44 minutes ago

కొత్త ‘మహావతారం’పై విమర్శలేల?

గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…

2 hours ago

అన్నీ కారుణ్యాలే అయితే ప్రతిభావంతులు ఏం చెయ్యాలి?

రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…

3 hours ago

30 కోట్ల‌తో సీనియ‌ర్ నిర్మాత సాహ‌సం

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో సుదీర్ఘ కాలంగా నిర్మాత‌గా ఉన్నారు చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు. 90వ ద‌శ‌కంలోనే దివంగ‌త న‌టుడు శోభ‌న్ బాబు…

3 hours ago

రౌడీ కోసం నాని వస్తే… అంత విశేషమా?

ఒక స్టార్ హీరో సినిమా ప్రారంభోత్సవం జరుగుతుంటేనో లేదా ప్రి రిలీజ్ ఈవెంట్ ఏర్పాాటు చేస్తేనో.. ఇంకో స్టార్ హీరో…

6 hours ago