ఏపీసీసీ చీఫ్ షర్మిల, వైసీపీ నేతల మధ్య మాట యుద్ధం జరుగుతోంది. విమర్శలు, ప్రతివిమర్శలతో రోజురోజుకు వివాదం పెరుగుతోంది. ముఖ్యంగా జగన్, షర్మిల మధ్య ఆస్తి వివాదం మంటలు రాజేస్తున్నాయి. అటు షర్మిల కామెంట్లకు వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. దీంతో కుటుంబం వివాదం రచ్చకెక్కుతోంది.
తాజాగా ఇదే అంశంపై షర్మిల స్పందించారు. ఆమె కడపలో మాట్లాడుతూ వైసీపీ జోలికి వెళ్లాల్సిన అవసరం తనకు లేదన్నారు. అయితే తన జోలికి వస్తే తాను కూడా గేమ్ ఆడగాలను అని అన్నారు. తన లక్ష్యం జగన్ కానే కాదని చెప్పారు. మరోసారి వైసీపీ నేతలను సైతాన్ సైన్యం అని సంబోధించారు.
ఆ సైతాన్ సైన్యం మూలాన ప్రతి సారి తాను సంజాయిషీ, సమాధానం చెప్పకోవలసి వస్తుందన్నారు. కుక్కలు అనే మాట తాను అనలేదని సంజాయిషీ ఇచ్చుకున్నారు షర్మిల. విజయమ్మ వద్దని లేఖ రాసినా మాట్లాడుతున్నారు అంటే, మొరగడం కుక్కల నైజం అని మాత్రమే అన్నానని వివరణ ఇచ్చారు.
ఉదయం ఎక్కడో వీడియో చూశా.. వైసీపీ నేతలను కుక్కలతో పోల్చితే కుక్కలు బాధపడుతున్నాయట అని వ్యాఖ్యానించారు. అరటి రైతుల పక్షాన షర్మిల ఈ రోజు కడపలో కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె ఈ కామెంట్స్చేశారు.
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…
ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…
వందల కోట్లతో తీసినా, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా ఏదైనా సినిమానే. వేసేది ప్రొజెక్టర్ వాడే తెరపైనే. చిన్నాపెద్దా…
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రాశీ సింగ్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటోలు భలే ఆకట్టుకుంటున్నాయి.…