ఏపీసీసీ చీఫ్ షర్మిల, వైసీపీ నేతల మధ్య మాట యుద్ధం జరుగుతోంది. విమర్శలు, ప్రతివిమర్శలతో రోజురోజుకు వివాదం పెరుగుతోంది. ముఖ్యంగా జగన్, షర్మిల మధ్య ఆస్తి వివాదం మంటలు రాజేస్తున్నాయి. అటు షర్మిల కామెంట్లకు వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. దీంతో కుటుంబం వివాదం రచ్చకెక్కుతోంది.
తాజాగా ఇదే అంశంపై షర్మిల స్పందించారు. ఆమె కడపలో మాట్లాడుతూ వైసీపీ జోలికి వెళ్లాల్సిన అవసరం తనకు లేదన్నారు. అయితే తన జోలికి వస్తే తాను కూడా గేమ్ ఆడగాలను అని అన్నారు. తన లక్ష్యం జగన్ కానే కాదని చెప్పారు. మరోసారి వైసీపీ నేతలను సైతాన్ సైన్యం అని సంబోధించారు.
ఆ సైతాన్ సైన్యం మూలాన ప్రతి సారి తాను సంజాయిషీ, సమాధానం చెప్పకోవలసి వస్తుందన్నారు. కుక్కలు అనే మాట తాను అనలేదని సంజాయిషీ ఇచ్చుకున్నారు షర్మిల. విజయమ్మ వద్దని లేఖ రాసినా మాట్లాడుతున్నారు అంటే, మొరగడం కుక్కల నైజం అని మాత్రమే అన్నానని వివరణ ఇచ్చారు.
ఉదయం ఎక్కడో వీడియో చూశా.. వైసీపీ నేతలను కుక్కలతో పోల్చితే కుక్కలు బాధపడుతున్నాయట అని వ్యాఖ్యానించారు. అరటి రైతుల పక్షాన షర్మిల ఈ రోజు కడపలో కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె ఈ కామెంట్స్చేశారు.
This post was last modified on March 25, 2026 7:00 pm
ఓ ముప్పై ఏళ్ళు వెనక్కు వెళ్తే చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్ల ప్రభంజనం ఉదృతంగా ఉన్న టైంలో తెలుగు భాష…
గత ఏడాది కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ సోషల్ మీడియా దృష్టిలో పడి వైరల్ అయిన మోనాలిసా.. ఇటీవల తాను ప్రేమించిన…
ప్రధాన మంత్రినరేంద్ర మోడీతో సీనియర్ నాయకురాలు, బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి, వెంకటేశ్వరరావు…
దర్శకధీరుడు రాజమౌళి సృష్టించిన విజువల్ వండర్ ‘RRR’ విడుదలై అప్పుడే నాలుగేళ్లు గడిచిపోయాయి. భారతీయ సినిమా స్థాయిని అంతర్జాతీయ వేదికపై…
ఆదిత్య ధర్ తెరకెక్కించిన ‘ధురంధర్ 2’ సినిమాలో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాత్రను చూపించిన విధానం ఇప్పుడు…
సెట్లు, షూటింగ్ స్పాట్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని వాటి వివరాలు, ఫోటోలు బయటికి రాకుండా జాగ్రత్తపడే రాజమౌళి ఈసారి…