ఏపీసీసీ చీఫ్ షర్మిల, వైసీపీ నేతల మధ్య మాట యుద్ధం జరుగుతోంది. విమర్శలు, ప్రతివిమర్శలతో రోజురోజుకు వివాదం పెరుగుతోంది. ముఖ్యంగా జగన్, షర్మిల మధ్య ఆస్తి వివాదం మంటలు రాజేస్తున్నాయి. అటు షర్మిల కామెంట్లకు వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. దీంతో కుటుంబం వివాదం రచ్చకెక్కుతోంది.
తాజాగా ఇదే అంశంపై షర్మిల స్పందించారు. ఆమె కడపలో మాట్లాడుతూ వైసీపీ జోలికి వెళ్లాల్సిన అవసరం తనకు లేదన్నారు. అయితే తన జోలికి వస్తే తాను కూడా గేమ్ ఆడగాలను అని అన్నారు. తన లక్ష్యం జగన్ కానే కాదని చెప్పారు. మరోసారి వైసీపీ నేతలను సైతాన్ సైన్యం అని సంబోధించారు.
ఆ సైతాన్ సైన్యం మూలాన ప్రతి సారి తాను సంజాయిషీ, సమాధానం చెప్పకోవలసి వస్తుందన్నారు. కుక్కలు అనే మాట తాను అనలేదని సంజాయిషీ ఇచ్చుకున్నారు షర్మిల. విజయమ్మ వద్దని లేఖ రాసినా మాట్లాడుతున్నారు అంటే, మొరగడం కుక్కల నైజం అని మాత్రమే అన్నానని వివరణ ఇచ్చారు.
ఉదయం ఎక్కడో వీడియో చూశా.. వైసీపీ నేతలను కుక్కలతో పోల్చితే కుక్కలు బాధపడుతున్నాయట అని వ్యాఖ్యానించారు. అరటి రైతుల పక్షాన షర్మిల ఈ రోజు కడపలో కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె ఈ కామెంట్స్చేశారు.
This post was last modified on March 25, 2026 7:00 pm
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…