Political News

ఇబ్బడి ముబ్బడిగా సీట్ల పెంపు మంచిదేనా?

అటు పార్లమెంట్, ఇటు అసెంబ్లీలకు భారీ స్థాయిలో సీట్లు పెంచాలన్న నిర్ణయం సరైందేనా అన్న ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దేశంలో 140 కోట్ల జనాభాకు అనుగుణంగా 273 పార్లమెంట్ స్థానాలను పెంచుతున్నట్టు కేంద్రం చెబుతోంది. అలాగే అసెంబ్లీల్లో కూడా ప్రస్తుతం ఉన్న స్థానాలకు అదనంగా 2062 సీట్లు పెరగనున్నాయి. దీంతో ప్రజాప్రతినిధుల సంఖ్య పెరిగి ప్రాతినిధ్యం మెరుగవుతుందనే అభిప్రాయం ఒకవైపు కనిపిస్తున్నా, అంత మంది నాయకులు ఎక్కడ నుంచి వస్తారన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

కొన్ని ప్లస్‌లు

ప్రజాప్రతినిధుల సంఖ్య పెరగడం వల్ల ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో మరింతగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. పాలనను ప్రజలకు దగ్గర చేయడంలో ఇది ఉపయోగపడుతుంది. అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా ముందుకు తీసుకెళ్లే అవకాశమూ ఉంటుంది.

రాజకీయాల్లోకి వచ్చే వారి సంఖ్య పెరుగుతుంది. దీంతో ప్రజలకు మెరుగైన నాయకులను ఎంపిక చేసుకునే అవకాశాలు విస్తరిస్తాయి.

ప్రత్యేకంగా యువతకు అవకాశాలు పెరుగుతాయి. కొత్త నాయకత్వానికి దారి తెరుచుకుంటుంది. ప్రత్యామ్నాయ రాజకీయాలకు కూడా అవకాశం ఉంటుంది. నాయకుల బాధ్యత కూడా పెరిగే అవకాశముంది.

అనేక మైనస్‌లు

సీట్లు పెరగడం వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం భారీగా పెరుగుతుంది. ప్రజాప్రతినిధులకు ఇచ్చే జీతాలు, సౌకర్యాలు, భద్రత వంటి అంశాలు ప్రభుత్వ ఖర్చును పెంచుతాయి.

నాయకుల సంఖ్య పెరిగినా ప్రభుత్వ ఆదాయం అంతగా పెరగదు. ఇప్పటికే ఉన్న ఎమ్మెల్యేల జీతాలు చెల్లించడంలో ఇబ్బంది పడుతున్న ప్రభుత్వాలకు ఇది మరింత భారంగా మారే అవకాశం ఉంది.

నాయకుల సంఖ్య పెరగడం కంటే వారి నాణ్యత కూడా ముఖ్యమే. సంఖ్య పెరిగితే పరిపక్వత తగ్గే ప్రమాదం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎక్కువ మంది ఉంటే నిర్ణయాలలో గందరగోళం పెరగవచ్చని కూడా అంటున్నారు.

సభలను విస్తరించాల్సి ఉంటుంది. కొత్త భవనాలు నిర్మించాల్సిన అవసరం ఉంటుంది. ఎమ్మెల్యేల పెన్షన్లు, ఇతర ఖర్చులు కూడా పెరిగి ఆర్థిక ఒత్తిడిని తీసుకురావచ్చు.

ప్రస్తుతం నియోజకవర్గాలకు సరిపడా నిధులు అందడం లేదు. కొత్తగా ఏర్పడే నియోజకవర్గాలకు కనీసం ఐదేళ్ల పాటు అభివృద్ధి కోసం నిధులు కేటాయించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వనరులు సరిపోతాయా అన్నది కీలక ప్రశ్నగా మారింది.

మొత్తంగా చూసుకుంటే సీట్లు పెరగడం ఒక పరంగా మంచిదే అయినా, అది అతిగా పెరిగితే లాభాల కంటే ఇబ్బందులే ఎక్కువగా ఉండే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు.

This post was last modified on March 24, 2026 1:52 pm

Share

Recent Posts

పిఠాపురం ఇకపై పవన్ కంచు కోట

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న పవన్…

22 minutes ago

రక్తంతో రాసుకున్న ‘ప్యారడైజ్’ శాసనం

న్యాచురల్ స్టార్ నాని, దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24 విడుదలకు రెడీ…

2 hours ago

డీఎస్సీపైనే వైసీపీకి ఎందుకంత మంకుపట్టు?

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు, ఒక్క ఉపాధ్యాయ నియామకాన్ని…

2 hours ago

కొత్త మార్పుల వైపు చరణ్ & సుకుమార్ ?

ఇంకా ప్రారంభం కాలేదు కానీ క్యాస్టింగ్ ముందే ఫైనల్ చేసుకోవాలి కాబట్టి ఆర్సి 17కి సంబంధించిన పనుల్లో సుకుమార్ టీమ్…

3 hours ago

నాగార్జున 100 గురించి ఎప్పుడు చెబుతారు

అక్కినేని నాగార్జున వందో సినిమా హడవిడి లేకుండా షూటింగ్ జరుపుకుంటోంది. మాములుగా ఏదో ఒక అప్డేట్ లీకుల రూపంలో కానీ…

4 hours ago

జార్ఖండ్ లో మరో సోనమ్ వాంగ్ చుక్ దీక్ష

దేశంలో ఎక్కడ చూసినా విద్యార్థి ఉద్యమాలు జరుగున్నాయి. ఢిల్లీ నుంచి మొదలుపెట్టుకొని ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్…

6 hours ago