అటు పార్లమెంట్, ఇటు అసెంబ్లీలకు భారీ స్థాయిలో సీట్లు పెంచాలన్న నిర్ణయం సరైందేనా అన్న ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దేశంలో 140 కోట్ల జనాభాకు అనుగుణంగా 273 పార్లమెంట్ స్థానాలను పెంచుతున్నట్టు కేంద్రం చెబుతోంది. అలాగే అసెంబ్లీల్లో కూడా ప్రస్తుతం ఉన్న స్థానాలకు అదనంగా 2062 సీట్లు పెరగనున్నాయి. దీంతో ప్రజాప్రతినిధుల సంఖ్య పెరిగి ప్రాతినిధ్యం మెరుగవుతుందనే అభిప్రాయం ఒకవైపు కనిపిస్తున్నా, అంత మంది నాయకులు ఎక్కడ నుంచి వస్తారన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
కొన్ని ప్లస్లు
ప్రజాప్రతినిధుల సంఖ్య పెరగడం వల్ల ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో మరింతగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. పాలనను ప్రజలకు దగ్గర చేయడంలో ఇది ఉపయోగపడుతుంది. అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా ముందుకు తీసుకెళ్లే అవకాశమూ ఉంటుంది.
రాజకీయాల్లోకి వచ్చే వారి సంఖ్య పెరుగుతుంది. దీంతో ప్రజలకు మెరుగైన నాయకులను ఎంపిక చేసుకునే అవకాశాలు విస్తరిస్తాయి.
ప్రత్యేకంగా యువతకు అవకాశాలు పెరుగుతాయి. కొత్త నాయకత్వానికి దారి తెరుచుకుంటుంది. ప్రత్యామ్నాయ రాజకీయాలకు కూడా అవకాశం ఉంటుంది. నాయకుల బాధ్యత కూడా పెరిగే అవకాశముంది.
అనేక మైనస్లు
సీట్లు పెరగడం వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం భారీగా పెరుగుతుంది. ప్రజాప్రతినిధులకు ఇచ్చే జీతాలు, సౌకర్యాలు, భద్రత వంటి అంశాలు ప్రభుత్వ ఖర్చును పెంచుతాయి.
నాయకుల సంఖ్య పెరిగినా ప్రభుత్వ ఆదాయం అంతగా పెరగదు. ఇప్పటికే ఉన్న ఎమ్మెల్యేల జీతాలు చెల్లించడంలో ఇబ్బంది పడుతున్న ప్రభుత్వాలకు ఇది మరింత భారంగా మారే అవకాశం ఉంది.
నాయకుల సంఖ్య పెరగడం కంటే వారి నాణ్యత కూడా ముఖ్యమే. సంఖ్య పెరిగితే పరిపక్వత తగ్గే ప్రమాదం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎక్కువ మంది ఉంటే నిర్ణయాలలో గందరగోళం పెరగవచ్చని కూడా అంటున్నారు.
సభలను విస్తరించాల్సి ఉంటుంది. కొత్త భవనాలు నిర్మించాల్సిన అవసరం ఉంటుంది. ఎమ్మెల్యేల పెన్షన్లు, ఇతర ఖర్చులు కూడా పెరిగి ఆర్థిక ఒత్తిడిని తీసుకురావచ్చు.
ప్రస్తుతం నియోజకవర్గాలకు సరిపడా నిధులు అందడం లేదు. కొత్తగా ఏర్పడే నియోజకవర్గాలకు కనీసం ఐదేళ్ల పాటు అభివృద్ధి కోసం నిధులు కేటాయించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వనరులు సరిపోతాయా అన్నది కీలక ప్రశ్నగా మారింది.
మొత్తంగా చూసుకుంటే సీట్లు పెరగడం ఒక పరంగా మంచిదే అయినా, అది అతిగా పెరిగితే లాభాల కంటే ఇబ్బందులే ఎక్కువగా ఉండే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు.
This post was last modified on March 24, 2026 1:52 pm
న్యూ ఢిల్లీ వేదికగా మార్చి 23, 24 తేదీల్లో ఘనంగా నిర్వహించిన TV9 నెట్వర్క్ ప్రతిష్టాత్మక ‘What India Thinks…
భారత దేశంలో కులం, మతం వంటి విషయాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. విద్య, ఉద్యోగం, సామాజిక హోదాలకు కులం, మతం…
రెండున్నర గంటలు ఇండియన్ సినిమాకు స్టాండర్డ్ రన్ టైమ్. కొన్ని సినిమాలకు దాని మీద నిడివి పావుగంట పెరగొచ్చు. కొన్ని చిత్రాలకు…
ఉగాది, రంజాన్ పండగలు లక్ష్యంగా వారం ప్రీ పోన్ చేసుకుని మరీ వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ ఫలితం కళ్ళముందు…
బాలీవుడ్ హీరోయిన్, చిరుత ఫేమ్ నేహా శర్మ సినిమాల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా, సోషల్ మీడియా ద్వారా సంపాదనలో మాత్రం…
2019 ఎన్నికల కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన తర్వాత, రెండు సంవత్సరాల గ్యాప్ అనంతరం మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పవర్…