అటు పార్లమెంట్, ఇటు అసెంబ్లీలకు భారీ స్థాయిలో సీట్లు పెంచాలన్న నిర్ణయం సరైందేనా అన్న ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దేశంలో 140 కోట్ల జనాభాకు అనుగుణంగా 273 పార్లమెంట్ స్థానాలను పెంచుతున్నట్టు కేంద్రం చెబుతోంది. అలాగే అసెంబ్లీల్లో కూడా ప్రస్తుతం ఉన్న స్థానాలకు అదనంగా 2062 సీట్లు పెరగనున్నాయి. దీంతో ప్రజాప్రతినిధుల సంఖ్య పెరిగి ప్రాతినిధ్యం మెరుగవుతుందనే అభిప్రాయం ఒకవైపు కనిపిస్తున్నా, అంత మంది నాయకులు ఎక్కడ నుంచి వస్తారన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
కొన్ని ప్లస్లు
ప్రజాప్రతినిధుల సంఖ్య పెరగడం వల్ల ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో మరింతగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. పాలనను ప్రజలకు దగ్గర చేయడంలో ఇది ఉపయోగపడుతుంది. అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా ముందుకు తీసుకెళ్లే అవకాశమూ ఉంటుంది.
రాజకీయాల్లోకి వచ్చే వారి సంఖ్య పెరుగుతుంది. దీంతో ప్రజలకు మెరుగైన నాయకులను ఎంపిక చేసుకునే అవకాశాలు విస్తరిస్తాయి.
ప్రత్యేకంగా యువతకు అవకాశాలు పెరుగుతాయి. కొత్త నాయకత్వానికి దారి తెరుచుకుంటుంది. ప్రత్యామ్నాయ రాజకీయాలకు కూడా అవకాశం ఉంటుంది. నాయకుల బాధ్యత కూడా పెరిగే అవకాశముంది.
అనేక మైనస్లు
సీట్లు పెరగడం వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం భారీగా పెరుగుతుంది. ప్రజాప్రతినిధులకు ఇచ్చే జీతాలు, సౌకర్యాలు, భద్రత వంటి అంశాలు ప్రభుత్వ ఖర్చును పెంచుతాయి.
నాయకుల సంఖ్య పెరిగినా ప్రభుత్వ ఆదాయం అంతగా పెరగదు. ఇప్పటికే ఉన్న ఎమ్మెల్యేల జీతాలు చెల్లించడంలో ఇబ్బంది పడుతున్న ప్రభుత్వాలకు ఇది మరింత భారంగా మారే అవకాశం ఉంది.
నాయకుల సంఖ్య పెరగడం కంటే వారి నాణ్యత కూడా ముఖ్యమే. సంఖ్య పెరిగితే పరిపక్వత తగ్గే ప్రమాదం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎక్కువ మంది ఉంటే నిర్ణయాలలో గందరగోళం పెరగవచ్చని కూడా అంటున్నారు.
సభలను విస్తరించాల్సి ఉంటుంది. కొత్త భవనాలు నిర్మించాల్సిన అవసరం ఉంటుంది. ఎమ్మెల్యేల పెన్షన్లు, ఇతర ఖర్చులు కూడా పెరిగి ఆర్థిక ఒత్తిడిని తీసుకురావచ్చు.
ప్రస్తుతం నియోజకవర్గాలకు సరిపడా నిధులు అందడం లేదు. కొత్తగా ఏర్పడే నియోజకవర్గాలకు కనీసం ఐదేళ్ల పాటు అభివృద్ధి కోసం నిధులు కేటాయించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వనరులు సరిపోతాయా అన్నది కీలక ప్రశ్నగా మారింది.
మొత్తంగా చూసుకుంటే సీట్లు పెరగడం ఒక పరంగా మంచిదే అయినా, అది అతిగా పెరిగితే లాభాల కంటే ఇబ్బందులే ఎక్కువగా ఉండే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు.
This post was last modified on March 24, 2026 1:52 pm
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళ భాషలో మాట్లాడి అక్కడి ప్రజలను ఆకట్టుకున్నారు. కోయంబత్తూరులో…
ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ కు ఒక అలవాటు ఉంది.. అదే 'స్లో స్టార్ట్ అండ్ డెడ్లీ ఫినిష్'. ఈ…
నాని ప్యారడైజ్ మీద అంచనాల గురించి ప్రత్యేకంగా మళ్ళీ చెప్పనక్కర్లేదు. ఆగస్ట్ 21 విడుదల కోసం అభిమానులే కాదు మూవీ…
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ తో 40 ఏళ్ల బంధాన్ని వీడి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరిన సీనియర్…
ఒక డిజాస్టర్ పడితే చాలు దర్శకుడి ట్రాక్ రికార్డు గతంలో ఎంత ఉందనేది నిర్మాతలు పట్టించుకోరు. అందులోనూ వెటరన్ డైరెక్టర్స్…
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఏపీ సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్ గా…