తన మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్ పుట్టిన రోజును పురస్కరించుకుని సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు.. శనివారం ఉదయమే తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం.. శ్రీవారి ప్రసాదాన్ని రుచి చూశారు. ఆ తర్వాత.. ఫ్యామిలీ అంతా గెస్ట్ హౌస్కు వెళ్లిపోగా.. సీఎం చంద్రబాబు సహా తిరుమల బోర్డు చైర్మన్ నాయుడు, అధికారులతో కలిసి.. ఆయన క్యూలైన్లను పర్యవేక్షించేందుకు వెళ్లారు.
ఈ సందర్భంగా తిరుమల మాడ వీధుల్లో దర్శనం ముగించుకుని బయటకు వచ్చిన భక్తులతో చంద్రబాబు మాట్లాడారు. “ఏమ్మా తిరమల లడ్డూ తిన్నావా.. ఎలా ఉంది?“ అంటూ.. పలువురు మహిళలను ప్రశ్నించారు. దీనికి వారు సంతోషం వ్యక్తం చేశారు. చాలా బాగుందని, నాణ్యంగా ఉందని సమాధానం ఇచ్చారు. అంతేకాదు.. గతంతో పోలిస్తే.. ఇప్పుడు నాణ్యత చాలా బాగుందని రెగ్యులర్ భక్తులు కొందరు చెప్పారు. అనంతరం.. అన్నదాన సత్రాన్ని కూడా చంద్రబాబు పరిశీలించారు.
అయితే.. భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వారికి వెయిటింగ్ సమయాన్ని తగ్గించాలని చంద్రబాబు సూచించారు. తక్కువ సమయంలో ఎక్కువ మంది శ్రీవారిని దర్శించుకునేలా కృత్రిమ మేధను విని యోగించుకోవాలని సూచించారు. టెక్నాలజీని వినియోగించుకుని.. క్యూ లైన్ల నిర్వహణను క్రమబద్ధీకరిం చాలని తెలిపారు. అదేవిధంగా భద్రతకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాలని.. అన్యమత ధోరణులకు అవకాశం ఇవ్వరాదని కూడా అధికారులకు తేల్చి చెప్పారు.
This post was last modified on March 21, 2026 9:27 pm
న్యాచురల్ స్టార్ నాని, దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24 విడుదలకు రెడీ…
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు, ఒక్క ఉపాధ్యాయ నియామకాన్ని…
ఇంకా ప్రారంభం కాలేదు కానీ క్యాస్టింగ్ ముందే ఫైనల్ చేసుకోవాలి కాబట్టి ఆర్సి 17కి సంబంధించిన పనుల్లో సుకుమార్ టీమ్…
అక్కినేని నాగార్జున వందో సినిమా హడవిడి లేకుండా షూటింగ్ జరుపుకుంటోంది. మాములుగా ఏదో ఒక అప్డేట్ లీకుల రూపంలో కానీ…
దేశంలో ఎక్కడ చూసినా విద్యార్థి ఉద్యమాలు జరుగున్నాయి. ఢిల్లీ నుంచి మొదలుపెట్టుకొని ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్…
హైదరాబాద్కు చెందిన 33 ఏళ్ల ఛార్టర్డ్ అకౌంటెంట్ సిద్దిపేటలోని ఒక హోటల్ గదిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది.…