గబ్బర్ సింగ్ కాంబో కాబట్టి అదే స్థాయిలో మేజిక్ చేస్తుందని ఆశించిన అభిమానులకు ఉస్తాద్ భగత్ సింగ్ లో వాళ్ళు సంతోషపడేలా ఫ్యాన్ కంటెంట్ అయితే దొరికింది. కానీ సాధారణ ప్రేక్షకులకు నచ్చే అంశాలు తక్కువగా ఉండటంతో ఆశించిన పెద్ద స్థాయిలో బాక్సాఫీస్ రన్ లేదన్నది వాస్తవం. వీకెండ్ లో అనూహ్యమైన పికప్ అందుకుని మేజిక్ చేస్తుందనే ఆశతో బయ్యర్లు ఎదురు చూస్తున్నారు. కాకపోతే దురంధర్ ది రివెంజ్ రూపంలో పెద్ద స్పీడ్ బ్రేకర్ ఉంది.
దీని సంగతలా ఉంచితే పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమా దర్శకుడు సురేందర్ రెడ్డితో లాకైన సంగతి తెలిసిందే. ఇది కూడా మూడేళ్లుగా స్క్రిప్ట్ స్టేజిలో ఉంది. ఫైనల్ గా నిర్మాత రామ్ తాళ్ళూరికి రిలీఫ్ కలిగిస్తూ పవన్ డేట్స్ ఇచ్చారు. ఇంకా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడనేది చెప్పలేదు కానీ ప్రస్తుతం పవర్ స్టార్ మైంటైన్ చేస్తున్న లుక్, హెయిర్ స్టైల్ ఈ మూవీ కోసమేనని యూనిట్ టాక్. అయితే సురేందర్ రెడ్డి గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి.
కేవలం ఫ్యాన్ స్టఫ్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోలేం. బలమైన కథ ఉండాల్సిందే. మన శంకరవరప్రసాద్ గారులో అనిల్ రావిపూడి ఎంత వింటేజ్ చిరంజీవిని వాడుకున్నా ఎమోషన్, సెంటిమెంట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఫలితంగా చిరు పిల్లల ఎపిసోడ్ బాగా వర్కౌట్ అయ్యింది. ఓజిలో ఎలివేషన్లతో పాటు ప్రాపర్ గ్యాంగ్ స్టర్ స్టోరీని ప్రెజెంట్ చేయడం వల్లే సుజిత్ అంత పెద్ద హిట్టు ఇవ్వగలిగాడు. సో బేసిక్స్ అనేవి చాలా అవసరం.
ఎందుకు రిస్క్ అని సురేందర్ రెడ్డి కనక రొటీన్ ఎలిమెంట్స్ తో పవన్ ని చూపిస్తే ఇబ్బందవుతుంది. అసలే ఏజెంట్ డిజాస్టర్ ప్రభావం తన మీద గట్టిగా ఉంది. సైరా నరసింహారెడ్డిని అందరిని మెప్పించేలా తీర్చిదిద్దలేదనే కంప్లయింట్ కూడా ఉంది. ముందు ఈ ముద్ర తుడిచిపెట్టుకుపోయేలా ఒకప్పటి కిక్, రేసు గుర్రం నాటి ఫిలిం మేకర్ ని సురేందర్ రెడ్డి బయటికి తీయాలి. ఇప్పటికైతే కథ చాలా బాగా వచ్చిందని ఇన్ సైడ్ టాక్. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభమయ్యే సూచనలున్నాయి.
This post was last modified on March 21, 2026 7:32 pm
వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి.. తరచుగా కూటమి సర్కారు సహా.. పవన్ కల్యాణ్పై విమర్శలు గుప్పించే అంబటి రాంబాబు.. తాజాగా…
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి శనివారం సాయంత్రం సామాజిక మాధ్యమాల్లో ఒక్కసారిగా పెద్ద చర్చ మొదలైంది. ఉన్నట్లుండి…
తెలుగులో హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో ‘మసూద’…
మరో కొత్త రికార్డు బద్దలైపోయింది. మొన్నటి ఏడాది రిలీజైన పుష్ప 2 ది రైజ్ వసూళ్లను ఇప్పుడప్పుడే ఎవరూ క్రాస్…
దేశంలో సుదీర్ఘకాలంగా ఎలాంటి పెంపునకు గురి కాకుండా ఉండిపోయిన లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన తెర మీదకు రాగా... కాంగ్రెస్…
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏపీపై వరాల జల్లు కురిపించింది. శనివారం జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో సుదీర్ఘ…