గబ్బర్ సింగ్ కాంబో కాబట్టి అదే స్థాయిలో మేజిక్ చేస్తుందని ఆశించిన అభిమానులకు ఉస్తాద్ భగత్ సింగ్ లో వాళ్ళు సంతోషపడేలా ఫ్యాన్ కంటెంట్ అయితే దొరికింది. కానీ సాధారణ ప్రేక్షకులకు నచ్చే అంశాలు తక్కువగా ఉండటంతో ఆశించిన పెద్ద స్థాయిలో బాక్సాఫీస్ రన్ లేదన్నది వాస్తవం. వీకెండ్ లో అనూహ్యమైన పికప్ అందుకుని మేజిక్ చేస్తుందనే ఆశతో బయ్యర్లు ఎదురు చూస్తున్నారు. కాకపోతే దురంధర్ ది రివెంజ్ రూపంలో పెద్ద స్పీడ్ బ్రేకర్ ఉంది.
దీని సంగతలా ఉంచితే పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమా దర్శకుడు సురేందర్ రెడ్డితో లాకైన సంగతి తెలిసిందే. ఇది కూడా మూడేళ్లుగా స్క్రిప్ట్ స్టేజిలో ఉంది. ఫైనల్ గా నిర్మాత రామ్ తాళ్ళూరికి రిలీఫ్ కలిగిస్తూ పవన్ డేట్స్ ఇచ్చారు. ఇంకా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడనేది చెప్పలేదు కానీ ప్రస్తుతం పవర్ స్టార్ మైంటైన్ చేస్తున్న లుక్, హెయిర్ స్టైల్ ఈ మూవీ కోసమేనని యూనిట్ టాక్. అయితే సురేందర్ రెడ్డి గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి.
కేవలం ఫ్యాన్ స్టఫ్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోలేం. బలమైన కథ ఉండాల్సిందే. మన శంకరవరప్రసాద్ గారులో అనిల్ రావిపూడి ఎంత వింటేజ్ చిరంజీవిని వాడుకున్నా ఎమోషన్, సెంటిమెంట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఫలితంగా చిరు పిల్లల ఎపిసోడ్ బాగా వర్కౌట్ అయ్యింది. ఓజిలో ఎలివేషన్లతో పాటు ప్రాపర్ గ్యాంగ్ స్టర్ స్టోరీని ప్రెజెంట్ చేయడం వల్లే సుజిత్ అంత పెద్ద హిట్టు ఇవ్వగలిగాడు. సో బేసిక్స్ అనేవి చాలా అవసరం.
ఎందుకు రిస్క్ అని సురేందర్ రెడ్డి కనక రొటీన్ ఎలిమెంట్స్ తో పవన్ ని చూపిస్తే ఇబ్బందవుతుంది. అసలే ఏజెంట్ డిజాస్టర్ ప్రభావం తన మీద గట్టిగా ఉంది. సైరా నరసింహారెడ్డిని అందరిని మెప్పించేలా తీర్చిదిద్దలేదనే కంప్లయింట్ కూడా ఉంది. ముందు ఈ ముద్ర తుడిచిపెట్టుకుపోయేలా ఒకప్పటి కిక్, రేసు గుర్రం నాటి ఫిలిం మేకర్ ని సురేందర్ రెడ్డి బయటికి తీయాలి. ఇప్పటికైతే కథ చాలా బాగా వచ్చిందని ఇన్ సైడ్ టాక్. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభమయ్యే సూచనలున్నాయి.
అనుకున్నట్లే ఐపీఎల్ 2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మళ్ళీ కొట్టేసింది. ఆ జట్టుకు పోటీగా ఈ సీజన్…
మాములుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ల సమయంలో నిర్వాహకులు హీరోలతో పాటు దర్శక నిర్మాతల కటవుట్లు పెట్టడం కొత్త కాదు. అందరూ…
మొన్నటిదాకా టాప్ ప్రొడక్షన్ హౌస్ గా వెలిగిపోయిన యువి క్రియేషన్స్ ఇప్పుడు బయటికి చెప్పుకోలేని ఇబ్బందులతో సతమతమవుతోందట. చిన్న బడ్జెట్…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అధికారంలో ఉన్నప్పుడు.. రాష్ట్రంలో జరిగిన అనేక అక్రమాలపై ప్రస్తుత ప్రభుత్వం విచారణ చేస్తున్న…
వేసవిలో కీలకమైన నెలగా చెప్పుకునే మే అయిపోయింది. స్కూళ్ళు, కాలేజీలకు సెలవులు ఉండే ఈ ముఖ్యమైన సీజన్ టాలీవుడ్ వృథా…
ఉద్యోగ వ్యవస్థకు సంబంధించి పంజాబ్ లోని ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజా పాలనలో ఇకపై…