Political News

శ్రీవారి ఆలయానికి సాధారణ భక్తుడిలా.. చంద్రబాబు!

ఆయన ఏపీకి ముఖ్యమంత్రి. ఒక్కసారి కాదు, నాలుగోసారి రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారం తిరుమల శ్రీవారి ఆలయానికి ఆయన మహాద్వారం నుంచి లోపలికి ప్రవేశించేందుకు అవకాశం ఉంది. కానీ ఆయన సాధారణ భక్తుడిలా ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారిని దర్శించుకున్నారు.

తిరుపతి పర్యటనలో భాగంగా శనివారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు తన కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ప్రత్యేక ప్రవేశం ఉన్నా, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి నడుచుకుంటూ వెళ్లి వేంకటేశ్వర స్వామిని దర్శించారు.

సీఎం చంద్రబాబు మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా ఈ దర్శనం జరిగింది. ముఖ్యమంత్రి వెంట ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి లోకేష్, ఆయన సతీమణి నారా బ్రాహ్మణి కూడా ఉన్నారు.

శ్రీవారి దర్శనం అనంతరం అధికారులు స్వామివారి ప్రసాదాలను అందించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన కాంప్లెక్స్‌లో అన్న ప్రసాదం వడ్డించనున్నారు. ఒక్కరోజు అన్నదానానికి అవసరమైన రూ.44 లక్షల విరాళాన్ని ఇప్పటికే అందించారు.

ఇప్పటి వరకు 12 సార్లు ఎస్వీ అన్నదాన ట్రస్ట్‌కు ముఖ్యమంత్రి కుటుంబం విరాళాలు ఇవ్వడం విశేషం. దేవాన్ష్ పుట్టిన నాటి నుంచి ప్రతి ఏడాది ఈ విరాళం అందిస్తున్నారు.

సాఫీగా క్యూలైన్లు..

సాధారణంగా వీవీఐపీలు దర్శనానికి వస్తే భక్తుల క్యూలైన్లు నిలిపివేస్తారు. దీంతో సాధారణ భక్తులు ఇబ్బందులు పడతారు. కానీ ఈసారి సీఎం కుటుంబం దర్శనం చేసుకున్నప్పటికీ క్యూలైన్లు ఆపలేదు. ఒకవైపు సీఎం కుటుంబం దర్శనం చేసుకుంటుండగా మరోవైపు భక్తుల దర్శనం కూడా సాఫీగా కొనసాగింది.

This post was last modified on March 21, 2026 2:42 pm

Share

Recent Posts

కొత్త మార్పుల వైపు చరణ్ & సుకుమార్ ?

ఇంకా ప్రారంభం కాలేదు కానీ క్యాస్టింగ్ ముందే ఫైనల్ చేసుకోవాలి కాబట్టి ఆర్సి 17కి సంబంధించిన పనుల్లో సుకుమార్ టీమ్…

45 minutes ago

నాగార్జున 100 గురించి ఎప్పుడు చెబుతారు

అక్కినేని నాగార్జున వందో సినిమా హడవిడి లేకుండా షూటింగ్ జరుపుకుంటోంది. మాములుగా ఏదో ఒక అప్డేట్ లీకుల రూపంలో కానీ…

2 hours ago

జార్ఖండ్ లో మరో సోనమ్ వాంగ్ చుక్ దీక్ష

దేశంలో ఎక్కడ చూసినా విద్యార్థి ఉద్యమాలు జరుగున్నాయి. ఢిల్లీ నుంచి మొదలుపెట్టుకొని ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్…

4 hours ago

హీలియం సిలిండర్… సిఏ ఆత్మహత్య

హైదరాబాద్‌కు చెందిన 33 ఏళ్ల ఛార్టర్డ్ అకౌంటెంట్ సిద్దిపేటలోని ఒక హోటల్ గదిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది.…

4 hours ago

రాకాసి గాడ్జిల్లాని రామాయణ తొక్కగలదా

భారతదేశపు అత్యంత ఖరీదైన సినిమాగా చెప్పుకుంటున్న రామాయణ నవంబర్ 6 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇంగ్లీష్ ట్రైలర్ తో…

7 hours ago

ఇంట్రెస్టింగ్… అనుష్క వదులుకున్న KJQ

ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు ముందే రాసి పెట్టి ఉంటుందని చెప్పిన సామెత సినిమా రంగానికి కూడా వర్తిస్తుంది.…

8 hours ago