ఆయన ఏపీకి ముఖ్యమంత్రి. ఒక్కసారి కాదు, నాలుగోసారి రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారం తిరుమల శ్రీవారి ఆలయానికి ఆయన మహాద్వారం నుంచి లోపలికి ప్రవేశించేందుకు అవకాశం ఉంది. కానీ ఆయన సాధారణ భక్తుడిలా ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుపతి పర్యటనలో భాగంగా శనివారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు తన కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ప్రత్యేక ప్రవేశం ఉన్నా, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి నడుచుకుంటూ వెళ్లి వేంకటేశ్వర స్వామిని దర్శించారు.
సీఎం చంద్రబాబు మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా ఈ దర్శనం జరిగింది. ముఖ్యమంత్రి వెంట ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి లోకేష్, ఆయన సతీమణి నారా బ్రాహ్మణి కూడా ఉన్నారు.
శ్రీవారి దర్శనం అనంతరం అధికారులు స్వామివారి ప్రసాదాలను అందించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన కాంప్లెక్స్లో అన్న ప్రసాదం వడ్డించనున్నారు. ఒక్కరోజు అన్నదానానికి అవసరమైన రూ.44 లక్షల విరాళాన్ని ఇప్పటికే అందించారు.
ఇప్పటి వరకు 12 సార్లు ఎస్వీ అన్నదాన ట్రస్ట్కు ముఖ్యమంత్రి కుటుంబం విరాళాలు ఇవ్వడం విశేషం. దేవాన్ష్ పుట్టిన నాటి నుంచి ప్రతి ఏడాది ఈ విరాళం అందిస్తున్నారు.
సాఫీగా క్యూలైన్లు..
సాధారణంగా వీవీఐపీలు దర్శనానికి వస్తే భక్తుల క్యూలైన్లు నిలిపివేస్తారు. దీంతో సాధారణ భక్తులు ఇబ్బందులు పడతారు. కానీ ఈసారి సీఎం కుటుంబం దర్శనం చేసుకున్నప్పటికీ క్యూలైన్లు ఆపలేదు. ఒకవైపు సీఎం కుటుంబం దర్శనం చేసుకుంటుండగా మరోవైపు భక్తుల దర్శనం కూడా సాఫీగా కొనసాగింది.
వారణాసి విడుదల ఇంకో ఏడాది టైం ఉందని, పదే పదే మహేష్ బాబు రీ రిలీజులను క్యూ కట్టడం ఎంత…
అనుకున్నట్లే ఐపీఎల్ 2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మళ్ళీ కొట్టేసింది. ఆ జట్టుకు పోటీగా ఈ సీజన్…
మాములుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ల సమయంలో నిర్వాహకులు హీరోలతో పాటు దర్శక నిర్మాతల కటవుట్లు పెట్టడం కొత్త కాదు. అందరూ…
మొన్నటిదాకా టాప్ ప్రొడక్షన్ హౌస్ గా వెలిగిపోయిన యువి క్రియేషన్స్ ఇప్పుడు బయటికి చెప్పుకోలేని ఇబ్బందులతో సతమతమవుతోందట. చిన్న బడ్జెట్…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అధికారంలో ఉన్నప్పుడు.. రాష్ట్రంలో జరిగిన అనేక అక్రమాలపై ప్రస్తుత ప్రభుత్వం విచారణ చేస్తున్న…
వేసవిలో కీలకమైన నెలగా చెప్పుకునే మే అయిపోయింది. స్కూళ్ళు, కాలేజీలకు సెలవులు ఉండే ఈ ముఖ్యమైన సీజన్ టాలీవుడ్ వృథా…