Political News

పూజ గదిలో బొమ్మపై క్లారిటీ ఇచ్చిన లోకేష్

ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ తన పూజ గదిలో ఉన్న బొమ్మలపై సోషల్ మీడియాలో వస్తున్న సందేహాలకు స్పష్టత ఇచ్చారు. తన కుమారుడు దేవాంశ్ నారా చిన్ననాటి భక్తిని గుర్తుచేసుకుంటూ ఆయన భావోద్వేగ ట్వీట్ చేశారు.

పూజ గదిలో కనిపిస్తున్నవి శివుడు బొమ్మతో పాటు ఒక చిన్న శివలింగమని తెలిపారు. అవి తన కుమారుడు దేవాంశ్ నారా కేవలం నాలుగేళ్ల వయసులో స్వయంగా తయారు చేసినవని వెల్లడించారు. చిన్నప్పటి నుంచే అతనిలో భక్తి భావం పెంపొందిందని, ఆ మధుర జ్ఞాపకంగా వాటిని పూజ గదిలో ఉంచుకున్నామని చెప్పారు.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కొన్ని అపోహలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్న ఆయన, కొందరికి భక్తి అర్థమవుతుందని, మరికొందరికి అర్థం కాకపోవచ్చని వ్యాఖ్యానించారు. అయితే చిన్నారి భక్తి ఎంతో పవిత్రమైందని స్పష్టం చేశారు. లోకేష్ ఇచ్చిన ఈ వివరణతో అనవసర వివాదాలకు తెరపడినట్లు భావిస్తున్నారు.

నిన్న ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మంత్రి నారా లోకేష్ తన కుమారుడితో కలిసి ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త సంవత్సరంలో తీపి క్షణాలు ఎక్కువగా, చేదు అనుభవాలు తగ్గాలని ఆకాంక్షించారు.

పండుగ సందర్భంగా ప్రత్యేక వంటకాలను ఆస్వాదించేందుకు ఒక రోజు తన కఠిన ఆహార నియమాలను పక్కన పెట్టనున్నట్లు సరదాగా పేర్కొన్నారు. పండుగ సందర్భంగా ఆయన షేర్ చేసిన ఫోటోలో ఉన్న బొమ్మపై కొందరు అనుచిత వ్యాఖ్యలు చేయగా, వాటికి చెక్ పెడుతూ వెంటనే వివరణ ఇవ్వడం గమనార్హం.

This post was last modified on March 20, 2026 10:47 am

Share
Show comments
Published by
Kumar
Tags: Lokesh

Recent Posts

మీ వాళ్లకు చెప్పండి… ఏపీ సీఎంకి తెలంగాణ మంత్రి లేఖ

తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…

10 minutes ago

మోదీ స్కిన్ టోన్… అక్కడ తెలుపు.. ఇక్కడ నలుపా?

ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్‌పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…

13 minutes ago

టీవీ సౌండ్ హఠాత్తుగా ఆగిపోయిందే

మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…

43 minutes ago

ఎన్టీఆర్ నీల్… ఇంకో ఏడాది ఆలస్యంగా

అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…

1 hour ago

కొత్త ‘మహావతారం’పై విమర్శలేల?

గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…

2 hours ago

అన్నీ కారుణ్యాలే అయితే ప్రతిభావంతులు ఏం చెయ్యాలి?

రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…

4 hours ago