ఏపీ మాజీ సీఎం జగన్ కు రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం లేదా? ఏపీ యువతకు విశాఖలోనే దిగ్గజ కార్పొరేట్ కంపెనీలలో ఐటీ ఉద్యోగాలు రావడం జగన్ కు నచ్చడం లేదా? తన హయాంలో ఏపీకి రాని కంపెనీలు…చంద్రబాబును చూసి ఏపీకి క్యూ కట్టడం జగన్ జీర్ణించుకోలేకపోతున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ అవును అనే సమాధానం వస్తుంది. విశాఖలో గూగుల్ భారీ పెట్టుబడితో ఏర్పాటు చేయబోతున్న డేటా సెంటర్ ను అడ్డుకునేందుకు వైసీపీ అండ్ కో ప్రయత్నాలు మొదలుబెట్టింది.
ఈ డేటా సెంటర్ కు కూటమి ప్రభుత్వం స్థలం కేటాయించడాన్ని సవాల్ చేస్తూ వైసీపీ ఎంపీ గురుమూర్తి హైకోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అయితే, వేలాదిమంది యువతకు ఉద్యోగాలు కల్పించే సంస్థను అడ్డుకోవడంలో ప్రజా ప్రయోజనం ఏంటి అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఓ పక్క ప్రపంచ స్థాయి కంపెనీల నుంచి పెట్టుబడులు ఆకర్షించడంలో చంద్రబాబు, లోకేశ్ బిజీగా ఉంటే…వచ్చిన కంపెనీలను ఎలా అడ్డుకోవాలని వైసీపీ నేతలు ఆలోచించడం శోచనీయం.
ఈ నేపథ్యంలోనే జగన్ పై లోకేశ్ ఫైర్ అయ్యారు. మొదట అమరావతిని వ్యతిరేకించిన జగన్..ఇప్పుడు వైజాగ్ లో అభివృద్ధిని వ్యతిరేకిస్తున్నాడని లోకేశ్ మండిపడ్డారు. అమరావతిలో పవర్ కాంట్రాక్టులు రద్దు చేసిన జగన్…ఐటీ కంపెనీల రాకను అడ్డుకున్నారని లోకేశ్ ఆరోపించారు.
ఇప్పుడేమో దేశంలోనే అతిపెద్ద ఎఫ్ డీఐ అయిన గూగుల్ ఏఐ హబ్ ను అడ్డుకునేందుకు ఏకంగా హైకోర్టును ఆశ్రయించారని లోకేశ్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ యువత పట్ల, రాష్ట్రాభివృద్ధి పట్ల ఎందుకు అంత ద్వేషం జగన్ అని లోకేశ్ ప్రశ్నించారు. అయితే, జగన్ ఎన్ని కుట్రలు చేసినా ఏపీ అభివృద్ధిని అడ్డుకోలేరని, జగన్ కుట్రలను ఛేదించి రాష్ట్రాభివృద్ధిని కూటమి ప్రభుత్వం పరుగులు పెట్టిస్తుందని స్పష్టం చేశారు.
This post was last modified on March 11, 2026 10:51 pm
కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…
తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…
ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…
ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…
కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…