ఏపీ మాజీ సీఎం జగన్ కు రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం లేదా? ఏపీ యువతకు విశాఖలోనే దిగ్గజ కార్పొరేట్ కంపెనీలలో ఐటీ ఉద్యోగాలు రావడం జగన్ కు నచ్చడం లేదా? తన హయాంలో ఏపీకి రాని కంపెనీలు…చంద్రబాబును చూసి ఏపీకి క్యూ కట్టడం జగన్ జీర్ణించుకోలేకపోతున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ అవును అనే సమాధానం వస్తుంది. విశాఖలో గూగుల్ భారీ పెట్టుబడితో ఏర్పాటు చేయబోతున్న డేటా సెంటర్ ను అడ్డుకునేందుకు వైసీపీ అండ్ కో ప్రయత్నాలు మొదలుబెట్టింది.
ఈ డేటా సెంటర్ కు కూటమి ప్రభుత్వం స్థలం కేటాయించడాన్ని సవాల్ చేస్తూ వైసీపీ ఎంపీ గురుమూర్తి హైకోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అయితే, వేలాదిమంది యువతకు ఉద్యోగాలు కల్పించే సంస్థను అడ్డుకోవడంలో ప్రజా ప్రయోజనం ఏంటి అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఓ పక్క ప్రపంచ స్థాయి కంపెనీల నుంచి పెట్టుబడులు ఆకర్షించడంలో చంద్రబాబు, లోకేశ్ బిజీగా ఉంటే…వచ్చిన కంపెనీలను ఎలా అడ్డుకోవాలని వైసీపీ నేతలు ఆలోచించడం శోచనీయం.
ఈ నేపథ్యంలోనే జగన్ పై లోకేశ్ ఫైర్ అయ్యారు. మొదట అమరావతిని వ్యతిరేకించిన జగన్..ఇప్పుడు వైజాగ్ లో అభివృద్ధిని వ్యతిరేకిస్తున్నాడని లోకేశ్ మండిపడ్డారు. అమరావతిలో పవర్ కాంట్రాక్టులు రద్దు చేసిన జగన్…ఐటీ కంపెనీల రాకను అడ్డుకున్నారని లోకేశ్ ఆరోపించారు.
ఇప్పుడేమో దేశంలోనే అతిపెద్ద ఎఫ్ డీఐ అయిన గూగుల్ ఏఐ హబ్ ను అడ్డుకునేందుకు ఏకంగా హైకోర్టును ఆశ్రయించారని లోకేశ్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ యువత పట్ల, రాష్ట్రాభివృద్ధి పట్ల ఎందుకు అంత ద్వేషం జగన్ అని లోకేశ్ ప్రశ్నించారు. అయితే, జగన్ ఎన్ని కుట్రలు చేసినా ఏపీ అభివృద్ధిని అడ్డుకోలేరని, జగన్ కుట్రలను ఛేదించి రాష్ట్రాభివృద్ధిని కూటమి ప్రభుత్వం పరుగులు పెట్టిస్తుందని స్పష్టం చేశారు.
గత రెండు మాసాలకు పైగా ఇంధన, గ్యాస్ సమస్యలతో ప్రపంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గురవుతున్నాయి. చమురు ధరలు పెరిగిపోవడమే…
తెలంగాణపై మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో సోమవారం చేపట్టిన జాతీయ…
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బీజేపీని మరింత బలోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేతలు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పురోగతిపై సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ఆసక్తి కనబరిచారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి…
మాస్ మహారాజా రవితేజ లైనప్ అభిమానుల అంచనాలకు తగ్గట్టు చక్కగా కనిపిస్తోంది. వరస డిజాస్టర్ల సంగతి పక్కనపెడితే ఇరుముడి మీద…
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో నిర్వహించిన…