ఏపీ మాజీ సీఎం జగన్ కు రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం లేదా? ఏపీ యువతకు విశాఖలోనే దిగ్గజ కార్పొరేట్ కంపెనీలలో ఐటీ ఉద్యోగాలు రావడం జగన్ కు నచ్చడం లేదా? తన హయాంలో ఏపీకి రాని కంపెనీలు…చంద్రబాబును చూసి ఏపీకి క్యూ కట్టడం జగన్ జీర్ణించుకోలేకపోతున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ అవును అనే సమాధానం వస్తుంది. విశాఖలో గూగుల్ భారీ పెట్టుబడితో ఏర్పాటు చేయబోతున్న డేటా సెంటర్ ను అడ్డుకునేందుకు వైసీపీ అండ్ కో ప్రయత్నాలు మొదలుబెట్టింది.
ఈ డేటా సెంటర్ కు కూటమి ప్రభుత్వం స్థలం కేటాయించడాన్ని సవాల్ చేస్తూ వైసీపీ ఎంపీ గురుమూర్తి హైకోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అయితే, వేలాదిమంది యువతకు ఉద్యోగాలు కల్పించే సంస్థను అడ్డుకోవడంలో ప్రజా ప్రయోజనం ఏంటి అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఓ పక్క ప్రపంచ స్థాయి కంపెనీల నుంచి పెట్టుబడులు ఆకర్షించడంలో చంద్రబాబు, లోకేశ్ బిజీగా ఉంటే…వచ్చిన కంపెనీలను ఎలా అడ్డుకోవాలని వైసీపీ నేతలు ఆలోచించడం శోచనీయం.
ఈ నేపథ్యంలోనే జగన్ పై లోకేశ్ ఫైర్ అయ్యారు. మొదట అమరావతిని వ్యతిరేకించిన జగన్..ఇప్పుడు వైజాగ్ లో అభివృద్ధిని వ్యతిరేకిస్తున్నాడని లోకేశ్ మండిపడ్డారు. అమరావతిలో పవర్ కాంట్రాక్టులు రద్దు చేసిన జగన్…ఐటీ కంపెనీల రాకను అడ్డుకున్నారని లోకేశ్ ఆరోపించారు.
ఇప్పుడేమో దేశంలోనే అతిపెద్ద ఎఫ్ డీఐ అయిన గూగుల్ ఏఐ హబ్ ను అడ్డుకునేందుకు ఏకంగా హైకోర్టును ఆశ్రయించారని లోకేశ్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ యువత పట్ల, రాష్ట్రాభివృద్ధి పట్ల ఎందుకు అంత ద్వేషం జగన్ అని లోకేశ్ ప్రశ్నించారు. అయితే, జగన్ ఎన్ని కుట్రలు చేసినా ఏపీ అభివృద్ధిని అడ్డుకోలేరని, జగన్ కుట్రలను ఛేదించి రాష్ట్రాభివృద్ధిని కూటమి ప్రభుత్వం పరుగులు పెట్టిస్తుందని స్పష్టం చేశారు.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…