Political News

టికెట్ ఇచ్చినా పట్టించుకోలేదా?

తెలంగాణలో రెండు రాజ్య‌స‌భ స్థానాల‌కు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులు అభిషేక్ మ‌ను సింఘ్వీ, వేం న‌రేందర్ రెడ్డిలు.. ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. వాస్త‌వానికి ఈ నెల 16న ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. అయితే.. పోటీలో ఎవ‌రూ లేక‌పోవ‌డం.. ఉన్న రెండు సీట్ల‌కు ఇద్ద‌రే నామినేష‌న్ దాఖ‌లు చేయ‌డంతో రిట‌ర్నింగ్ అధికారి తాజాగా.. వారిని ఎన్నుకున్న‌ట్టు ధ్రువీక‌ర‌ణ ప‌త్రం ఇచ్చారు. సాయంత్రం 6 గంట‌ల స‌మ‌యంలో ఈ ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు అందుకున్నారు. దీంతో వారు లాంఛ‌నంగా ఎన్నికైన‌ట్టు అయింది.

అయితే..ఇక్క‌డే చిత్ర‌మైన విష‌యంచోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ నేత‌.. అభిషేక్ మ‌ను సింఘ్వీ తెలంగాణ నుంచి రెండో సారి రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. అయితే.. ఆయ‌న రిట‌ర్నింగ్ అధికారి నుంచి ధ్రువీక‌ర‌ణ ప‌త్రం అందుకున్న త‌ర్వాత‌.. వెనువెంట‌నే ఆయ‌న విమానం ఎక్కేశారు. ఈ చ‌ర్చ కాంగ్రెస్ నాయ‌కుల‌నే ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబుతో క‌లిసి వేం న‌రేందర్‌రెడ్డి, అభిషేక్ మ‌ను సింఘ్వీలు.. రిట‌ర్నింగ్ అధికారిని క‌లుసుకున్నారు. అనంత‌రం.. ఆయ‌న నుంచి ధ్రువీక‌ర‌ణ ప‌త్రం తీసుకున్న అభిషేక్‌.. త‌న‌కు ప‌ని ఉందంటూ… శంషాబాద్‌కు వెళ్లిపోయి.. విమానం ఎక్కేశారు.

వాస్త‌వానికి ఈ సంద‌ర్బంగా మీడియాతో మాట్లాడాల‌ని మంత్రి శ్రీధ‌ర్‌బాబు అభిషేక్‌కు సూచించారు. కానీ, ఆయ‌న ప‌ట్టించుకోలే దు. ఇక‌, వేం న‌రేందర్ రెడ్డి మాత్ర‌మే మీడియాతో సంభాషించారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఢిల్లీ వేదిక‌గా ప్ర‌య‌త్నాలు చేస్తా న‌న్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు.. ఇత‌ర‌త్రా ప‌థ‌కాల విష‌యాన్ని రాజ్య‌స‌భ వేదికగా ప్ర‌స్తావించ‌నున్న ట్టు చెప్పారు. త‌న‌కు ఈ అవ‌కాశం క‌ల్పించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, ముఖ్య‌మంత్రికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. కాగా.. అభిషేక్ మ‌ను సింఘ్వి వ్య‌వ‌హ‌రించిన తీరు అంద‌రినీ విస్మ‌యానికి గురి చేసింది.

This post was last modified on March 11, 2026 7:56 am

Share

Recent Posts

చెన్నై లవ్ స్టోరీకి లైన్ క్లియర్

సంక్రాంతి సినిమాల తర్వాత నాలుగైదు నెలల పాటు బాక్సాఫీస్ దగ్గర పెద్ద స్లంప్ చూసింది టాలీవుడ్. కానీ గత నెలలో…

33 minutes ago

బాలయ్యని మ్యాచ్ చేయడం ఈజీ కాదు

ఏదైనా రీమేక్ సినిమాకు వచ్చే అతి పెద్ద సమస్య పోలిక. ఒరిజినల్ కంటే మెరుగ్గా తీశారా, నటీనటుల్లో ఎవరు బాగా…

35 minutes ago

బండ్ల గణేష్‌కు అక్కడా షాకే

ప్రముఖ తెలుగు నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌‌కు సంబంధించిన ఆస్తి వివాదం ఇటీవల వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. గణేష్‌కు చెందిన…

38 minutes ago

లోకేష్ సహనానికి బాబు ప్రశంసల జల్లు

ఏపీ మంత్రి నారా లోకేష్‌పై సీఎం చంద్ర‌బాబు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. ఏక‌బిగిన ఏడున్న‌ర గంట‌ల పాటు నిల‌బ‌డి.. ప్ర‌జ‌ల‌కు…

2 hours ago

నాని మీద ఒత్తిడి పెరుగుతోంది

ఆగస్ట్ నుంచి తప్పుకున్నాక ది ప్యారడైజ్ కొత్త విడుదల తేదీ ఇప్పటిదాకా ప్రకటించలేదు. సెప్టెంబర్ 24 అని బలంగా ప్రచారం…

2 hours ago

మంగాపురంకు చిక్కు వచ్చేలా ఉందే

ఈ నెల 30 విడుదల కాబోతున్న శ్రీనివాస మంగాపురంకు ప్రమోషన్లు జోరుగా జరుగుతున్నాయి. అయితే గ్రౌండ్ లెవెల్ లో మాత్రం…

2 hours ago