Political News

టికెట్ ఇచ్చినా పట్టించుకోలేదా?

తెలంగాణలో రెండు రాజ్య‌స‌భ స్థానాల‌కు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులు అభిషేక్ మ‌ను సింఘ్వీ, వేం న‌రేందర్ రెడ్డిలు.. ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. వాస్త‌వానికి ఈ నెల 16న ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. అయితే.. పోటీలో ఎవ‌రూ లేక‌పోవ‌డం.. ఉన్న రెండు సీట్ల‌కు ఇద్ద‌రే నామినేష‌న్ దాఖ‌లు చేయ‌డంతో రిట‌ర్నింగ్ అధికారి తాజాగా.. వారిని ఎన్నుకున్న‌ట్టు ధ్రువీక‌ర‌ణ ప‌త్రం ఇచ్చారు. సాయంత్రం 6 గంట‌ల స‌మ‌యంలో ఈ ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు అందుకున్నారు. దీంతో వారు లాంఛ‌నంగా ఎన్నికైన‌ట్టు అయింది.

అయితే..ఇక్క‌డే చిత్ర‌మైన విష‌యంచోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ నేత‌.. అభిషేక్ మ‌ను సింఘ్వీ తెలంగాణ నుంచి రెండో సారి రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. అయితే.. ఆయ‌న రిట‌ర్నింగ్ అధికారి నుంచి ధ్రువీక‌ర‌ణ ప‌త్రం అందుకున్న త‌ర్వాత‌.. వెనువెంట‌నే ఆయ‌న విమానం ఎక్కేశారు. ఈ చ‌ర్చ కాంగ్రెస్ నాయ‌కుల‌నే ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబుతో క‌లిసి వేం న‌రేందర్‌రెడ్డి, అభిషేక్ మ‌ను సింఘ్వీలు.. రిట‌ర్నింగ్ అధికారిని క‌లుసుకున్నారు. అనంత‌రం.. ఆయ‌న నుంచి ధ్రువీక‌ర‌ణ ప‌త్రం తీసుకున్న అభిషేక్‌.. త‌న‌కు ప‌ని ఉందంటూ… శంషాబాద్‌కు వెళ్లిపోయి.. విమానం ఎక్కేశారు.

వాస్త‌వానికి ఈ సంద‌ర్బంగా మీడియాతో మాట్లాడాల‌ని మంత్రి శ్రీధ‌ర్‌బాబు అభిషేక్‌కు సూచించారు. కానీ, ఆయ‌న ప‌ట్టించుకోలే దు. ఇక‌, వేం న‌రేందర్ రెడ్డి మాత్ర‌మే మీడియాతో సంభాషించారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఢిల్లీ వేదిక‌గా ప్ర‌య‌త్నాలు చేస్తా న‌న్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు.. ఇత‌ర‌త్రా ప‌థ‌కాల విష‌యాన్ని రాజ్య‌స‌భ వేదికగా ప్ర‌స్తావించ‌నున్న ట్టు చెప్పారు. త‌న‌కు ఈ అవ‌కాశం క‌ల్పించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, ముఖ్య‌మంత్రికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. కాగా.. అభిషేక్ మ‌ను సింఘ్వి వ్య‌వ‌హ‌రించిన తీరు అంద‌రినీ విస్మ‌యానికి గురి చేసింది.

This post was last modified on March 11, 2026 7:56 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏపీలో హోటల్స్… ఇబ్బంది లేనట్టేనా?

వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని…

5 hours ago

ఏపీలో స్పెషల్ ఆఫీసర్ల పాలన.. ఎక్కడంటే!

రాష్ట్రంలోని పలు మున్సిపల్ సంస్థల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రానుంది. మున్సిపల్ కార్పొరేషన్లు,…

5 hours ago

డైరెక్ట‌ర్ హైప్ ఇస్తుంటే… నాగ్ ఫ్యాన్స్‌కు టెన్ష‌న్‌

టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున వ‌రుస‌గా త‌మిళ న‌టులు, టెక్నీషియ‌న్ల‌తో ప‌ని చేస్తున్నాడు. గ‌త ఏడాది ధ‌నుష్‌తో క‌లిసి…

8 hours ago

వార్ ఎఫెక్ట్: ఇక హైదరాబాద్ వంతు!

అక్కడెక్కడో ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికాలు యుద్దం చేసుకుంటే.. వారికి వేలాది కిలోమీటర్ల ఇవతల ఉన్న బెంగళూరులోని టిఫిన్ సెంటర్లు..…

9 hours ago

బ్యాండ్ మ్రోగిస్తున్న మేళం సరిపోవడం లేదా

నిర్మాత కోన వెంకట్ బ్యాండ్ మేళంని చాలా సీరియస్ గా తీసుకున్న వైనం ప్రమోషన్లలో కనిపిస్తోంది. కోర్ట్ జంట హర్ష్…

9 hours ago

రవితేజను అవమానించిన నిర్మాత ఎవరు?

సినీ రంగంలో ఎప్పుడు ఎవరి రాత మారుతుందో తెలియదు. నటులుగా చిన్న చిన్న పాత్రలు చేసిన వాళ్లు.. రైటర్లుగా, అసిస్టెంట్…

10 hours ago