థియేటర్లకు సరైన సినిమాలు వస్తే రావడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఎటొచ్చి వాళ్ళను కనీస స్థాయిలో మెప్పించే కంటెంట్ ఉన్నవి రిలీజ్ కావడం లేదు. కాస్త ఓకే టాక్ వచ్చిన మృత్యుంజయ్ లాంటివి కూడా ఫెయిల్యూర్ బాట పట్టడం ఊహించని షాక్. అంతకు ముందు వారం విడుదలైన కపుల్ ఫ్రెండ్లీకి సోషల్ మీడియా, రివ్యూల మద్దతు దొరికినా దాని ప్రభావం ఏ సెంటర్లకే పరిమితమయ్యింది. ఇప్పుడు కొత్త ఫ్రైడే వస్తోంది.
ఎలాగూ మార్చి 19 దురంధర్ ది రివెంజ్, ఉస్తాద్ భగత్ సింగ్ ఉన్నాయి కాబట్టి వారం రోజుల రన్ కోసం ఏం రిలీజ్ చేస్తాంలే అని నిర్మాతలు వెనుకడుగు వేశారు. బ్యాండ్ మేళం ఏకంగా మార్చి 26కి వెళ్ళిపోయింది. దీంతో థియేటర్లకు మళ్ళీ వెయిటింగ్ పీరియడ్ తప్పడం లేదు. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే కాంచన రీ రిలీజ్ షోలు పెరుగుతున్నాయి. చాలా చోట్ల మెయిన్ స్క్రీన్లు దీనికి ఇస్తున్నారు. దానికి తగ్గట్టే జనాలు కూడా బాగానే టికెట్లు కొంటున్నారు.
అంటే ఈ వారం గంగార్పణం అయిపోయినట్టే. షోలు క్యాన్సిల్ కావడం, జనాలు లేక థియేటర్లు మూసేయడం కొనసాగనుంది. మెయిన్ సెంటర్స్ లో ఏదోలా నెట్టుకొస్తున్నా, బిసి కేంద్రాల్లో మాత్రం పరిస్థితి దయనీయంగా ఉంది. తిరిగి పవన్ కళ్యాణ్, రణ్వీర్ సింగ్ వచ్చే దాకా ఈ సిచువేషన్ లో ఎలాంటి మార్పు ఉండే అవకాశం లేదు. నిజానికి చిన్న సినిమాలకు వన్ వీక్ రన్ అనేది మంచి ఆప్షన్. టాక్ బాగొస్తే అంత తక్కువ టైంలోనే బ్రేక్ ఈవెన్ అయిపోవచ్చు.
కానీ అలా కాదనుకుని డేట్లు వదిలేసుకోవడం వల్ల ఎవరికీ ప్రయోజనం కలగడం లేదు. కంటెంట్ బాగుంటే ఎలాగూ జనం వస్తారు. తర్వాత కాంపిటీషన్ వచ్చినా భయపడే అవసరం ఉండదు. లేదు సినిమా అంతంత మాత్రంగా ఉంటే ఇమేజ్ ఉన్న శ్రీవిష్ణుకైనా ఇబ్బందులు తప్పవని ఇటీవలే ఋజువయ్యింది. అతివృష్టి, అనావృష్టి లాగా నిర్మాతల మధ్య సఖ్యత లేకపోవడం పోటీ వాతావరణాన్ని సృష్టిస్తోంది. లేదంటే ఇలా శుక్రవారాలను వృథాగా పోనిస్తోంది.
This post was last modified on March 11, 2026 11:36 am
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్యాంపు కార్యాలయంపై శనివారం దాడి…