పార్టీ విధానాలకు, సిద్ధాంతాలకు అనుగుణంగా నాయకులు పనిచేయాలని.. ఎమ్మెల్యేలు-ఎంపీలు కలివిడిగా ఉండాలని సీఎం చంద్రబాబు టీడీపీ నాయకులకు సూచించారు. నంద్యాల జిల్లాలో పర్యటించిన చంద్రబాబు.. సోమవారం సాయంత్రం పార్టీ నాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ నాయకుల వ్యవహార తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. అదేసమయంలో కూటమి పార్టీల మధ్య సమన్వయం లేదని వస్తున్న నివేదికలను కూడా వారి ముందు ఉంచి.. ప్రశ్నించారు.
“ఇలా అయితే..ఊరుకునేది లేదు. ఖచ్చితంగా మీరైనా మారాలి. లేదా నేనైనా మారాలి. నేను మారడం అంటూ వస్తే.. మీరే ఇబ్బంది పడతారు.“ అని చంద్రబాబు నంద్యాల జిల్లాలోని రెండు నియోజకవర్గాల నేతలను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు. నియోజకవర్గాల్లో పనితీరుపైనా తాను సమీక్షలు చేస్తున్నానన్నారు. కొందరు ఎమ్మెల్యేలు సొంత పార్టీనాయకులతోనే గొడవలు పడుతున్నారని.. ఇది పార్టీకి మేలు చేయదని వ్యాఖ్యానించారు. మరికొందరు మాత్రం బాగానే పనిచేస్తున్నట్టు చెప్పారు. వారిని తాను అభినందిస్తున్నానన్నారు.
ప్రధానంగా సమస్యలు ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావాలని చంద్రబాబు సూచించారు. ఎవరికి వారు పెత్తనం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని ఓ మహిళా నాయకురాలిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. “కుటుంబ తగాదాలను మీరు మీరు చూసుకోవాలి. పార్టీకి ఏం సంబంధం?“ అని ప్రశ్నించారు. అంతేకాదు.. వ్యక్తిగత అంశాలపై రాజకీయాలు చేయడం తగదన్నారు. మంత్రులతో కలివిడిగా ఉండాలని సూచించారు. అందరూ కలిసి క్షేత్రస్థాయిలో పనులు చేయాలని.. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల మధ్యకు తీసుకువెళ్లాలన్నారు.
ఇక, కూటమి పార్టీల కలివిడి అత్యంత కీలకమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఎవరు తప్పులు చేసినా.. సహించేది లేదన్నారు. ప్రస్తుతం నెలకొన్న సమస్యలను పరిష్కరించుకుని.. ఉమ్మడిగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. లేకపోతే.. వ్యక్తులు నష్టపోవడం తప్ప.. పార్టీలకు ఎలాంటి నష్టం రాదన్నారు. “మీరుమారకపోతే.. నేనే మార్చేయాల్సిన పరిస్థితి వస్తుంది“ అని వ్యాఖ్యానించారు. నంద్యాల జిల్లాలో ఒకటి రెండు నియోజకవర్గాలు మినహా.. ఇతర నియోజకవర్గాల్లో ఇబ్బందులను నాయకులు సమన్వయం చేసుకుని పరిష్కరించుకోవాలని చంద్రబాబు తేల్చి చెప్పారు.
This post was last modified on March 10, 2026 11:19 am
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ నాయకులు అదే అక్కసు ప్రదర్శిస్తున్నారు. రాజధానిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. జగన్ ప్రతిపాదించిన…
కనుమూరి రఘురామకృష్ణరాజు... ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. లోక్ సభ సభ్యుడిగా, ఆ తర్వాత శాసనసభ్యుడిగా ఎన్నికైన రాజు..…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎట్టకేలకు ఫలితం…
వైసీపీ అధినేత జగన్ ఎప్పుడు బయటకు వచ్చినా భారీ ఎత్తున జన సమీకరణ ఉంటుంది. ఆయన వెనక యువత ఎక్కువగా…
తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటివరకు లేని వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని సృష్టించారు. దీనికి ప్రస్తుత మంత్రి నారా…
అనుకున్నదే అయింది. ‘పెద్ది’ సినిమా వాయిదా పడింది. ఈ విషయాన్ని ఈ రోజు అధికారికంగా ప్రకటించేశారు. ఐతే మార్చి నెలాఖరు…