పార్టీ విధానాలకు, సిద్ధాంతాలకు అనుగుణంగా నాయకులు పనిచేయాలని.. ఎమ్మెల్యేలు-ఎంపీలు కలివిడిగా ఉండాలని సీఎం చంద్రబాబు టీడీపీ నాయకులకు సూచించారు. నంద్యాల జిల్లాలో పర్యటించిన చంద్రబాబు.. సోమవారం సాయంత్రం పార్టీ నాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ నాయకుల వ్యవహార తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. అదేసమయంలో కూటమి పార్టీల మధ్య సమన్వయం లేదని వస్తున్న నివేదికలను కూడా వారి ముందు ఉంచి.. ప్రశ్నించారు.
“ఇలా అయితే..ఊరుకునేది లేదు. ఖచ్చితంగా మీరైనా మారాలి. లేదా నేనైనా మారాలి. నేను మారడం అంటూ వస్తే.. మీరే ఇబ్బంది పడతారు.“ అని చంద్రబాబు నంద్యాల జిల్లాలోని రెండు నియోజకవర్గాల నేతలను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు. నియోజకవర్గాల్లో పనితీరుపైనా తాను సమీక్షలు చేస్తున్నానన్నారు. కొందరు ఎమ్మెల్యేలు సొంత పార్టీనాయకులతోనే గొడవలు పడుతున్నారని.. ఇది పార్టీకి మేలు చేయదని వ్యాఖ్యానించారు. మరికొందరు మాత్రం బాగానే పనిచేస్తున్నట్టు చెప్పారు. వారిని తాను అభినందిస్తున్నానన్నారు.
ప్రధానంగా సమస్యలు ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావాలని చంద్రబాబు సూచించారు. ఎవరికి వారు పెత్తనం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని ఓ మహిళా నాయకురాలిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. “కుటుంబ తగాదాలను మీరు మీరు చూసుకోవాలి. పార్టీకి ఏం సంబంధం?“ అని ప్రశ్నించారు. అంతేకాదు.. వ్యక్తిగత అంశాలపై రాజకీయాలు చేయడం తగదన్నారు. మంత్రులతో కలివిడిగా ఉండాలని సూచించారు. అందరూ కలిసి క్షేత్రస్థాయిలో పనులు చేయాలని.. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల మధ్యకు తీసుకువెళ్లాలన్నారు.
ఇక, కూటమి పార్టీల కలివిడి అత్యంత కీలకమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఎవరు తప్పులు చేసినా.. సహించేది లేదన్నారు. ప్రస్తుతం నెలకొన్న సమస్యలను పరిష్కరించుకుని.. ఉమ్మడిగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. లేకపోతే.. వ్యక్తులు నష్టపోవడం తప్ప.. పార్టీలకు ఎలాంటి నష్టం రాదన్నారు. “మీరుమారకపోతే.. నేనే మార్చేయాల్సిన పరిస్థితి వస్తుంది“ అని వ్యాఖ్యానించారు. నంద్యాల జిల్లాలో ఒకటి రెండు నియోజకవర్గాలు మినహా.. ఇతర నియోజకవర్గాల్లో ఇబ్బందులను నాయకులు సమన్వయం చేసుకుని పరిష్కరించుకోవాలని చంద్రబాబు తేల్చి చెప్పారు.
ఇటీవల సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ సృష్టించిన ప్రభంజనం అందరికీ తెలిసిందే. బొద్దింకల పార్టీగా ప్రారంభమై.. ఒక వైపు…
మెగా వేలంలో ఎవరూ కొనని ఒక ఆటగాడు, ఏకంగా ఒక ఫ్రాంచైజీ తలరాతనే మారుస్తాడని బహుశా ఎవరూ ఊహించి ఉండరు.…
వారణాసి విడుదల ఇంకో ఏడాది టైం ఉందని, పదే పదే మహేష్ బాబు రీ రిలీజులను క్యూ కట్టడం ఎంత…
అనుకున్నట్లే ఐపీఎల్ 2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మళ్ళీ కొట్టేసింది. ఆ జట్టుకు పోటీగా ఈ సీజన్…
మాములుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ల సమయంలో నిర్వాహకులు హీరోలతో పాటు దర్శక నిర్మాతల కటవుట్లు పెట్టడం కొత్త కాదు. అందరూ…
మొన్నటిదాకా టాప్ ప్రొడక్షన్ హౌస్ గా వెలిగిపోయిన యువి క్రియేషన్స్ ఇప్పుడు బయటికి చెప్పుకోలేని ఇబ్బందులతో సతమతమవుతోందట. చిన్న బడ్జెట్…