పార్టీ విధానాలకు, సిద్ధాంతాలకు అనుగుణంగా నాయకులు పనిచేయాలని.. ఎమ్మెల్యేలు-ఎంపీలు కలివిడిగా ఉండాలని సీఎం చంద్రబాబు టీడీపీ నాయకులకు సూచించారు. నంద్యాల జిల్లాలో పర్యటించిన చంద్రబాబు.. సోమవారం సాయంత్రం పార్టీ నాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ నాయకుల వ్యవహార తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. అదేసమయంలో కూటమి పార్టీల మధ్య సమన్వయం లేదని వస్తున్న నివేదికలను కూడా వారి ముందు ఉంచి.. ప్రశ్నించారు.
“ఇలా అయితే..ఊరుకునేది లేదు. ఖచ్చితంగా మీరైనా మారాలి. లేదా నేనైనా మారాలి. నేను మారడం అంటూ వస్తే.. మీరే ఇబ్బంది పడతారు.“ అని చంద్రబాబు నంద్యాల జిల్లాలోని రెండు నియోజకవర్గాల నేతలను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు. నియోజకవర్గాల్లో పనితీరుపైనా తాను సమీక్షలు చేస్తున్నానన్నారు. కొందరు ఎమ్మెల్యేలు సొంత పార్టీనాయకులతోనే గొడవలు పడుతున్నారని.. ఇది పార్టీకి మేలు చేయదని వ్యాఖ్యానించారు. మరికొందరు మాత్రం బాగానే పనిచేస్తున్నట్టు చెప్పారు. వారిని తాను అభినందిస్తున్నానన్నారు.
ప్రధానంగా సమస్యలు ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావాలని చంద్రబాబు సూచించారు. ఎవరికి వారు పెత్తనం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని ఓ మహిళా నాయకురాలిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. “కుటుంబ తగాదాలను మీరు మీరు చూసుకోవాలి. పార్టీకి ఏం సంబంధం?“ అని ప్రశ్నించారు. అంతేకాదు.. వ్యక్తిగత అంశాలపై రాజకీయాలు చేయడం తగదన్నారు. మంత్రులతో కలివిడిగా ఉండాలని సూచించారు. అందరూ కలిసి క్షేత్రస్థాయిలో పనులు చేయాలని.. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల మధ్యకు తీసుకువెళ్లాలన్నారు.
ఇక, కూటమి పార్టీల కలివిడి అత్యంత కీలకమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఎవరు తప్పులు చేసినా.. సహించేది లేదన్నారు. ప్రస్తుతం నెలకొన్న సమస్యలను పరిష్కరించుకుని.. ఉమ్మడిగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. లేకపోతే.. వ్యక్తులు నష్టపోవడం తప్ప.. పార్టీలకు ఎలాంటి నష్టం రాదన్నారు. “మీరుమారకపోతే.. నేనే మార్చేయాల్సిన పరిస్థితి వస్తుంది“ అని వ్యాఖ్యానించారు. నంద్యాల జిల్లాలో ఒకటి రెండు నియోజకవర్గాలు మినహా.. ఇతర నియోజకవర్గాల్లో ఇబ్బందులను నాయకులు సమన్వయం చేసుకుని పరిష్కరించుకోవాలని చంద్రబాబు తేల్చి చెప్పారు.
This post was last modified on March 10, 2026 11:19 am
ఈ నెల 18 పెద్ది ట్రైలర్ విడుదల కానుంది. ముందు భోపాల్ అనుకున్నారు కానీ ఇప్పుడు ఈవెంట్ వేదికని ముంబైకి…
సూర్య వీరభద్రుడు ఇంకో మూడు రోజుల్లో విడుదల కానుంది. తమిళనాడులో రాజకీయ వాతావరణం వల్ల రిలీజ్ చేయాలా వద్దాని రెండు…
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక కొన్ని రోజుల పాటు నడిచిన డ్రామాకు ఆదివారం తెరపడి, ఆదివారం నాడు తమిళ…
తెలుగులో ఒకప్పట్లా ఇబ్బడిముబ్బడిగా కమెడియన్లు లేరిప్పుడు. ఉన్న వాళ్లలో కూడా నిలకడగా నవ్వించేవాళ్లు తక్కువ. కొంచెం లేటుగా ఊపందుకుని.. వెన్నెల…
కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే, కేసు…
మొత్తం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో 40 ప్లస్ వయసులోనూ ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా, పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్న…