పార్టీ విధానాలకు, సిద్ధాంతాలకు అనుగుణంగా నాయకులు పనిచేయాలని.. ఎమ్మెల్యేలు-ఎంపీలు కలివిడిగా ఉండాలని సీఎం చంద్రబాబు టీడీపీ నాయకులకు సూచించారు. నంద్యాల జిల్లాలో పర్యటించిన చంద్రబాబు.. సోమవారం సాయంత్రం పార్టీ నాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ నాయకుల వ్యవహార తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. అదేసమయంలో కూటమి పార్టీల మధ్య సమన్వయం లేదని వస్తున్న నివేదికలను కూడా వారి ముందు ఉంచి.. ప్రశ్నించారు.
“ఇలా అయితే..ఊరుకునేది లేదు. ఖచ్చితంగా మీరైనా మారాలి. లేదా నేనైనా మారాలి. నేను మారడం అంటూ వస్తే.. మీరే ఇబ్బంది పడతారు.“ అని చంద్రబాబు నంద్యాల జిల్లాలోని రెండు నియోజకవర్గాల నేతలను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు. నియోజకవర్గాల్లో పనితీరుపైనా తాను సమీక్షలు చేస్తున్నానన్నారు. కొందరు ఎమ్మెల్యేలు సొంత పార్టీనాయకులతోనే గొడవలు పడుతున్నారని.. ఇది పార్టీకి మేలు చేయదని వ్యాఖ్యానించారు. మరికొందరు మాత్రం బాగానే పనిచేస్తున్నట్టు చెప్పారు. వారిని తాను అభినందిస్తున్నానన్నారు.
ప్రధానంగా సమస్యలు ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావాలని చంద్రబాబు సూచించారు. ఎవరికి వారు పెత్తనం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని ఓ మహిళా నాయకురాలిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. “కుటుంబ తగాదాలను మీరు మీరు చూసుకోవాలి. పార్టీకి ఏం సంబంధం?“ అని ప్రశ్నించారు. అంతేకాదు.. వ్యక్తిగత అంశాలపై రాజకీయాలు చేయడం తగదన్నారు. మంత్రులతో కలివిడిగా ఉండాలని సూచించారు. అందరూ కలిసి క్షేత్రస్థాయిలో పనులు చేయాలని.. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల మధ్యకు తీసుకువెళ్లాలన్నారు.
ఇక, కూటమి పార్టీల కలివిడి అత్యంత కీలకమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఎవరు తప్పులు చేసినా.. సహించేది లేదన్నారు. ప్రస్తుతం నెలకొన్న సమస్యలను పరిష్కరించుకుని.. ఉమ్మడిగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. లేకపోతే.. వ్యక్తులు నష్టపోవడం తప్ప.. పార్టీలకు ఎలాంటి నష్టం రాదన్నారు. “మీరుమారకపోతే.. నేనే మార్చేయాల్సిన పరిస్థితి వస్తుంది“ అని వ్యాఖ్యానించారు. నంద్యాల జిల్లాలో ఒకటి రెండు నియోజకవర్గాలు మినహా.. ఇతర నియోజకవర్గాల్లో ఇబ్బందులను నాయకులు సమన్వయం చేసుకుని పరిష్కరించుకోవాలని చంద్రబాబు తేల్చి చెప్పారు.
This post was last modified on March 10, 2026 11:19 am
https://www.youtube.com/watch?v=ddmpaI3WTvc
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కౌంట్ డౌన్ వేగంగా జరిగిపోతోంది. మార్చి 26 రావాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ హఠాత్తుగా మార్చి…
టాలీవుడ్ మోస్ట్ క్రేజీ మూవీస్ లో ఒకటిగా నిర్మాణంలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ ప్యాన్ ప్యాన్…
విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో పీజీ వైద్య విద్యార్థిని బత్తుల దీపిక ఆత్మహత్య కేసులో కీలక మలుపు తిరిగింది.…
ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న జనసేన పార్టీ.. ఈ ఏడాది పార్టీ సభ్యత్వాన్ని గత నెలలోనే ప్రారంభించిన…
సోషల్ మీడియాలో ఎప్పుడేం జరుగుతుందో.. దేనికి మురిసిపోతారో? ఏ విషయానికి ఆగ్రహానికి గురవుతారో అంచనా వేయటం అంత తేలికైన విషయం…