Political News

వైసీపీ ఎమ్మెల్యేలపై యాక్షన్ ఎలా ఉంటుందంటే..

వైసీపీ ఎమ్మెల్యేల వ్యవహారంపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మరోసారి స్పందించారు. ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాలకు వారు హాజరు కాకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన వారు ఇంట్లోనే కూర్చుంటామంటే ప్రజలు కూడా వారిని శాశ్వతంగా ఇంట్లోనే కూర్చోబెట్టే రోజులు వస్తాయని విమర్శించారు. సభకు రావాలని తామంతా కోరుతున్నామని చెప్పారు.

“ప్రధాన ప్రతిపక్షం అనేది ప్రజలు ఇవ్వాలి. జగన్‌కు అవసరమైతే ప్రజలను వెళ్లి అడగమండి. అంతేకాని ప్రధాన ప్రతిపక్షం ఇవ్వలేదని ప్రజల తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలు సభకు రాకుండా మొండి చేస్తే మంచిదా?” అని అయ్యన్న ప్రశ్నించారు. ఇలాంటివారు సభకు ఎందుకు కొరగారని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. సభకు రాకుండా జీతాలు తీసుకునేవారికి, అసలు సభకు రాకుండా ఉండేవారిపైనా చర్యలు తీసుకునేది ఖాయమని చెప్పారు.

ఈ క్రమంలో త్వరలోనే వైసీపీ సభ్యులకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకుంటామని అన్నారు. అయితే దీనికి కొంత సమయం పడుతుందని తెలిపారు. వైసీపీ సభ్యులపై అనర్హత వేటు ఖాయమని చెప్పారు. ఈ చర్యలు దేశానికే రోల్ మోడల్‌గా మారుతాయని అన్నారు.

ఇకపై దేశంలోని ఏ అసెంబ్లీలో అయినా సభ్యులు గైర్హాజరై వేతనాలు తీసుకుంటే తాము తీసుకున్న చర్యలే తీసుకునేలా వ్యవహరిస్తామని తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చినట్టు చెప్పారు.

ఇక గవర్నర్ ప్రసంగించిన రోజు సభకు వచ్చినా అది సభకు హాజరైనట్టు కాదని అయ్యన్న తెలిపారు. అది కేవలం లాంఛనప్రాయంగా సభకు రావడమేనని చెప్పారు. ఆ తర్వాత రోజు నుంచే అసెంబ్లీ లెక్కలోకి వస్తుందని అన్నారు.

నిబంధనలను కాదని వైసీపీ చేసే వాదనలకు అర్థం లేదన్నారు. తాము నిబంధనల ప్రకారం నడుచుకుంటున్నామని వివరించారు. ప్రతి విషయంలోనూ వితండ వాదన చేయడం వైసీపీకి పరిపాటిగా మారిందని, ఈ వ్యవహారం శాసన మండలిలో స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు.

This post was last modified on March 5, 2026 5:06 pm

Share

Recent Posts

పోలీస్ దుస్తుల్లో సూర్య షాకింగ్ ట్విస్టు

కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…

34 seconds ago

రవితేజ విజయాలకు ‘గట్టిముడి’ పడాలి

ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…

30 minutes ago

పోటీకి సిద్ధంకండి… పొత్తు సంగతి నేను చూసుకుంటాను

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…

2 hours ago

తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…

3 hours ago

అప్పట్లో చిరు ఏడాదికి నాలుగు సినిమాలు చేసినా గొడవే

ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్‌ను పక్కన పెడితే.. అల్లు…

10 hours ago

దీపికా విషయంలో సందీప్ వంగానే కరెక్ట్

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…

11 hours ago