Political News

మండలి ఛైర్మన్ పై అవిశ్వాసం? సాధ్యమేనా?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన వైసీపీ సభ్యులు తమకు బలం ఉన్న శాసనమండలిలో మాత్రం హడావిడి చేస్తున్నారు. ఇక, రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న లడ్డూ అంశంపై చర్చ సందర్భంగా మండలి చైర్మన్ మోషేన్ రాజు, టీడీపీ ఎమ్మెల్సీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. వైసీపీ సభ్యులకు మోషేస్ రాజు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మంత్రులు, టీడీపీ సభ్యులు ఆరోపిస్తున్నారు. 

అయితే, తాను నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నానని మోషేస్ రాజు అంటున్నారు. మరోవైపు, వైసీపీ ఎమ్మెల్సీలు ఐదుగురు రాజీనామా చేసినా ఆ రాజీనామాలను మోషేస్ రాజు ఆమోదించలేదు. ఈ నేపథ్యంలోనే చైర్మన్‌ మోషేస్ రాజుపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ఆ ఐదుగురు ఎమ్మెల్సీలు రెడీ అయినట్లు తెలుస్తోంది.

మండలి ఛైర్మన్ మోషేస్ రాజు తీరుకు నిరసనగా ఆయనపై అవిశ్వాసం పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అవిశ్వాస తీర్మానం పెట్టడానికి అవసరమైన సంఖ్యాబలం ఉన్న నేపథ్యంలో ఆ దిశగా ఆ ఐదుగురు అడుగులు వేస్తున్నారట.

వైసీపీ నుంచి ఎమ్మెల్సీలుగా గెలిచిన పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్లి కల్యాణ చక్రవర్తి, మర్రి రాజశేఖర్, జయమంగళ వెంకటరమణ తదితరులు మోషేస్ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఒకవేళ అవిశ్వాసం పెడితే నెగ్గుతుందా? వీగిపోతుందా? అన్నది తేలాల్సి ఉంది.

ఒకవేళ ఈ ఐదుగురు తీర్మానం పెట్టినా.. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీల సంఖ్యాబలం ఎక్కువ ఉండడంతో మండలి చైర్మన్ ను మార్చడం అంత తేలికమైన విషయం కాదనేది రాజకీయ విశ్లేషకుల మాట.

Kumar

Recent Posts

బాలకృష్ణ లైనప్ స్పష్టంగా ఉంది

సీనియర్లలో ఎక్కువ వేగంగా సినిమాలు చేస్తున్న హీరోల్లో మొదటి స్థానం బాలకృష్ణకే ఇవ్వాలి. ఎందుకంటే భోళాశంకర్ తర్వాత చిరంజీవి ఏకంగా…

2 minutes ago

ఈసారి పాదయాత్ర ఈజీ కాదేమో జగన్

ఇప్ప‌టి వ‌ర‌కు ఒక లెక్క‌.. ఇక నుంచి మరో లెక్క‌.. అన్న‌ట్టుగా వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ ప‌రిస్థితి…

49 minutes ago

పట్టు వదలకుండా పరిగెత్తాలి పెద్ది

పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…

1 hour ago

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

7 hours ago

కేంద్ర మంత్రుల ‘కార్ పూలింగ్’ షురూ!

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇందన పొదుపు దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశాక… మన…

7 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

8 hours ago