ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన వైసీపీ సభ్యులు తమకు బలం ఉన్న శాసనమండలిలో మాత్రం హడావిడి చేస్తున్నారు. ఇక, రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న లడ్డూ అంశంపై చర్చ సందర్భంగా మండలి చైర్మన్ మోషేన్ రాజు, టీడీపీ ఎమ్మెల్సీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. వైసీపీ సభ్యులకు మోషేస్ రాజు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మంత్రులు, టీడీపీ సభ్యులు ఆరోపిస్తున్నారు.
అయితే, తాను నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నానని మోషేస్ రాజు అంటున్నారు. మరోవైపు, వైసీపీ ఎమ్మెల్సీలు ఐదుగురు రాజీనామా చేసినా ఆ రాజీనామాలను మోషేస్ రాజు ఆమోదించలేదు. ఈ నేపథ్యంలోనే చైర్మన్ మోషేస్ రాజుపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ఆ ఐదుగురు ఎమ్మెల్సీలు రెడీ అయినట్లు తెలుస్తోంది.
మండలి ఛైర్మన్ మోషేస్ రాజు తీరుకు నిరసనగా ఆయనపై అవిశ్వాసం పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అవిశ్వాస తీర్మానం పెట్టడానికి అవసరమైన సంఖ్యాబలం ఉన్న నేపథ్యంలో ఆ దిశగా ఆ ఐదుగురు అడుగులు వేస్తున్నారట.
వైసీపీ నుంచి ఎమ్మెల్సీలుగా గెలిచిన పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్లి కల్యాణ చక్రవర్తి, మర్రి రాజశేఖర్, జయమంగళ వెంకటరమణ తదితరులు మోషేస్ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఒకవేళ అవిశ్వాసం పెడితే నెగ్గుతుందా? వీగిపోతుందా? అన్నది తేలాల్సి ఉంది.
ఒకవేళ ఈ ఐదుగురు తీర్మానం పెట్టినా.. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీల సంఖ్యాబలం ఎక్కువ ఉండడంతో మండలి చైర్మన్ ను మార్చడం అంత తేలికమైన విషయం కాదనేది రాజకీయ విశ్లేషకుల మాట.
This post was last modified on March 4, 2026 2:37 pm
తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా…
చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…
తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…
విజయనగరం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వసతులతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కార్యకలాపాలు ఆదివారం అర్ధరాత్రి…