ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన వైసీపీ సభ్యులు తమకు బలం ఉన్న శాసనమండలిలో మాత్రం హడావిడి చేస్తున్నారు. ఇక, రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న లడ్డూ అంశంపై చర్చ సందర్భంగా మండలి చైర్మన్ మోషేన్ రాజు, టీడీపీ ఎమ్మెల్సీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. వైసీపీ సభ్యులకు మోషేస్ రాజు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మంత్రులు, టీడీపీ సభ్యులు ఆరోపిస్తున్నారు.
అయితే, తాను నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నానని మోషేస్ రాజు అంటున్నారు. మరోవైపు, వైసీపీ ఎమ్మెల్సీలు ఐదుగురు రాజీనామా చేసినా ఆ రాజీనామాలను మోషేస్ రాజు ఆమోదించలేదు. ఈ నేపథ్యంలోనే చైర్మన్ మోషేస్ రాజుపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ఆ ఐదుగురు ఎమ్మెల్సీలు రెడీ అయినట్లు తెలుస్తోంది.
మండలి ఛైర్మన్ మోషేస్ రాజు తీరుకు నిరసనగా ఆయనపై అవిశ్వాసం పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అవిశ్వాస తీర్మానం పెట్టడానికి అవసరమైన సంఖ్యాబలం ఉన్న నేపథ్యంలో ఆ దిశగా ఆ ఐదుగురు అడుగులు వేస్తున్నారట.
వైసీపీ నుంచి ఎమ్మెల్సీలుగా గెలిచిన పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్లి కల్యాణ చక్రవర్తి, మర్రి రాజశేఖర్, జయమంగళ వెంకటరమణ తదితరులు మోషేస్ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఒకవేళ అవిశ్వాసం పెడితే నెగ్గుతుందా? వీగిపోతుందా? అన్నది తేలాల్సి ఉంది.
ఒకవేళ ఈ ఐదుగురు తీర్మానం పెట్టినా.. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీల సంఖ్యాబలం ఎక్కువ ఉండడంతో మండలి చైర్మన్ ను మార్చడం అంత తేలికమైన విషయం కాదనేది రాజకీయ విశ్లేషకుల మాట.
This post was last modified on March 4, 2026 2:37 pm
ఏప్రిల్ 30 'పెద్ది' తప్పుకున్నాక అందరి దృష్టి ఆ స్లాట్ మీద పడింది. ఇది ముందే ఊహించిన 'గాయపడ్డ సింహం'…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. వాస్తవానికి ఇప్పటికే చాలా బిల్లులు పెండింగులో ఉండగా..…
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…