చట్ట సభలను చాలామంది ప్రజా ప్రతినిధులు ఎంతో పవిత్రంగా..దేవాలయాలుగా భావిస్తుంటారు. తమను ఎన్నుకున్న ప్రజల కోసం చట్టాలు చేసే ఈ సభలకు వన్నెతెచ్చేలా ప్రవర్తిస్తుంటారు. అయితే, మరికొందరు సభ్యులు మాత్రం కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరించి విమర్శల పాలవుతుంటారు. ఈ క్రమంలోనే శాసన సభ జరుగుతున్న సమయంలో ఫోన్ మాట్లాడుతున్న సభ్యులపై అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అసహనం వ్యక్తం చేశారు. రాజుగారు హౌస్ లో కూడా ఫోన్ మాట్లాడితే ఎలా సార్ అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.
సభలో వ్యవసాయ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు వరి సాగు గురించి మాట్లాడుతున్న సందర్భంగా అయ్యన్న ఈ కామెంట్స్ చేశారు. ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రసంగిస్తుండగా మరో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఫోన్ మాట్లాడుతున్న వీడియో వైరల్ అయింది. ఇక, సభలో కొందరు సభ్యులు ఫోన్ చూస్తున్నట్లుగా కూడా కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యాయి.
ఒకవేళ ఏదైనా అత్యవసరమైన కాల్ అయితే సభ నుంచి బయటకు వెళ్లి మాట్లాడాలని, సభలో ఫోన్ వాడకూడదని స్పీకర్ రఘురామ గతంలోనే సూచించారు. సభలో సభ్యులంతా తమ ఫోన్ లను సైలెంట్ మోడ్ లో పెట్టాలని సూచించారు. ఇక, కొందరు సభ్యులు సభలో సెల్ఫీలు, వీడియోలు కూడా తీసుకున్నట్లు ఆరోపణలు రావడం విమర్శలకు తావిచ్చింది.
This post was last modified on March 4, 2026 6:01 pm
సహజంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తారు. ముందు మాటలతో.. తర్వాత తమదైన లాఠీ శైలితోనూ…
ఒక ఊరు నుంచి మరో ఊరుకు జాతీయ రహదారి(హైవే)పై ప్రయాణించే సమయంలో టోల్ గేట్లు దాటడం తప్పనిసరి. ఈ టోల్…
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…