Political News

సిట్ అధికారులకు లంచమా?

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర‌రావుపై ఏపీ ఏసీబీ అధికారులు కేసు న‌మోదు చేశారు. ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్‌) అధికారుల‌కు ఆయ‌న లంచం ఇవ్వ‌బోయార‌న్న ఆరోప‌ణ‌ల‌పై అందిన ఫిర్యాదు మేర‌కు.. ఏపీ ఏసీబీ అధికారులు ఈ కేసు న‌మోదు చేసిన‌ట్టు తెలిసింది. మాజీ మంత్రితో పాటు ఆయ‌న కుమారుడు సునీల్ పైనా కేసు న‌మోదు చేసిన‌ట్టు పోలీసులు తెలిపారు.

ఎందుకు?

ఏపీలో వైసీపీ హ‌యాంలో మ‌ద్యం కుంభ‌కోణం జ‌రిగింద‌న్న ఆరోప‌ణ‌ల‌తో ప్ర‌స్తుత ప్ర‌భుత్వం ఈ కేసును ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని విచారిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ కేసులో కారుమూరి నాగేశ్వ‌ర‌రావు పేరు కూడా త‌ర‌చుగా వినిపిస్తోంది. ఆయ‌న ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని తాడేప‌ల్లి గూడెం నియోజ‌క‌వర్గం నుంచి 2019లో విజ‌యం ద‌క్కించుకున్నారు. జ‌గ‌న్ మంత్రి వ‌ర్గంలో మంత్రిగా కూడా ప‌నిచేశారు.

అప్ప‌ట్లో రైతుల‌ను ఆయ‌న `ఎర్రిప‌ప్ప‌` అని సంబోధించ‌డం.. పెను వివాదానికి దారితీసింది. దీనిని ఆయ‌న స‌మ‌ర్థించుకున్నారు కూడా.. ఎర్రిప‌ప్ప అంటే.. `బుజ్జి నాయ‌న‌` అని అర్థ‌మ‌ని స‌మ‌ర్థించుకునే ప్ర‌య‌త్నం చేశారు. దీనిపై అప్ప‌ట్లో సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ కు గుర‌య్యారు. ఇదిలావుంటే.. మ‌ద్యం కేసులో ర‌వాణా కాంట్రాక్టు వ్య‌వ‌హారంపై విచార‌ణ చేస్తున్న సిట్ అధికారులు కారుమూరిని విచారించే ప్ర‌య‌త్నం చేశారు.

అయితే.. ఆయ‌న సిట్ అదికారికి లంచం ఇచ్చి.. కేసు నుంచి బ‌య‌టప‌డేందుకు ప్ర‌య‌త్నించార‌న్న‌ది తాజాగా ఏసీబీ అధికారులు చెబుతున్న‌మాట‌. ఈ లంచం సొమ్మును.. త‌న కుమారుడి ద్వారా స‌ద‌రు అధికారికి ఇవ్వ‌చూపార‌ని తెలుస్తోంది. ఈ క్రమంలోనే  కారుమూరి నాగేశ్వరరావు తో పాటు ఆయన కుమారుడు సునీల్‌పైనా పోలీసులు కేసులు న‌మోదు చేశారు. “ఏపీ మద్యం  సిట్ కేసు నుంచి తమను తప్పించాలంటూ… సిట్ విచారణ అధికారికి లంచం ఇచ్చే ప్రయత్నం చేశారు“ అని పోలీసులు తెలిపారు.

This post was last modified on March 3, 2026 5:08 pm

Share

Recent Posts

డీలిమిటేషన్ బిల్లు లేన‌ట్టేనా?

దేశ‌వ్యాప్తంగా పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభించి .. మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌న్న కేంద్ర ప్ర‌భుత్వం ఆశ‌లు ప్ర‌స్తుత స‌మావేశాల్లో నెర‌వేరేలా క‌నిపించ‌డం…

28 minutes ago

అధికార పార్టీ ఎమ్మెల్యే కుమారుడి ప్రేమ్ కహాని

తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి…

1 hour ago

అల్లు అర్జున్ 23… అప్పుడే ఇన్ని ప్రచారాలా

ఇంకా రాకా షూటింగ్ పూర్తి కాలేదు. మూడు నెలలకు పైనే వర్కింగ్ డేస్ అవసరమవుతాయని అంటున్నారు. అందుకే విడుదల తేదీ…

2 hours ago

మరో రెండు ఎయిమ్స్ ఆసుపత్రుల కోసం జనసేన వినతి

రాష్ట్రంలో వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పరీక్షలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి…

2 hours ago

దర్శన్ కేసులో కీలక మలుపు

కన్నడ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన దర్శన్.. ఏ బాధలూ లేని జీవితాన్ని, బంగారం లాంటి జీవితాన్ని ఎలా…

2 hours ago

ఆగస్ట్ 7… ఓటిటిలో కంటెంట్ వర్షం

థియేటర్లలో రేపు నాలుగైదు సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రత్యేకంగా ఓటిటిలో వచ్చే కొత్త కంటెంట్ కోసం ఎదురు…

3 hours ago