వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై ఏపీ ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులకు ఆయన లంచం ఇవ్వబోయారన్న ఆరోపణలపై అందిన ఫిర్యాదు మేరకు.. ఏపీ ఏసీబీ అధికారులు ఈ కేసు నమోదు చేసినట్టు తెలిసింది. మాజీ మంత్రితో పాటు ఆయన కుమారుడు సునీల్ పైనా కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
ఎందుకు?
ఏపీలో వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందన్న ఆరోపణలతో ప్రస్తుత ప్రభుత్వం ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో కారుమూరి నాగేశ్వరరావు పేరు కూడా తరచుగా వినిపిస్తోంది. ఆయన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లి గూడెం నియోజకవర్గం నుంచి 2019లో విజయం దక్కించుకున్నారు. జగన్ మంత్రి వర్గంలో మంత్రిగా కూడా పనిచేశారు.
అప్పట్లో రైతులను ఆయన `ఎర్రిపప్ప` అని సంబోధించడం.. పెను వివాదానికి దారితీసింది. దీనిని ఆయన సమర్థించుకున్నారు కూడా.. ఎర్రిపప్ప అంటే.. `బుజ్జి నాయన` అని అర్థమని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. దీనిపై అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ కు గురయ్యారు. ఇదిలావుంటే.. మద్యం కేసులో రవాణా కాంట్రాక్టు వ్యవహారంపై విచారణ చేస్తున్న సిట్ అధికారులు కారుమూరిని విచారించే ప్రయత్నం చేశారు.
అయితే.. ఆయన సిట్ అదికారికి లంచం ఇచ్చి.. కేసు నుంచి బయటపడేందుకు ప్రయత్నించారన్నది తాజాగా ఏసీబీ అధికారులు చెబుతున్నమాట. ఈ లంచం సొమ్మును.. తన కుమారుడి ద్వారా సదరు అధికారికి ఇవ్వచూపారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కారుమూరి నాగేశ్వరరావు తో పాటు ఆయన కుమారుడు సునీల్పైనా పోలీసులు కేసులు నమోదు చేశారు. “ఏపీ మద్యం సిట్ కేసు నుంచి తమను తప్పించాలంటూ… సిట్ విచారణ అధికారికి లంచం ఇచ్చే ప్రయత్నం చేశారు“ అని పోలీసులు తెలిపారు.
This post was last modified on March 3, 2026 5:08 pm
టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్.. డెకాయిట్ సినిమా సక్సెస్ మీట్లో ఈ చిత్ర కథానాయిక మృణాల్ ఠాకూర్ను ఉద్దేశించిన…
మార్చి నుంచి ఆగస్టుకి విడుదల తేదీ వాయిదా వేసుకున్న నాని ది ప్యారడైజ్ ఖచ్చితంగా చెప్పిన డేట్ కి విడుదలవుతుందా…
జన నాయకుడు పైరసీని పూర్తి స్థాయిలో కాకపోయినా గరిష్ట స్థాయిలో కట్టడి చేయడంలో నిర్మాణ సంస్థ సక్సెస్ అయ్యింది. వీడియో…
అదేంటో కానీ.. ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి పలు కీలక విషయాలు సాధారణ రోజుల్లో ఎక్కడా గుర్తుకు ఉండవు... రావు. ఎన్నికల…
సీతారామం, హాయ్ నాన్న లాంటి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలు దక్కించుకున్న మృణాల్ ఠాగూర్ టాలీవుడ్ తొలి అడుగులు చాలా గొప్పగా…
జనాలను నవ్వించడం కోసం సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లిపోతే పరిణామాలు ఎలా ఉంటాయో మరోసారి రుజువైంది. పవన్ కళ్యాణ్, రామ్…