Political News

సిట్ అధికారులకు లంచమా?

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర‌రావుపై ఏపీ ఏసీబీ అధికారులు కేసు న‌మోదు చేశారు. ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్‌) అధికారుల‌కు ఆయ‌న లంచం ఇవ్వ‌బోయార‌న్న ఆరోప‌ణ‌ల‌పై అందిన ఫిర్యాదు మేర‌కు.. ఏపీ ఏసీబీ అధికారులు ఈ కేసు న‌మోదు చేసిన‌ట్టు తెలిసింది. మాజీ మంత్రితో పాటు ఆయ‌న కుమారుడు సునీల్ పైనా కేసు న‌మోదు చేసిన‌ట్టు పోలీసులు తెలిపారు.

ఎందుకు?

ఏపీలో వైసీపీ హ‌యాంలో మ‌ద్యం కుంభ‌కోణం జ‌రిగింద‌న్న ఆరోప‌ణ‌ల‌తో ప్ర‌స్తుత ప్ర‌భుత్వం ఈ కేసును ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని విచారిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ కేసులో కారుమూరి నాగేశ్వ‌ర‌రావు పేరు కూడా త‌ర‌చుగా వినిపిస్తోంది. ఆయ‌న ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని తాడేప‌ల్లి గూడెం నియోజ‌క‌వర్గం నుంచి 2019లో విజ‌యం ద‌క్కించుకున్నారు. జ‌గ‌న్ మంత్రి వ‌ర్గంలో మంత్రిగా కూడా ప‌నిచేశారు.

అప్ప‌ట్లో రైతుల‌ను ఆయ‌న `ఎర్రిప‌ప్ప‌` అని సంబోధించ‌డం.. పెను వివాదానికి దారితీసింది. దీనిని ఆయ‌న స‌మ‌ర్థించుకున్నారు కూడా.. ఎర్రిప‌ప్ప అంటే.. `బుజ్జి నాయ‌న‌` అని అర్థ‌మ‌ని స‌మ‌ర్థించుకునే ప్ర‌య‌త్నం చేశారు. దీనిపై అప్ప‌ట్లో సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ కు గుర‌య్యారు. ఇదిలావుంటే.. మ‌ద్యం కేసులో ర‌వాణా కాంట్రాక్టు వ్య‌వ‌హారంపై విచార‌ణ చేస్తున్న సిట్ అధికారులు కారుమూరిని విచారించే ప్ర‌య‌త్నం చేశారు.

అయితే.. ఆయ‌న సిట్ అదికారికి లంచం ఇచ్చి.. కేసు నుంచి బ‌య‌టప‌డేందుకు ప్ర‌య‌త్నించార‌న్న‌ది తాజాగా ఏసీబీ అధికారులు చెబుతున్న‌మాట‌. ఈ లంచం సొమ్మును.. త‌న కుమారుడి ద్వారా స‌ద‌రు అధికారికి ఇవ్వ‌చూపార‌ని తెలుస్తోంది. ఈ క్రమంలోనే  కారుమూరి నాగేశ్వరరావు తో పాటు ఆయన కుమారుడు సునీల్‌పైనా పోలీసులు కేసులు న‌మోదు చేశారు. “ఏపీ మద్యం  సిట్ కేసు నుంచి తమను తప్పించాలంటూ… సిట్ విచారణ అధికారికి లంచం ఇచ్చే ప్రయత్నం చేశారు“ అని పోలీసులు తెలిపారు.

This post was last modified on March 3, 2026 5:08 pm

Share

Recent Posts

దాయ్‌రాగా మారిన దిశా… బాగా లేటయ్యింది

ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…

29 minutes ago

షర్మిల కూతురి పెళ్ళికి జగన్ డుమ్మా ?

వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…

35 minutes ago

ప్యారడైజ్ పోటీ నుండి తప్పుకున్న కీర్తి సురేష్

ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…

2 hours ago

టార్గెట్ గ‌జ్వేల్‌.. కాంగ్రెస్ వ్యూహం ఇదీ!

గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట‌. అయితే.. ఇక్క‌డే పాగా వేయాల‌ని.. వ‌చ్చే…

2 hours ago

మొహమాట పడితే ఎలాగయ్యా సట్టపులి

తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…

3 hours ago

సిగ్మా సౌండ్ సరిపోతుందంటారా

అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…

9 hours ago