Political News

వాహ్ పవన్.. వన్య ప్రాణులకు అంబులెన్సులు

ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొని అటవీ శాఖకు అంబులెన్సులు, ప్రత్యేక వాహనాలను ప్రారంభించారు.

ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ చేపట్టిన ‘హనుమాన్’ ప్రాజెక్టు కింద మొత్తం 100 వాహనాలను కేటాయించారు. గాయపడిన వన్యప్రాణులను తక్షణం రక్షించేందుకు, మానవ, వన్యప్రాణి ఘర్షణలను తగ్గించేందుకు ఈ వాహనాలు ఉపయోగపడనున్నాయి.

ఈ అంబులెన్సుల్లో జంతువులను తరలించేందుకు హైడ్రాలిక్ లిఫ్టులు, అత్యవసర శస్త్రచికిత్స పరికరాలు, మందులు, రక్త పరీక్షల కోసం మైక్రోస్కోపులు, రెస్క్యూ గేర్ వంటి అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలోనే చికిత్స అందించే మొబైల్ వెటర్నరీ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి.

రాష్ట్రవ్యాప్తంగా 19 ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేసి ఈ వాహనాలతో అనుసంధానించారు. తిరుపతి, రాజంపేట తదితర కీలక కేంద్రాల్లో ప్రాథమికంగా సేవలు అందుబాటులోకి రానున్నాయి.

ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ హనుమాన్ ప్రాజెక్టు ద్వారా మానవ–వన్యప్రాణి సంఘర్షణను తగ్గించడం ప్రధాన లక్ష్యమన్నారు. వన్యప్రాణుల వల్ల రైతులకు కలిగే పంటనష్టం, ప్రజలకు కలిగే ప్రాణనష్టం తగ్గించడంలో ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు.

హనుమాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా ఘటనలు చోటుచేసుకున్న వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టడం, బాధితులకు తక్షణ పరిహారం అందించడం జరుగుతుందని వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వన్యప్రాణి దాడుల్లో గాయపడిన, మృతిచెందిన వారికి రూ.4 కోట్ల పరిహారం చెల్లించినట్లు వెల్లడించారు.

This post was last modified on March 3, 2026 12:23 pm

Share

Recent Posts

అల్లు అర్జున్ 23… అప్పుడే ఇన్ని ప్రచారాలా

ఇంకా రాకా షూటింగ్ పూర్తి కాలేదు. మూడు నెలలకు పైనే వర్కింగ్ డేస్ అవసరమవుతాయని అంటున్నారు. అందుకే విడుదల తేదీ…

7 minutes ago

మరో రెండు ఎయిమ్స్ ఆసుపత్రుల కోసం జనసేన వినతి

రాష్ట్రంలో వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పరీక్షలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి…

34 minutes ago

దర్శన్ కేసులో కీలక మలుపు

కన్నడ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన దర్శన్.. ఏ బాధలూ లేని జీవితాన్ని, బంగారం లాంటి జీవితాన్ని ఎలా…

1 hour ago

ఆగస్ట్ 7… ఓటిటిలో కంటెంట్ వర్షం

థియేటర్లలో రేపు నాలుగైదు సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రత్యేకంగా ఓటిటిలో వచ్చే కొత్త కంటెంట్ కోసం ఎదురు…

2 hours ago

వైసీపీ ‘జెన్ జీ’ కాదు… ‘గంజాయ్ జీ’

వైసీపీ అధినేత జ‌గ‌న్ వెనుక ఉండే కార్య‌క‌ర్త‌లు, యువ‌త అంతా `జెన్‌జీ` అంటూ వైసీపీ నేత‌లు ప్ర‌చారం చేస్తున్నారు. ముఖ్యంగా…

2 hours ago

టీమిండియా కొత్త చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?

బీసీసీఐలో ఇప్పుడు కీలక మార్పులు జరగబోతున్నాయా? అవుననే అంటున్నాయి క్రీడా వర్గాలు. టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవికి…

2 hours ago