Political News

వాహ్ పవన్.. వన్య ప్రాణులకు అంబులెన్సులు

ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొని అటవీ శాఖకు అంబులెన్సులు, ప్రత్యేక వాహనాలను ప్రారంభించారు.

ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ చేపట్టిన ‘హనుమాన్’ ప్రాజెక్టు కింద మొత్తం 100 వాహనాలను కేటాయించారు. గాయపడిన వన్యప్రాణులను తక్షణం రక్షించేందుకు, మానవ, వన్యప్రాణి ఘర్షణలను తగ్గించేందుకు ఈ వాహనాలు ఉపయోగపడనున్నాయి.

ఈ అంబులెన్సుల్లో జంతువులను తరలించేందుకు హైడ్రాలిక్ లిఫ్టులు, అత్యవసర శస్త్రచికిత్స పరికరాలు, మందులు, రక్త పరీక్షల కోసం మైక్రోస్కోపులు, రెస్క్యూ గేర్ వంటి అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలోనే చికిత్స అందించే మొబైల్ వెటర్నరీ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి.

రాష్ట్రవ్యాప్తంగా 19 ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేసి ఈ వాహనాలతో అనుసంధానించారు. తిరుపతి, రాజంపేట తదితర కీలక కేంద్రాల్లో ప్రాథమికంగా సేవలు అందుబాటులోకి రానున్నాయి.

ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ హనుమాన్ ప్రాజెక్టు ద్వారా మానవ–వన్యప్రాణి సంఘర్షణను తగ్గించడం ప్రధాన లక్ష్యమన్నారు. వన్యప్రాణుల వల్ల రైతులకు కలిగే పంటనష్టం, ప్రజలకు కలిగే ప్రాణనష్టం తగ్గించడంలో ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు.

హనుమాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా ఘటనలు చోటుచేసుకున్న వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టడం, బాధితులకు తక్షణ పరిహారం అందించడం జరుగుతుందని వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వన్యప్రాణి దాడుల్లో గాయపడిన, మృతిచెందిన వారికి రూ.4 కోట్ల పరిహారం చెల్లించినట్లు వెల్లడించారు.

This post was last modified on March 3, 2026 12:23 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Pawan

Recent Posts

యష్ మీద ఒత్తిడి పెరుగుతోంది

తెలుగు, తమిళంతో పోలిస్తే మార్కెట్, బడ్జెట్ పరంగా వెనుకబడి ఉన్న కన్నడ పరిశ్రమను ఒకేసారి పది మెట్లు ఎక్కించిన సినిమా…

1 hour ago

బుచ్చిబాబు రెహమాన్ మళ్ళీ పేల్చేశారు

టాలీవుడ్ స్టార్ హీరోలందరిలోనూ ఒక ఎనర్జీ ఉంటుంది. దాన్ని సరిగ్గా వాడుకోవడం తెలిసిన దర్శకులే అద్భుతాలు చేస్తారు. సుకుమార్ చూపించబట్టే…

2 hours ago

స్వామివారి చెంతనా మీ కీచులాట?

దైవ కార్యక్రమాలు భక్తి, శ్రద్ధలకు ప్రతీకలు కావాలి. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది సంప్రదాయబద్ధంగా, ఆచార నియమాలకు అనుగుణంగా…

3 hours ago

అనుదీప్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేదెవరు?

టాలీవుడ్‌లో ఒక వెరైటీ కామెడీ టైమింగ్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు అనుదీప్ కేవీ. 'జాతిరత్నాలు' సినిమాతో బాక్సాఫీస్ వద్ద…

3 hours ago

లక్షల్లో జీతాలు… అయినా వద్దంటున్న డాక్టర్లు

భారతదేశంలో డాక్టర్ వృత్తికి ఉన్న గౌరవం అందరికీ తెలిసిందే, కానీ ఇప్పుడు అదే వృత్తిలో ఉన్నవారు తమ పిల్లలను డాక్టర్లుగా…

8 hours ago

ఇంగ్లాండ్‌పై భారత్ రివెంజ్ తీర్చుకుంటుందా?

ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌తో తలపడేందుకు టీమ్ ఇండియా సిద్ధమైంది. ముంబైలోని వాంఖడే…

14 hours ago