Political News

వాహ్ పవన్.. వన్య ప్రాణులకు అంబులెన్సులు

ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొని అటవీ శాఖకు అంబులెన్సులు, ప్రత్యేక వాహనాలను ప్రారంభించారు.

ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ చేపట్టిన ‘హనుమాన్’ ప్రాజెక్టు కింద మొత్తం 100 వాహనాలను కేటాయించారు. గాయపడిన వన్యప్రాణులను తక్షణం రక్షించేందుకు, మానవ, వన్యప్రాణి ఘర్షణలను తగ్గించేందుకు ఈ వాహనాలు ఉపయోగపడనున్నాయి.

ఈ అంబులెన్సుల్లో జంతువులను తరలించేందుకు హైడ్రాలిక్ లిఫ్టులు, అత్యవసర శస్త్రచికిత్స పరికరాలు, మందులు, రక్త పరీక్షల కోసం మైక్రోస్కోపులు, రెస్క్యూ గేర్ వంటి అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలోనే చికిత్స అందించే మొబైల్ వెటర్నరీ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి.

రాష్ట్రవ్యాప్తంగా 19 ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేసి ఈ వాహనాలతో అనుసంధానించారు. తిరుపతి, రాజంపేట తదితర కీలక కేంద్రాల్లో ప్రాథమికంగా సేవలు అందుబాటులోకి రానున్నాయి.

ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ హనుమాన్ ప్రాజెక్టు ద్వారా మానవ–వన్యప్రాణి సంఘర్షణను తగ్గించడం ప్రధాన లక్ష్యమన్నారు. వన్యప్రాణుల వల్ల రైతులకు కలిగే పంటనష్టం, ప్రజలకు కలిగే ప్రాణనష్టం తగ్గించడంలో ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు.

హనుమాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా ఘటనలు చోటుచేసుకున్న వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టడం, బాధితులకు తక్షణ పరిహారం అందించడం జరుగుతుందని వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వన్యప్రాణి దాడుల్లో గాయపడిన, మృతిచెందిన వారికి రూ.4 కోట్ల పరిహారం చెల్లించినట్లు వెల్లడించారు.

Kumar

Recent Posts

డిజిటల్ పాఠం నేర్పిస్తున్న పెద్ది ఫలితం

థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…

4 minutes ago

పోక్సో కేసు నిందితుడికి బెయిలు రానివ్వకూడదు: రేవంత్ తో పవన్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘ‌ట‌న దారుణం`` అని…

30 minutes ago

ప్రజాధనం అంటే పవన్ ఒప్పుకోరు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…

31 minutes ago

ముద్ర‌గ‌డ పాడె మోసిన జ‌గ‌న్‌

కాపు ఉద్య‌మ నాయ‌కుడు, మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం అంత్య‌క్రియ‌లు ముగిశాయి. తూర్పుగోదావ‌రి జిల్లా కిర్లంపూడిలోని ఆయ‌న ఇంటి ప్రాంగ‌ణంలోనే…

1 hour ago

బాబు సర్కారును పొగిడిన కేటీఆర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్‌నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…

1 hour ago

అభిమానం తోడుతో… ఇంటికి చేరిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌!

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుప‌త్రి నుంచి  డిశ్చార్జ్ అయి..…

2 hours ago