ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొని అటవీ శాఖకు అంబులెన్సులు, ప్రత్యేక వాహనాలను ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ చేపట్టిన ‘హనుమాన్’ ప్రాజెక్టు కింద మొత్తం 100 వాహనాలను కేటాయించారు. గాయపడిన వన్యప్రాణులను తక్షణం రక్షించేందుకు, మానవ, వన్యప్రాణి ఘర్షణలను తగ్గించేందుకు ఈ వాహనాలు ఉపయోగపడనున్నాయి.
ఈ అంబులెన్సుల్లో జంతువులను తరలించేందుకు హైడ్రాలిక్ లిఫ్టులు, అత్యవసర శస్త్రచికిత్స పరికరాలు, మందులు, రక్త పరీక్షల కోసం మైక్రోస్కోపులు, రెస్క్యూ గేర్ వంటి అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలోనే చికిత్స అందించే మొబైల్ వెటర్నరీ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి.
రాష్ట్రవ్యాప్తంగా 19 ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేసి ఈ వాహనాలతో అనుసంధానించారు. తిరుపతి, రాజంపేట తదితర కీలక కేంద్రాల్లో ప్రాథమికంగా సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ హనుమాన్ ప్రాజెక్టు ద్వారా మానవ–వన్యప్రాణి సంఘర్షణను తగ్గించడం ప్రధాన లక్ష్యమన్నారు. వన్యప్రాణుల వల్ల రైతులకు కలిగే పంటనష్టం, ప్రజలకు కలిగే ప్రాణనష్టం తగ్గించడంలో ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు.
హనుమాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా ఘటనలు చోటుచేసుకున్న వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టడం, బాధితులకు తక్షణ పరిహారం అందించడం జరుగుతుందని వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వన్యప్రాణి దాడుల్లో గాయపడిన, మృతిచెందిన వారికి రూ.4 కోట్ల పరిహారం చెల్లించినట్లు వెల్లడించారు.
This post was last modified on March 3, 2026 12:23 pm
తమిళనాడు రాజకీయాల్లో ఏర్పడ్డ కొత్త సమీకరణాలు దేశ రాజకీయాల్లో పెను మార్పునకు దారి తీశాయని చెప్పక తప్పదు. మరో మూడేళ్లలో…
బతుకుదెరువు కోసం విదేశం వెళ్లిన ఏపీకి చెందిన ముస్లిం మహిళ అక్కడ విష వలయంలో చిక్కుకుంది. ఆ ఉచ్చు నుంచి…
ఇటీవలే కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారి తిమ్మరాజుపల్లి టీవీ తీశారు. మొదటి మూడు రోజులు తెగ హడావిడి చేశారు. గొప్ప…
దేవిశ్రీ ప్రసాద్ ని హీరోగా పరిచయం చేస్తూ నిర్మాత దిల్ రాజు ప్రకటించిన ఎల్లమ్మ ఇప్పటికీ రెగ్యులర్ షూటింగ్ కు…
సంగీత దర్శకులు హీరోలు కావడం తమిళ ఇండస్ట్రీలో ఇప్పటికే చూశాం. విజయ్ ఆంటోనీ, జి.వి.ప్రకాష్ కుమార్ లాంటి వాళ్లు సినీ…
ఇటీవల జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్తో డీఎంకే పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే అయితే కేవలం ఐదు సీట్లు…