గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్రకార్యాలయం భద్రతపై సీఎం చంద్రబాబు శనివారం ఉదయం సమీక్షించారు. అసలు అక్కడ ఏం జరిగిందని.. జనసేన పార్టీ సీనియర్నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ను అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం దుండగులు పార్టీ కార్యాలయంలోకి ప్రవేశించి.. కార్లను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాజకీయంగా.. జనసేనలో తీవ్ర కలకలం రేపింది. వాస్తవానికి పటిష్ట భద్రత ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు.
పవన్ అభిమానులం అంటూ.. ఎవరు వెళ్లినా.. ఊరికేనే లోపలికి కూడా రానివ్వరు. అన్ని అనుమతి పత్రా లు, మెసేజ్లు చూసిన తర్వాత.. అన్ని విధాలా వారిని పరీక్షించిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. అయితే.. శుక్రవారం మాత్రం దుండగులు లోపలికి రావడం .. విధ్వంసం సృష్టించడంతో పార్టీ నాయకులు కూడా అలెర్ట్ అయ్యారు. ఈ పరిణామాల వెనుక ఎవరు ఉన్నారన్న విషయంపై కూపీ లాగుతున్నారు. అనుమానితులను మంగళగిరి పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
ఈ వ్యవహారాలన్నీ మీడియాలో ప్రముఖంగా రావడంతో అలెర్ట్ అయిన సీఎం చంద్రబాబు.. శనివారం ఉదయమే.. మంత్రి మనోహర్కు ఫోన్ చేసి విషయం తెలుసుకున్నారు. పార్టీ కార్యాలయం భద్రత, చుట్టూ ఉన్న ఫెన్సింగ్ వంటివాటిని అడిగి తెలుసుకున్నారు. పార్టీ కార్యాలయానికి ప్రస్తుతం మూడు వైపుల మాత్రమే పటిష్టమైన గోడ ఉంది. నాలుగో వైపు.. హెలిపాడ్ కోసం స్థలాన్ని వదిలేయడంతో అటు వైపు గోడ నిర్మాణం జరగలేదని తెలుసుకున్నారు.
దీంతో పాటు.. యాక్సస్ డోర్ల ఏర్పాటు.. మరింత భద్రతా పరమైన చర్యల విషయాన్ని ఆరా తీసిన చంద్ర బాబు.. ప్రభుత్వ పరంగా ఎలాంటి భద్రత అవసరమో అడిగి తెలుసుకున్నారు. అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించేలా డీజీపీ గుప్తాను ఆయన ఆదేశించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం టీడీపీ కార్యాలయానికి ఎలాంటి భద్రతను కల్పిస్తున్నారో.. అదే భద్రతను జనసేన పార్టీ కార్యాలయానికి కూడా కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు.
This post was last modified on February 28, 2026 2:45 pm
సూర్య వీరభద్రుడు ఇంకో మూడు రోజుల్లో విడుదల కానుంది. తమిళనాడులో రాజకీయ వాతావరణం వల్ల రిలీజ్ చేయాలా వద్దాని రెండు…
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక కొన్ని రోజుల పాటు నడిచిన డ్రామాకు ఆదివారం తెరపడి, ఆదివారం నాడు తమిళ…
తెలుగులో ఒకప్పట్లా ఇబ్బడిముబ్బడిగా కమెడియన్లు లేరిప్పుడు. ఉన్న వాళ్లలో కూడా నిలకడగా నవ్వించేవాళ్లు తక్కువ. కొంచెం లేటుగా ఊపందుకుని.. వెన్నెల…
కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే, కేసు…
మొత్తం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో 40 ప్లస్ వయసులోనూ ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా, పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్న…
తమిళనాట కొత్త రాజకీయానికి తెర తీసిన స్టార్ హీరో దళపతి విజయ్… ప్రతి అడుగులోనూ తనదైన శైలి ప్రత్యేకతను చాటుతున్నారు.…