ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే.. అక్కడ ఆయన వాలిపోతున్నారు. దేశ విదేశాల్లో ఎక్కడ ఏ చిన్న అవకాశం చిక్కినా ముందుంటున్నారు. సింగపూర్ నుంచి దుబాయ్ వరకు.. ఎక్కడ పెట్టుబడుల సమావేశాలు నిర్వహించినా.. అక్కడకు వెళ్తున్నారు. అవకాశాలను ఒడిసి పట్టుకుని ఏపీకి దూసుకువస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరికొన్ని కీలక ఒప్పందాలు చేసుకున్నారు.
ఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో శుక్రవారం ప్రత్యక్షమైన చంద్రబాబు.. పలు సంస్థలతో ఐటీకి సంబంధించిన ఒప్పందాలు చేసుకున్నారు. శుక్రవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్న ముఖ్యమంత్రి ఏఐ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సదస్సుకు వచ్చిన అంతర్జాతీయ ప్రతినిధులతో ఆయన చర్చించారు. ఏపీలో ఉన్న అపార అవకాశాలను ఆయన వారికి వివరించారు. ఇండియన్ బిజినెస్ మేనేజ్మెంట్(ఐబీఎం) సహా .. ప్రముఖ సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు చర్చించారు.
ఈ క్రమంలో అమరావతిలో ఏర్పాటు చేస్తున్న క్వాంటం కంప్యూటింగ్ గురించి వివరించారు. అదేవిధంగా విశాఖలో ఏర్పాటు కానున్న డేటా కేంద్రం.. ఐటీ సంస్థల వివరాలను తెలిపారు. ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కోరారు. ఈ క్రమంలో పలు సంస్థలు.. చంద్రబాబు సమక్షంలో ఏపీ అధికారులతో ఒప్పందాలు చేసుకున్నాయి.
ఇవీ తాజా ఒప్పందాలు..
+ క్వాంటం – ఏఐ రంగాల్లో నైపుణ్యాభివృద్ధికి ఏడు సంస్థలతో ఒప్పందం.
+ ఏపీని క్వాంటం-ఏఐ హబ్ గా తీర్చిదిద్దేందుకు ఈ సంస్థలు ముందుకు వచ్చాయి.
+ క్వాంటం, ఏఐలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు అమెరికా సంస్థ ఒప్పందం.
+ ఇంటర్నేషనల్ కంప్యూటింగ్ సెంటర్.. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.
This post was last modified on February 21, 2026 7:24 am
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…