ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే.. అక్కడ ఆయన వాలిపోతున్నారు. దేశ విదేశాల్లో ఎక్కడ ఏ చిన్న అవకాశం చిక్కినా ముందుంటున్నారు. సింగపూర్ నుంచి దుబాయ్ వరకు.. ఎక్కడ పెట్టుబడుల సమావేశాలు నిర్వహించినా.. అక్కడకు వెళ్తున్నారు. అవకాశాలను ఒడిసి పట్టుకుని ఏపీకి దూసుకువస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరికొన్ని కీలక ఒప్పందాలు చేసుకున్నారు.
ఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో శుక్రవారం ప్రత్యక్షమైన చంద్రబాబు.. పలు సంస్థలతో ఐటీకి సంబంధించిన ఒప్పందాలు చేసుకున్నారు. శుక్రవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్న ముఖ్యమంత్రి ఏఐ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సదస్సుకు వచ్చిన అంతర్జాతీయ ప్రతినిధులతో ఆయన చర్చించారు. ఏపీలో ఉన్న అపార అవకాశాలను ఆయన వారికి వివరించారు. ఇండియన్ బిజినెస్ మేనేజ్మెంట్(ఐబీఎం) సహా .. ప్రముఖ సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు చర్చించారు.
ఈ క్రమంలో అమరావతిలో ఏర్పాటు చేస్తున్న క్వాంటం కంప్యూటింగ్ గురించి వివరించారు. అదేవిధంగా విశాఖలో ఏర్పాటు కానున్న డేటా కేంద్రం.. ఐటీ సంస్థల వివరాలను తెలిపారు. ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కోరారు. ఈ క్రమంలో పలు సంస్థలు.. చంద్రబాబు సమక్షంలో ఏపీ అధికారులతో ఒప్పందాలు చేసుకున్నాయి.
ఇవీ తాజా ఒప్పందాలు..
+ క్వాంటం – ఏఐ రంగాల్లో నైపుణ్యాభివృద్ధికి ఏడు సంస్థలతో ఒప్పందం.
+ ఏపీని క్వాంటం-ఏఐ హబ్ గా తీర్చిదిద్దేందుకు ఈ సంస్థలు ముందుకు వచ్చాయి.
+ క్వాంటం, ఏఐలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు అమెరికా సంస్థ ఒప్పందం.
+ ఇంటర్నేషనల్ కంప్యూటింగ్ సెంటర్.. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.
This post was last modified on February 21, 2026 7:24 am
తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించింది. 2023లో జరిగిన మూడో ఎన్నికలో ఆ…
తమిళనాడు నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రాజకీయ తెరంగేట్రం ఆదిలోనే కష్టనష్టాలను చవిచూసింది. ఎన్నికలకు కాస్తంత ముందుగా కరూర్ లో…
ఆంధ్రకింగ్ తాలూకా తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫైనల్ గా కొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చాడు.…
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు అంటే ఉద్వేగ భరితమైన వేదిక. పార్టీ విధానాలు, భవిష్యత్ దిశ, నాయకత్వ సందేశం కార్యకర్తలకు…
అనుకున్నంతా అయ్యింది. పెట్రోల్, డిజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం శుక్రవారంతో నిజమయ్యాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం…
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…