Political News

క్రికెట్ మ్యాచ్ గురించి ఎందుకు జగన్?

ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో కేటాయింపులు సరిగా లేవని విమర్శించారు. అంతేకాదు, చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ లు ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ జల్సాలు చేస్తున్నారని ఆరోపించారు. క్రికెట్ మ్యాచ్ చూసేందుకు లోకేష్ కొలంబోకు వెళ్లాలా? ఇంట్లో టీవీలో చూస్తే సరిపోదా అంటూ జగన్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

దేశంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారు ఇలా ప్రైవేటు విమానాలలో జల్సాలు చేసిన సందర్భాలున్నాయా అని జగన్ ప్రశ్నించారు. లోకేశ్ క్రికెట్ అభిమాని అని, టీవీలో మ్యాచ్ చూస్తే కనపడదా అని వెటకారంగా మాట్లాడారు. పైగా, తాను కూడా టీవీలోనే ఇండియా పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ చూశానని సెలవిచ్చారు. రాష్ట్రం అప్పులతో దివాళా తీస్తుంటే ప్రభుత్వ పెద్దలు మాత్రం డబ్బులను వృథా చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారని విమర్శించారు.

ఈ క్రమంలోనే జగన్ కామెంట్స్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఆ మ్యాచ్ వ్యవహారంపై లోకేశ్ ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారని, ఆ విషయం మరచిపోయి జగన్ మళ్లీ విమర్శించడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని ఏకిపారేస్తున్నారు.

ఆ ప్రైవేటు విమానం ఖర్చు, ఆ క్రికెట్ మ్యాచ్ టికెట్ ఖర్చు అన్నింటికీ తన దుడ్డే వాడానని లోకేశ్ చెప్పినా జగన్ కు అర్థం కాలేదని ట్రోల్ చేస్తున్నారు. అయినా, టీవీలో లైవ్ మ్యాచ్ చూడడానికి, స్టేడియంలో కూర్చొని మ్యాచ్ వీక్షించడానికి ఉన్న తేడా క్రికెట్ అభిమానులకు మాత్రమే తెలుస్తుందని, జగన్ మాదిరిగా ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడేవారికి, టీవీలో క్రికెట్ మ్యాచ్ చూసేవారికి అర్థం కాదని సెటైర్లు వేస్తున్నారు.

This post was last modified on February 19, 2026 4:31 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Jagan

Recent Posts

రక్తపాతం కోరుకుంటున్న విశ్వక్

ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…

40 minutes ago

సాక్షిపై రఘురామ దావా… అమరావతి రైతులకు కోటి

వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…

1 hour ago

వారణాసికి అన్నీ పక్కా ప్లానింగ్

రాజమౌళి సినిమాలంటే చెప్పిన డేటుకి రావు అని ప్రేక్షకులు ముందే బలంగా ఫిక్సయిపోయి ఉంటారు. ఆయన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…

2 hours ago

ఫస్ట్ టైమ్.. అసెంబ్లీలో చే’నేత’ స్టాళ్లు

ఏపీ అసెంబ్లీ స‌మావేశాల్లో ప‌లు ఆసక్తిక‌ర ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ స‌మావేశాల‌కు విద్యార్థుల‌ను అనుమ‌తిస్తున్నారు. స‌మావేశాల‌ను వారు ప్ర‌త్య‌క్షంగా…

2 hours ago

ఈసారి డీఎస్సీలో వారిపైనే ప్రత్యేక దృష్టి?

ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్ధులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. దీంతో…

3 hours ago

ఉస్తాద్ బిజినెస్ కెపాసిటీ ఎంత

ఓజి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ మీద క్రమంగా హైప్ పెంచే ప్రయత్నాలు…

5 hours ago