ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో కేటాయింపులు సరిగా లేవని విమర్శించారు. అంతేకాదు, చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ లు ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ జల్సాలు చేస్తున్నారని ఆరోపించారు. క్రికెట్ మ్యాచ్ చూసేందుకు లోకేష్ కొలంబోకు వెళ్లాలా? ఇంట్లో టీవీలో చూస్తే సరిపోదా అంటూ జగన్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
దేశంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారు ఇలా ప్రైవేటు విమానాలలో జల్సాలు చేసిన సందర్భాలున్నాయా అని జగన్ ప్రశ్నించారు. లోకేశ్ క్రికెట్ అభిమాని అని, టీవీలో మ్యాచ్ చూస్తే కనపడదా అని వెటకారంగా మాట్లాడారు. పైగా, తాను కూడా టీవీలోనే ఇండియా పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ చూశానని సెలవిచ్చారు. రాష్ట్రం అప్పులతో దివాళా తీస్తుంటే ప్రభుత్వ పెద్దలు మాత్రం డబ్బులను వృథా చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారని విమర్శించారు.
ఈ క్రమంలోనే జగన్ కామెంట్స్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఆ మ్యాచ్ వ్యవహారంపై లోకేశ్ ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారని, ఆ విషయం మరచిపోయి జగన్ మళ్లీ విమర్శించడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని ఏకిపారేస్తున్నారు.
ఆ ప్రైవేటు విమానం ఖర్చు, ఆ క్రికెట్ మ్యాచ్ టికెట్ ఖర్చు అన్నింటికీ తన దుడ్డే వాడానని లోకేశ్ చెప్పినా జగన్ కు అర్థం కాలేదని ట్రోల్ చేస్తున్నారు. అయినా, టీవీలో లైవ్ మ్యాచ్ చూడడానికి, స్టేడియంలో కూర్చొని మ్యాచ్ వీక్షించడానికి ఉన్న తేడా క్రికెట్ అభిమానులకు మాత్రమే తెలుస్తుందని, జగన్ మాదిరిగా ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడేవారికి, టీవీలో క్రికెట్ మ్యాచ్ చూసేవారికి అర్థం కాదని సెటైర్లు వేస్తున్నారు.
This post was last modified on February 19, 2026 4:31 pm
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీసుకున్న వినూత్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. బీకాం చదువుకున్న ఓ…
ఒక హీరో చేయాల్సిన సినిమా ఇంకో హీరో చేతికి వెళ్లడం సినీ పరిశ్రమలో కామన్ వ్యవహారం. ఇలా మిస్ అయిన…
ఇరవై ఏడు సంవత్సరాల క్రితం వచ్చిన దేవి సినిమాకు టాలీవుడ్ లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. అమ్మోరు లాంటి…
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై అదే పార్టీ నుంచి ఎంపీగా విజయం దక్కించుకుని.. ప్రస్తుతం…
తాము నిర్మించే సినిమాలు ఎంత నష్టం తెచ్చిపెట్టినా… తమను ఎంతగా కుదేలు చేసినా.. వాటి గురించి ఓపెన్ అవ్వడానికి నిర్మాతలు…
వైసీపీలో మరోసారి సజ్జల రామకృష్ణారెడ్డి శకం ప్రారంభం అవుతుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్..…